మతాన్ని ఓడించిన మానవత్వం!
అమ్మకు ప్రేమతో చివరి మజిలీ
‘కంటేనే అమ్మ అని అంటే ఎలా.. కరుణించే ప్రతి దేవత అమ్మే కదా...! కన్న అమ్మే కదా...!’ అన్న ఓ సినీ కవి మాటలు నిజం చేసిందా కుటుంబం. కేవలం ఐదేళ్ల పరిచయంతోనే తల్లీ బిడ్డగా అన్యోన్యంగా కలిసిపోయారు. అమ్మగా భావించిన వృద్ధురాలు అనారోగ్యం పాలైతే.. అన్నీ తానై చూసుకున్నారు. ఆమె దూరమయ్యాక మతాలు వేరైనా ఆ మాతృమూర్తికి దహన సంస్కారాలు, దశదిన కర్మలు శాస్ర్తోక్తంగా నిర్వహించి మానవత్వాన్ని చాటుకున్నారు.
ఆమె పేరు గాంధారమ్మ. విశాఖ బీచ్రోడ్డులోని అపార్ట్మెంట్లో నివాసముండేవారు. ఇక్కడే కేరళకు చెందిన అల్తాఫ్ కుటుంబం నివసించేది. అల్తాఫ్ కుటుంబానికి పరిచమైన గాంధరమ్మను కన్నతల్లిలా ఆదరించారు. ఆమె కూడా అతడిని కన్నబిడ్డలా చూసుకున్నారు. ఐదేళ్లుగా వీరు తల్లీబిడ్డలుగా కలసిమెలసి ఉన్నారు. గతనెలలో గాంధారమ్మ తీవ్ర అనారోగ్యానికి గురైంది. అల్తాఫ్ దంపతులు మాతృమూర్తిగా భావించిన గాంధారమ్మకు రాత్రిపగలూ సేవలు చేశారు. కానీ విధి ఆడిన నాటకంలో ఆమె ఓడిపోయింది.
లాక్డౌన్ వల్ల కన్నతల్లి అంత్యక్రియలకు గాంధరమ్మ కుమారుడు రాలేకపోయాడు. అయితే అల్తాఫే అన్ని తానై ఆ మాతృమూర్తికి చివరి మజిలీ నిర్వహించారు. ఇరువురి మతం వేరైనా హిందూ సంప్రదాయం ప్రకారం, కొడుకులాగా ఆ తల్లికి అంతిమసంస్కారాలు శాస్ర్తోక్తంగా కాకినాడలో నిర్వహించారు. ఆమె కుమారుడు, కుమార్తె సమక్షంలో స్వయంగా పిండప్రదానాలు, తర్పణాలు వదిలారు. అనంతరం సముద్రస్నానాలు చేశారు. మతాలు వేరైనా తల్లీ కుమారుడి ప్రేమకు నిదర్శనంగా నిలిచారు. ఈ విషయంలో అల్తాఫ్ భార్య ముస్ర్తీయాని కూడా భర్తకు సహకరించారు.
మనిషికి మనిషే సాయపడాలి: అల్తాఫ్
‘‘మా ఇంటి పక్కనే ఉన్నా.. కుటుంబ సభ్యురాలిగా భావించాం ఆమెను. 84ఏళ్లు ఆమెకు. రెండేళ్లుగా అమ్మకి ఆరోగ్యం బాగోకపోవడం.. ఇటీవల మరింత క్షీణించడంతో ఆమె చనిపోయారు. మనిషికి మనిషే సాయపడాలి. అక్కడ మతం, కులం అడ్డురాకూడదు అనే ఉద్దేశంతో మేం దీనికి పూనుకున్నాం’’ అని చెప్పారు. సంప్రదాయం ప్రకారం తమ తల్లికి అంతిమ సంస్కారాలు, దశదిన కర్మను నిర్వహించినందుకు గాంధారమ్మ బిడ్డలు అల్తాఫ్ను అభినందించారు.
-ఇంటర్నెట్ డెస్క్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
నాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
మీరు పెద్ద రాజకీయ యుద్ధాన్ని ఎదుర్కోనున్నారు.. జనసేనకు మద్దతు ప్రకటించిన నాని
జనసేన పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు తెలుపుతూ నాని పోస్ట్ పెట్టారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
దావత్ కావాలా నాయనా!.. వ్యవసాయ క్షేత్రాల్లో కార్యకర్తల ఖుషీ
ఎన్నికల పండుగొచ్చింది.. దావత్ల మీద దావత్లు ఏర్పాటవుతున్నాయి. కార్యకర్తలను మచ్చిక చేసుకోవడానికి, ప్రచారంలో జోరు ఉండటానికి నాయకులు విందు కార్యక్రమాలను ఎంచుకుంటున్నారు. -
ఆదర్శ కేంద్రం.. ఓటుకు కదులుదాం
లోక్సభ ఎన్నికల్లో శతశాతం ఓటింగ్ లక్ష్యంగా ఎన్నికల సంఘం ప్రత్యక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఓటరు చైతన్య కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. దివ్యాంగులు, 85 ఏళ్లకు పైబడిన వారికి ఇంటి నుంచే ఓటు హక్కు వినియోగించే అవకాశం కల్పించారు. -
పోస్టల్ బ్యాలెట్ ఇంకా రెండు రోజులే!
ఆదిలాబాద్ లోక్సభ నియోజకవర్గంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు 16,972 మంది పోస్టల్ బ్యాలెట్ నమోదు చేసుకోగా.. ఇప్పటి వరకు 5,200 మంది మాత్రమే వినియోగించుకున్నారు. -
రూ.2 చెల్లించు.. ఛాలెంజ్ ఓటేయ్
ఛాలెంజ్ ఓటు.. దీని గురించి ఎన్నికల సమయంలో వింటుంటాం. ఎన్నికల నిర్వహణ నిబంధనలు 1961 చట్టంలోని సెక్షన్ 49ఏలో వివరాలు ఉంటాయి. పలు సందర్భాలలో ఒకరి ఓటును మరొకరు వేస్తారు. -
భాజపా అభ్యర్థితో కాదు ప్రధానితోనే పోటీ
మనకు పోటీ భాజపా అభ్యర్థితో కాదని, ప్రధాని నరేంద్ర మోదీతోనే పోటీ అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ పేర్కొన్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (07/05/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
ఆ లెక్కలు నాకు తెలియదు.. అతడు మా జట్టులో ఉండటం అదృష్టం: హార్దిక్ పాండ్య
-
సిద్ధార్థ్ వల్లే ప్రేమపై నమ్మకం పెరిగింది: అదితి రావ్
-
ఇజ్రాయెల్ ఆధీనంలో రఫా క్రాసింగ్
-
దటీజ్ ధోనీ.. లోయర్ ఆర్డర్లో ఎందుకొస్తున్నాడో తెలుసా..?
-
మీరు పెద్ద రాజకీయ యుద్ధాన్ని ఎదుర్కోనున్నారు.. జనసేనకు మద్దతు ప్రకటించిన నాని