అధికారులపై దాడులు దారుణం: లోకేశ్‌

ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన అధికారులపై దాడులకు దిగడం దారుణమని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ అన్నారు. చిత్తూరు జిల్లా ములకలచెరువు ఎంపీడీవో రమేశ్‌పై వైకాపా నేతల దాడిని హేయమైన చర్యగా లోకేశ్‌ అభివర్ణించారు. గ్రామాల్లో వైకాపా నాయకుల..

Published : 06 Jan 2020 01:27 IST

చిత్తూరు: ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన అధికారులపై దాడులకు దిగడం దారుణమని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ అన్నారు. చిత్తూరు జిల్లా ములకలచెరువు ఎంపీడీవో రమేశ్‌పై వైకాపా నేతల దాడిని హేయమైన చర్యగా లోకేశ్‌ అభివర్ణించారు. గ్రామాల్లో వైకాపా నాయకుల అరాచకాలు తారాస్థాయికి చేరాయని, తప్పుడు పనులకు సహకరించాలని ఒత్తిడి తెస్తున్నారని లోకేశ్‌ దుయ్యబట్టారు. అందుకు సహకరించని అధికారులపై దాడులకు పాల్పడుతున్నారని విమర్శించారు. అధికారులకే రక్షణ లేనప్పుడు ప్రజలకు ఎక్కడ ఉటుందని లోకేశ్‌ ప్రశ్నించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని