అత్యవసర మినహా మిగతా సేవలన్నీ రద్దు
దేశవ్యాప్తంగా అత్యవసర మినహా అన్ని సేవలను నిలిపివేయాలని ఇప్పటికే స్పష్టమైన నిబంధనలు విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం.. వాటి నిర్వహణ బాధ్యతలను జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్డీఎమ్ఏ)కు అప్పగించింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ మార్గదర్శకాలు విడుదల చేసింది.అనంతరం దీనికి అనుగుణంగా జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది.
మార్గదర్శకాలు విడుదల చేసిన కేంద్ర హోం శాఖ
దిల్లీ: దేశవ్యాప్తంగా అత్యవసర మినహా అన్ని సేవలను నిలిపివేయాలని ఇప్పటికే స్పష్టమైన నిబంధనలు విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం.. వాటి నిర్వహణ బాధ్యతలను జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్డీఎమ్ఏ)కు అప్పగించింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ మార్గదర్శకాలు విడుదల చేసింది.అనంతరం దీనికి అనుగుణంగా జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం రక్షణ, కేంద్ర పారా మిలటరీ బలగాలు, ట్రెజరీ, ఇంధన, గ్యాస్, విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ, తపాలా సేవలు, జాతీయ సమాచార వ్యవస్థ, ముందస్తు హెచ్చరికల కేంద్రాలు, విపత్తు నిర్వహణ మినహా అన్ని కేంద్ర ప్రభుత్వ, ప్రభుత్వ రంగ, స్వతంత్ర వ్యవస్థలన్నీ మూసివేయాలి. రాష్ట్రాల్లో పోలీసు, హోం గార్డ్స్, పౌర రక్షణ, అగ్నిమాపక, జైళ్లు, జిల్లా పరిపాలన, ట్రెజరీ, విద్యుత్, పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా మినహా అన్ని సేవలు నిలిపివేయాలి. ఆసుపత్రి, అనుబంధ వ్యవస్థల నిర్వహణ, ఔషధ దుకాణాలు, వైద్య పరికరాల దుకాణాలు, ల్యాబ్లు, అంబులెన్స్ లు, వైద్య రంగంలో పనిచేసే సిబ్బందికి నిబంధనలను సడలించారు. రేషన్ దుకాణాలు, ఆహార పదార్థాలు, పండ్లు, కూరగాయలు, పాలు, మాంసం, చేపల దుకాణాలకు కూడా మినహాయింపు వర్తించనుంది.
బ్యాంక్లు, బీమా కార్యాలయాలు, ఏటీఎంలు, ప్రింట్, అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, టెలీ కమ్యూనికేషన్, ఇంటర్నెట్ వ్యవస్థలు, కేబుల్ సేవలకు నిబంధనల నుంచి మినహాయింపు ఇచ్చారు. ఇ కామర్స్ ద్వారా ఆహార పదార్థాలు, ఔషధాలు, వైద్య పరికరాలు సరఫరా చేసే వారికి, పెట్రోల్ పంపు, గ్యాస్ కేంద్రాలకు, క్షేత్ర స్థాయిలో విద్యుత్ రంగ ఉద్యోగులతోపాటు, శీతల కేంద్రాలు, గిడ్డంగులకు, ప్రైవేటు సెక్యూరిటీ ఏజెన్సీలు, నిత్యావసరాల తయారీ యూనిట్లకు మినహాయింపు వర్తించనుంది.ఇతర ఉత్పత్తుల సంస్థలు తమ కార్యకలాపాలను సాగించేందుకు విధిగా రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సిందేనని కేంద్రం పేర్కొంది. అత్యవసర సేవలు మినహా మిగిలిన రవాణా వ్యవస్థలన్నీ నిలిపివేయాలని స్పష్టం చేసింది. అన్ని సామాజిక, రాజకీయ, క్రీడా, వినోద, విద్య, సాంస్కృతిక కార్యక్రమాలన్నీ రద్దు చేసింది. ఫిబ్రవరి 15 తరువాత విదేశాల నుంచి వచ్చిన వారు ఎవరైనా అధికారుల సూచన మేరకు వ్యవహరించాల్సిందేని స్పష్టం చేసింది. నిబంధనలను ఉల్లంఘించినవారు ఐపీసీ సెక్షన్ 188 ప్రకారం శిక్షార్హులవుతారని కేంద్రం వెల్లడించింది. కేంద్రం పేర్కొన్న ఈ నిబంధనలన్నీ అర్ధరాత్రి నుంచి పూర్తి స్థాయిలో అమల్లోకి రానున్నాయి. నిబంధనలు సక్రమంగా అమలయ్యేలా చూసే బాధ్యతను జిల్లా న్యాయాధికారికి అప్పగించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
యువత ఓటింగ్లో పాల్గొనేలా చేద్దాం: సంజయ్ ఉపాధ్యాయ
విద్యా వంతులు, యువత ఓటింగ్ ప్రక్రియకు దూరంగా ఉండటం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని వర్కింగ్ జర్నలిస్ట్స్ ఆఫ్ ఇండియా (WJI) జాతీయ అధ్యక్షుడు సంజయ్ ఉపాధ్యాయ అన్నారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్పై దాడి.. పోలీసుల సమక్షంలోనే వైకాపా అరాచకం
అనకాపల్లి జిల్లా మాడుగుల మండలం తారువలో వైకాపా నేతలు దౌర్జన్యం పరాకాష్ఠకు చేరింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
సీఎం రేవంత్రెడ్డిని కలిసిన రోహిత్ వేముల తల్లి..
సీఎం రేవంత్రెడ్డిని రోహిత్ వేముల తల్లి రాధిక కలిశారు. తమకు న్యాయం జరిగేలా చూడాలని ఆయనకు విజ్ఞప్తి చేశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (04/05/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు. -
ఎల్పీయూ సత్తా.. వర్సిటీ విద్యార్థికి ₹3 కోట్ల ప్యాకేజీ (ADVT)
ఉన్నత విద్యలో లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సటీ (LPU) తన జైత్రయాత్ర కొనసాగిస్తోంది. ప్రాంగణ నియామకాల్లో కొత్త రికార్డులను నెలకొల్పుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
డీమార్ట్ లాభం రూ.563 కోట్లు.. కొత్తగా మరో 41 స్టోర్లు
-
ఫ్రీగా ఇస్తాం.. ఈ విల్లా తీసుకోండి..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మనీ స్వైపింగ్ స్కామ్.. బ్యాంక్ మెసేజ్లతో కొత్త మోసం!
-
కొనసాగుతున్న లేఆఫ్లు.. 4 నెలల్లో 80 వేల మంది ఉద్యోగులపై వేటు
-
ఓటీటీలో విజయ్ ఆంటోనీ కొత్త మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?