నా వేలు పట్టుకున్నప్పుడే భరోసా ఇచ్చాను
కరోనా లాక్డౌన్ కాలంలో వైద్యులు, పోలీసులే ప్రజలకు ఎంతో భరోసాగా ఉంటున్నారు.
ముంబయి: కరోనా లాక్డౌన్ కాలంలో వైద్యులు, పోలీసులే ప్రజలకు ఎంతో భరోసాగా ఉంటున్నారు. మహారాష్ట్రలోని ఆలీబాగ్లో కూడా ఓ వైద్యుడి అప్రమత్తత అప్పుడే పుట్టిన చిన్నారి ప్రాణాన్ని నిలిపింది. ఆ బిడ్డలో శ్వాస సంబంధ ఇబ్బంది తలెత్తడంతో స్వయంగా వైద్యుడే ద్విచక్రవాహనం మీద ఆసుపత్రి తీసుకెళ్లి తన వృత్తికి మరింత గౌరవం తెచ్చారు.
శుక్రవారం అలీబాగ్కు చెందిన శ్వేతా పాటిల్ అనే మహిళలకు పురిటి నొప్పులు రావడంతో లాక్డౌన్ కారణంగా ఆమె భర్త దగ్గర్లో ఉన్న నర్సింగ్ హోమ్కు తీసుకెళ్లారు. ఆమెకు మధుమేహంతో కూడా ఉండటంతో వైద్యుల పర్యవేక్షణలో ఉంచాల్సిన అవసరం వచ్చిందని ఆమె భర్త వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితుల్లో అవేమీ కుదర్లేదు. అంతేకాకుండా శ్వాస సంబంధ సమస్యలతో గతంలో ఆమె తన మొదటి బిడ్డను కోల్పోయింది. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని, ఆమె మెడికల్ హిస్టరీ తెలిసిన నర్సింగ్ హోమ్ వైద్యుడు ముందు జాగ్రత్తగా పిల్లల వైద్యుడు రాజేంద్రను అందుబాటులో ఉంచారు. తరవాత ఆమెకు సిజేరియన్ చేయగా, పండంటి మగపిల్లాడికి జన్మనిచ్చింది. పుట్టిన పిల్లాడిని గమనించిన వైద్యుడు అంతా బాగానే ఉందని తల్లిదండ్రులకు వెల్లడించారు. అయితే అంతలోనే శిశువుకు శ్వాస సంబంధ ఇబ్బంది తలెత్తడంతోపాటు, శరీరమంతా నీలంగా మారింది. ఆ చిన్నారికి అత్యవసరంగా నియోనాటల్ కేర్ అవసరమని రాజేంద్ర గుర్తించారు. కానీ లాక్డౌన్ కారణంగా ఎలాంటి రవాణా సౌకర్యం లేకపోవడంతో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ద్విచక్రవాహనం మీద ఆసుపత్రికి తీసుకెళ్లారు. శిశువుకు వైద్యం అందించి, కోలుకున్న తరవాత ఆయన మాట్లాడుతూ.. ‘ఆ శిశువుకు నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చికిత్స అందించాను. 12 గంటల తరవాత అంతా సద్దుమణిగింది. ఇది నాకు గొప్ప అనుభవం. నేను వైద్యం చేసేప్పుడు ఆ చిన్నారి నా వేలును గట్టిగా పట్టుకున్నాడు. నీకేంకాదు అనే ధైర్యాన్ని వాడికి ఇవ్వాలనుకున్నాను’ అని సంతోషంగా వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
Viral Video: స్పైడర్ మ్యాన్, స్పైడర్ ఉమెన్ దుస్తుల్లో దిల్లీ రోడ్లపై చక్కర్లు కొట్టిన జంటను పోలీసులు అరెస్టు చేశారు. ఎందుకంటే? -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ సంచలన ఆరోపణలు చేశారు. -
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
రాష్ట్రంలో 3 రోజుల పాటు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!