గ్రీన్‌, ఆరెంజ్‌ జోన్లలో క్షౌరశాలలకు అనుమతి

ఈ నెల 4వ తేదీనుంచి మొదలుకానున్న లాక్‌డౌన్‌ మూడో దశలో మరిన్ని కార్యకలాపాల నిర్వహణకు కేంద్ర హోంశాఖ వెసులుబాటు కల్పించింది. తాజాగా...

Published : 02 May 2020 16:45 IST

న్యూదిల్లీ: ఈ నెల 4వ తేదీ నుంచి మొదలుకానున్న లాక్‌డౌన్‌ మూడో దశలో మరిన్ని కార్యకలాపాల నిర్వహణకు కేంద్ర హోంశాఖ అవకాశం కల్పించింది. దేశవ్యాప్తంగా రెడ్‌ జోన్లు మినహాయించి గ్రీన్‌, ఆరెంజ్‌ జోన్లలో క్షౌరశాలలు, సెలూన్లు తెరుచుకోవచ్చని శనివారం ప్రకటించింది. దీంతోపాటు ఈ- కామర్స్‌ ప్లాట్‌ఫాంల ద్వారా అన్ని రకాల వస్తువుల విక్రయాలకు పచ్చజెండా ఊపింది. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను ఈ నెల 17వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు కేంద్రం శుక్రవారం ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో పాటు జోన్లవారీగా ఆయా కార్యకలాపాల నిర్వహణకూ అనుమతి ఇచ్చింది.

గ్రీన్‌ జోన్లలో..
* 50% సీటింగ్‌ సామర్థ్యంతో బస్సులు నడుపుకోవచ్చు.
* 50% సిబ్బందితో బస్సు డిపోలు పనిచేయొచ్చు.
* దేశవ్యాప్తంగా నిషేధించిన కార్యకలాపాలు మినహా అన్నిరకాల కార్యకలాపాలకు అనుమతి ఉంటుంది.
* వైరస్‌ వ్యాప్తిని నివారించేందుకుగాను స్థానిక పరిస్థితులకు అనుగుణంగా నియంత్రణలు అవసరమని భావిస్తే.. ఈ జోన్లలోనూ ఎంపిక చేసిన కార్యకలాపాలనే అనుమతించేందుకు రాష్ట్రాలకు అధికారం ఉంటుంది.


ఆరెంజ్‌ జోన్లలో..
(కంటెయిన్‌మెంట్‌ జోన్ల బయట)
* జిల్లాల్లో అంతర్గతంగాగానీ, జిల్లాల మధ్యగానీ బస్సులు నడపడానికి వీల్లేదు.
ట్యాక్సీలు, క్యాబ్‌ల్లో ఒక డ్రైవర్‌, ఇద్దరు ప్రయాణికులకు అనుమతి ఉంటుంది.
* అనుమతించిన కార్యకలాపాల కోసం ప్రైవేటు వాహనాలు జిల్లాల మధ్య రాకపోకలు సాగించొచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని