అందుకే మద్యం ధరలు పెంచాం: శ్రీనివాస్గౌడ్
రాష్ట్రంలో మద్యం దుకాణాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని రకాల చర్యలు తీసుకున్నట్లు అబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ వెల్లడించారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో విధించిన లాక్డౌన్
హైదరాబాద్: రాష్ట్రంలో మద్యం దుకాణాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని రకాల చర్యలు తీసుకున్నట్లు అబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ వెల్లడించారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో విధించిన లాక్డౌన్ కారణంగా దాదాపు నెలన్నర తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి. దీంతో మందు బాబులు మద్యం కోసం దుకాణాల వద్ద క్యూ కట్టారు. ఈ నేపథ్యంలో నాంపల్లి అబ్కారీ భవన్లో ఆ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి సమావేశమయ్యారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘మద్యం అందుబాటులో లేకపోతే మళ్లీ గుడుంబా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అలా జరగకూడదనే రాష్ట్రంలో గుడుంబా నివారణకు ఎన్నో చర్యలు తీసుకున్నాం. జడ్చర్లలో గుడుంబా తయారీని అడ్డుకునేందుకు యత్నించిన సిబ్బందిపై దాడి చేశారు. తెలంగాణ సరిహద్దు రాష్ట్రాలు ముందుగానే మద్యం దుకాణాలను తెరిచాయి. రాష్ట్రంలో మద్యం లభించకపోవడంతో వేరే రాష్ట్రాల నుంచి కల్తీ మద్యం కూడా వచ్చింది. ఇప్పటివరకు అక్రమంగా గుడుంబా తరలిస్తున్న వారిపై 2,409 కేసులు నమోదు చేసి 2,089 మందిని అరెస్టు చేశాం. దాదాపు 11,130 లీటర్ల గుడుంబాను సీజ్ చేశాం. ఇన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ సరిహద్దుల మీదుగా లారీల కొద్ది బెల్లం అక్రమంగా రవాణా చేస్తున్నారు. మరోవైను సారాకు కలర్ కలిపి విస్కీలా విక్రయిస్తున్నారు. కల్తీ మద్యాన్ని బ్రాండ్ పేరు మార్చి అమ్ముతున్నారు. ఇది ఒక మాఫియాలా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో జిల్లా ఉన్నతాధికారులు, మంత్రుల అభిప్రాయాలు తీసుకున్నాకే మద్యం దుకాణాలు తెరావాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు’’ అని మంత్రి వివరించారు.
రాష్ట్రంలో మద్యం కొరత ఏర్పడే అవకాశం లేదని.. తగినన్ని నిల్వలు ఉన్నాయని శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. పక్క రాష్ట్రంలో 75 శాతం వరకు మద్యం ధరలు పెంచడంతో తప్పనిసరి పరిస్థితుల్లో మన రాష్ట్రంలో సగటున 16శాతం పెంచామన్నారు. మద్యం దుకాణాల వద్ద భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని నిర్వాహకులను ఆదేశించినట్లు చెప్పారు. నగరంలో దుకాణాల వద్ద పరిస్థితులను పరిశీలించి నిబంధనలు పాటించని 28 మద్యం దుకాణాలపై కేసులు నమోదు చేసి లైసెన్స్ రద్దు చేసినట్లు మంత్రి తెలిపారు. మాస్కులు లేని వారికి మద్యం విక్రయించరాదని.. ప్రభుత్వం నిర్దేశించిన నియమాలను కచ్చితంగా అమలు చేయాలని శ్రీనివాస్గౌడ్ స్పష్టం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
Viral Video: స్పైడర్ మ్యాన్, స్పైడర్ ఉమెన్ దుస్తుల్లో దిల్లీ రోడ్లపై చక్కర్లు కొట్టిన జంటను పోలీసులు అరెస్టు చేశారు. ఎందుకంటే? -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ సంచలన ఆరోపణలు చేశారు. -
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
రాష్ట్రంలో 3 రోజుల పాటు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!