ఆర్జీఐఏలో 25నుంచి విమానాల రాకపోకలు
హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఆర్జీఐఏ) ద్వారా ఈ నెల 25వ తేదీ నుంచి దేశీయ విమానాల రాకపోకలు మొదలవుతాయని.. అందుకు సర్వం సిద్ధం చేసినట్లు ఆర్జీఐఏ సీఈవో ఎస్జీకే కిషోర్ వెల్లడించారు. ఈ మేరకు విమానాశ్రయంలో..
శంషాబాద్: హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఆర్జీఐఏ) ద్వారా ఈ నెల 25వ తేదీ నుంచి దేశీయ విమానాల రాకపోకలు మొదలవుతాయని.. అందుకు సర్వం సిద్ధం చేసినట్లు ఆర్జీఐఏ సీఈవో ఎస్జీకే కిషోర్ వెల్లడించారు. ఈ మేరకు విమానాశ్రయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. విమానాశ్రయంలో సురక్షితమైన, ఆరోగ్యకరమైన వాతావరణం కోసం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు సీఈవో తెలిపారు. హైదరాబాద్ విమానాశ్రయం గుండా ప్రయాణించే వారి కోసం క్యూలైన్లలో నిలబడే అవసరం లేకుండానే బోర్డింగ్ పాసులు పొందేందుకు ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ప్రయాణికులు భౌతిక దూరం పాటించేలా విమానాశ్రయంలో ప్రత్యేకంగా గుర్తులు ఏర్పాటు చేశామన్నారు. ప్రయాణికులు విమానాశ్రయంలోకి ప్రవేశించింది మొదలు తిరిగి వెళ్లే వరకు పూర్తి స్థాయిలో శానిటైజర్స్ అందుబాటులో ఉంచినట్లు వివరించారు. ప్రయాణికుల లగేజీలు తీసుకెళ్లే ట్రాలీలను శానిటైజ్ చేసేందుకు ప్రత్యేకంగా డిసిన్ఫెక్టివ్ టన్నెల్స్ ఏర్పాటు చేశామన్నారు. విమానాల్లో ఆహారం తీసుకునేందుకు అనుమతి లేదని.. ప్రయాణికులు మాస్క్లు తప్పనిసరిగా ధరించాలని సీఈవో కిషోర్ వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
రాష్ట్రంలో 3 రోజుల పాటు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
-
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్