వలస కార్మికులపై బిస్కట్లను విసిరిన ఉద్యోగి
శ్రామిక్ రైలులో ఇటీవల స్వస్థలాలకు వెళ్తున్న వలసకార్మికుల పట్ల ఉత్తర్ప్రదేశ్ రైల్వే సిబ్బంది ప్రవర్తించిన తీరు వివాదాస్పదంగా మారింది. దీంతో సంబంధిత అధికారిపై వేటు పడింది...
విషయం తెలిసి సంబంధిత అధికారిపై రైల్వే శాఖ వేటు..
లఖనవూ: శ్రామిక్ రైలులో ఇటీవల స్వస్థలాలకు వెళ్తున్న వలసకార్మికుల పట్ల ఉత్తర్ప్రదేశ్ రైల్వే సిబ్బంది ప్రవర్తించిన తీరు వివాదాస్పదంగా మారింది. దీంతో సంబంధిత అధికారిపై వేటు పడింది. వివరాల్లోకెళితే.. మే 25న ఓ శ్రామిక్ రైలు ఫిరోజాబాద్ రైల్వేస్టేషన్లో ఆగి ఉన్నప్పుడు డీకే దీక్షిత్ అనే ఓ రైల్వే ఉద్యోగి తన సిబ్బందితో కలిసి వలసదార్లకు బిస్కట్ ప్యాకెట్ల పంపిణీ చేపట్టాడు. ఆ సిబ్బంది ప్యాకెట్లను నేరుగా ప్రయాణికుల చేతికి ఇవ్వకుండా ప్లాట్ఫామ్ పైనుంచే రైల్లోకి విసిరారు. తమ అధికారి పుట్టిన రోజు సందర్భంగా బిస్కట్లు ఇస్తున్నామని చెప్పారు. కొందరికి ఆ ప్యాకెట్లు అందకపోవడంతో మరిన్ని అడిగారు. అందుకు వారిని దూషిస్తూ వేరే వాళ్లకు ఇచ్చిన వాటిని పంచుకోవాలని బాధ్యతారాహిత్యంగా చెప్పడం గమనార్హం.
ఈ ఘటనంతా ఓ వీడియోలో రికార్డవ్వగా అది స్థానిక రైల్వే ఉద్యోగుల వాట్సాప్ గ్రూపులో చేరింది. అది కాస్త సామాజిక మాధ్యమాలకు చేరడంతో ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. సంబంధిత అధికారి దీక్షిత్ను సస్పెండ్ చేశారు. కరోనా వైరస్ నేపథ్యంలో మార్చిలో లాక్డౌన్ విధించగా, అప్పటి నుంచీ లక్షలాది మంది వలసదార్లు కాలిబాటన స్వస్థలాలకు పయనమయ్యారు. ఈ క్రమంలో అనేక మంది ప్రమాదాలబారిన పడి మృతిచెందారు. దీంతో ఇటీవల కేంద్ర ప్రభుత్వం శ్రామిక్ రైళ్లను ఏర్పాటు చేసి వలస కార్మికులను స్వస్థలాలకు చేరుస్తోంది. అయితే, ఈ ప్రత్యేక రైళ్లలో సరైన వసతులు లేవని చాలా మంది ఫిర్యాదులు చేశారు.
ఇవీ చదవండి:
2,416 మంది పోలీసులకు కరోనా!
క్వారంటైన్లో ప్రసవ వేదన
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
Viral Video: స్పైడర్ మ్యాన్, స్పైడర్ ఉమెన్ దుస్తుల్లో దిల్లీ రోడ్లపై చక్కర్లు కొట్టిన జంటను పోలీసులు అరెస్టు చేశారు. ఎందుకంటే? -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ సంచలన ఆరోపణలు చేశారు. -
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
రాష్ట్రంలో 3 రోజుల పాటు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!