సుధాకర్ కేసులో సీబీఐ ముమ్మర దర్యాప్తు
డాక్టర్ సుధాకర్ వ్యవహారంలో విశాఖ కేజీహెచ్లో రెండో రోజు సీబీఐ అధికారులు దర్యాప్తు కొనసాగుతోంది. శనివారం విశాఖలోని ప్రభుత్వ మానసిక వైద్యశాలకు వెళ్లి డాక్టర్ సుధాకర్ను, అక్కడి వైద్య నిపుణులను
సీసీటీవీ ఫుటేజీల స్వాధీనం
విశాఖ: డాక్టర్ సుధాకర్ వ్యవహారంలో విశాఖ కేజీహెచ్లో రెండో రోజు సీబీఐ అధికారులు దర్యాప్తు కొనసాగుతోంది. శనివారం విశాఖలోని ప్రభుత్వ మానసిక వైద్యశాలకు వెళ్లి డాక్టర్ సుధాకర్ను, అక్కడి వైద్య నిపుణులను అధికారులు విచారించిన విషయం తెలిసిందే. ఆసుపత్రిలోని పలు రికార్డులను సైతం అధికారులు పరిశీలించారు. దర్యాప్తులో భాగంగా ఇద్దరు వైద్యులు, హౌస్సర్జన్ల నుంచి వాంగ్మూలాన్ని అధికారులు ఇప్పటికే నమోదు చేసుకున్నారు. తాజాగా ఇవాళ విచారణలో భాగంగా సుధాకర్ను ఆస్పత్రికి తీసుకొచ్చినప్పటి నుంచి వెళ్లేవరకు ఏం జరిగిందనే విషయాన్ని పరిశీలించేందుకుగాను కేజీహెచ్లోని సీసీటీవీ ఫుటేజీలను తీసుకున్న సీబీఐ అధికారులు వాటిని పరిశీలిస్తున్నారు. మెడికో లీగల్ కేసు అయినందున ఎంఎల్సీ రికార్డును సైతం అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. విశాఖలో పోలీసులు అరెస్టు చేసిన తర్వాత అంత తొందరగా మానసిక వైద్యశాలలో ఎందుకు చేర్చాల్సివచ్చిందనే కోణంలో కూడా సీబీఐ అధికారులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
సీఎస్ జవహర్రెడ్డి వివరణపై స్పందించిన ఈసీ
డీబీటీ పథకాలకు సంబంధించి సీఎస్ జవహర్రెడ్డి ఇచ్చిన వివరణపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఏపీలో ఇసుక అక్రమ తవ్వకాలను వెంటనే నిలిపివేయండి: సుప్రీంకోర్టు ఆదేశం
ఏపీలో అక్రమ ఇసుక తవ్వకాలను వెంటనే నిలిపివేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. -
వైభవంగా సింహాద్రి అప్పన్న చందనోత్సవం.. భారీగా తరలివచ్చిన భక్తులు
భక్తులంతా వేయికళ్లతో ఎదురుచూసిన సింహాద్రి అప్పన్న స్వామి నిజరూప దర్శనం సాక్షాత్కారమైంది. వైశాఖ శుద్ధ తదియ పర్వదినాన్ని పురస్కరించుకుని సింహాచలంలో చందనోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (10/05/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు. -
అసెంబ్లీలో అలా తిట్టుకోవడం చూసి షాకయ్యా..: చిరంజీవి
సినీ నటుడు చిరంజీవి, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి నాటి జ్ఞాపకాలను ఒకరితో ఒకరు పంచుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ప్రజ్వల్ రేవణ్ణ గురించి ముందే హెచ్చరించిన.. ఆ భాజపా నేతపై కేసు!
-
తల్లితో కలిసి పిఠాపురానికి రామ్ చరణ్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
టాటా మోటార్స్ రయ్రయ్.. లాభం మూడింతలు
-
జియో ఫైబర్ యూజర్లకు కొత్త ప్లాన్.. ఒకే రీఛార్జిపై 15 ఓటీటీలు
-
Prabhas: ప్రభాస్ ‘రాజాసాబ్’ మరింత ఆలస్యం.. కారణమిదే!