నేడు, రేపు కడప జిల్లాలో ఏపీ సీఎం పర్యటన

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి నేడు, రేపు కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నెల 8న వైఎస్‌ఆర్‌ జయంతి సందర్భంగా ఇడుపులపాయలో నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఈ మేరకు పర్యటన షెడ్యూల్‌ ఖరారైంది. మంగళవారం మధ్యాహ్నం

Updated : 07 Jul 2020 09:18 IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి నేడు, రేపు కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నెల 8న వైఎస్‌ఆర్‌ జయంతి సందర్భంగా ఇడుపులపాయలో నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఈ మేరకు పర్యటన షెడ్యూల్‌ ఖరారైంది. మంగళవారం మధ్యాహ్నం 3.30గంటలకు గన్నవరం నుంచి సీఎం జగన్‌ కడపకు బయల్దేరతారు. సాయంత్రం 4.45గంటలకు కడపకు చేరుకొని అక్కడి నుంచి ఇడుపులపాయకు వెళ్తారు. బుధవారం ఇడుపులపాయలో జరిగే వైఎస్‌ జయంతి వేడుకల్లో సీఎం పాల్గొంటారు. అనంతరం ఆర్‌జీయూకేటీలో అకాడమిక్‌ భవనాలు, సోలార్‌ ప్లాంట్‌ను జగన్‌ ప్రారంభిస్తారు. ఆ వెంటనే తాడేపల్లికి తిరుగు పయనమవుతారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని