కృత్రిమ మేధ.. సాగించింది హవా
కరోనా మహమ్మారి కారణంగా 2020లో వాటి వినియోగం భారీగా పెరిగింది. ఆసుపత్రుల్లో రోగుల పరీక్షలు మొదలు వైరస్ను నివారించే రసాయనాలను చల్లడం వరకు....
2020లో భారీగా పెరిగిన రోబోలు, డ్రోన్ల వినియోగం
ఇంటర్నెట్ డెస్క్: మానవాళి రూపొందించిన అద్భుత ఆవిష్కరణ కృత్రిమ మేధ. వివిధ రంగాల్లో మానవుల ప్రమేయం లేకుండా కావాల్సిన పనిని చేసిపెట్టే రోబోలు, డ్రోన్ల సేవలను మనం చాలా కాలం నుంచే పొందుతున్నాం. కరోనా మహమ్మారి కారణంగా 2020లో వాటి వినియోగం భారీగా పెరిగింది. ఆసుపత్రుల్లో రోగుల పరీక్షలు మొదలు వైరస్ను నివారించే రసాయనాలను చల్లడం వరకు.. విద్యార్థులకు పట్టాల ప్రదానం నుంచి దుకాణాల నిర్వహణ వరకు ఈ ఏడాది వివిధ దేశాల్లో రోబోలు, డ్రోన్లు విశేష సేవలందించాయి. సామాజిక దూరం పాటించడం, వినియోగదారులకు వేగవంతమైన, నాణ్యమైన సేవలను అందించేందుకు అనేక దేశాల్లో డ్రోన్లు, రోబోల వినియోగం పెరిగిపోయింది.
ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలోని ఓ విశ్వవిద్యాలయంలో విద్యార్థులు అక్కడికి రాకుండానే రోబోల సాయంతో వీడియో కాల్ ద్వారా 170 మందికి పట్టాలు అందించారు. కొవిడ్పై అప్రమత్తత కల్పించేందుకు జపాన్లో ఓ రోబోను రూపొందించారు. ఎవరైనా మాస్కు ధరించకుంటే వారి దగ్గరకు వెళ్లి మాస్కు ధరించాలని ఈ రోబో సూచిస్తుంది. జపాన్లోని పలు క్వారంటైన్ కేంద్రాల్లో రోగులను పలకరించడం సహా నేలను శుభ్రం చేసేందుకు రోబోలను వినియోగిస్తున్నారు. చైనా, నెదర్లాండ్స్లోని కొన్ని హోటళ్లలో వినియోగదారుల నుంచి ఆర్డర్లు తీసుకునేందుకు రోబోలను వినియోగిస్తున్నారు. ఇజ్రాయిల్, రష్యాల్లో మానవ ప్రమేయం లేకుండా కరోనా రసాయనాలను చల్లే యంత్రాలను రూపొందించారు. లండన్లో కొన్ని రోబోలు టైలర్ అవతారమెత్తి కొలతలు కూడా తీసుకుంటున్నాయి.
కొలంబియాలో వినియోగదారులకు వస్తువులను అందించేందుకు రోబోలను వినియోగిస్తుండగా, మరికొన్ని చోట్ల వినియోగదారుల ఇంటి వద్దే వస్తువులను జారవిడిచే డ్రోన్లను రూపొందించారు. భారత్లోనూ ఈ ఏడాది రోబోలు, డ్రోన్ల వినియోగం బాగానే పెరిగింది. దేశంలోని పలు ఆసుపత్రుల్లో రోగుల శరీర ఉష్ణోగ్రతలను నమోదు చేసుకోవడం, రోగులను వార్డులకు తీసుకువెళ్లడం వంటి సేవలను అందిస్తున్నాయి.
ఇవీ చదవండి...
2020లో ప్రపంచాన్ని కుదిపేసిన ఘటనలు..!
కరోనా వేళ.. జల్లికట్టుకు అనుమతి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
Viral Video: స్పైడర్ మ్యాన్, స్పైడర్ ఉమెన్ దుస్తుల్లో దిల్లీ రోడ్లపై చక్కర్లు కొట్టిన జంటను పోలీసులు అరెస్టు చేశారు. ఎందుకంటే? -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ సంచలన ఆరోపణలు చేశారు. -
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
రాష్ట్రంలో 3 రోజుల పాటు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
కియారా కీలక పాత్ర.. అవన్నీ రూమర్సే!
-
262 సరిపోలేదు.. టీ20ల్లోనే పంజాబ్ రికార్డు ఛేజింగ్
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
-
పది కిలోల బంగారం స్వాధీనం
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?