TS News: ప్రమాదాలకు ‘తెర’ తీస్తున్నారు
వినోదం కోసం సినిమా థియేటర్కెళ్తున్నారా..? కాస్త అప్రమత్తంగా ఉండటం మంచిది. పొరపాటున అగ్నిప్రమాదం జరిగితే చిక్కులు తప్పవు.
సినిమా థియేటర్లలో లోపాలున్నట్లు గుర్తింపు
అగ్నిమాపక శాఖ ప్రాథమిక పరిశీలనలో వెల్లడి
హైదరాబాద్: వినోదం కోసం సినిమా థియేటర్కెళ్తున్నారా..? కాస్త అప్రమత్తంగా ఉండటం మంచిది. పొరపాటున అగ్నిప్రమాదం జరిగితే చిక్కులు తప్పవు. మంటల్లో నుంచి బయటపడేందుకు అష్టకష్టాలు పడాల్సిందే. కొద్దిరోజుల క్రితం హైదరాబాద్ కేపీహెచ్బీలోని శివపార్వతి టాకీస్లో భారీ అగ్నిప్రమాదం సంభవించిన సంగతి తెలిసిందే. అదృష్టవశాత్తు రెండో ఆట ముగిసిన తర్వాత షార్ట్సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం సంభవించడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఈనేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా అగ్నిమాపక శాఖ చేపట్టిన ప్రాథమిక పరిశీలనలో పలు విస్మయకర విషయాలు వెల్లడయ్యాయి. రెండో మెట్లమార్గం లేని థియేటర్లు ఇంకా మనుగడలో ఉన్నట్లు తేలింది. పాతకాలపు నిబంధనల మేరకు కట్టినవి ఇంకా అలాగే కొనసాగుతున్నట్లు వెల్లడైంది. రాష్ట్రవ్యాప్తంగా 339 సినిమా థియేటర్లుండగా.. మూడోంతులకు పైగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే ఉన్నాయి. నిత్యం జనంతో కిక్కిరిసి ఉండే సినిమాహాళ్లలోని బాల్కనీలకు తప్పనిసరిగా రెండో మెట్లమార్గం ఉండాలని అగ్నిమాపక శాఖ నిబంధనలు చెబుతున్నా ఇప్పటికీ పలు థియేటర్లలో ఆ సదుపాయం లేదని తాజాగా బహిర్గతం కావడం విస్తుగొలుపుతోంది. కనీసం ఇనుప కడ్డీలతో కూడిన మెట్లయినా తప్పనిసరి. కానీ అలాంటి సదుపాయమూ లేని థియేటర్లున్నట్లు గుర్తించారు. ఈనేపథ్యంలో బుధవారం నుంచి జిల్లాలవారీగా సమగ్ర పరిశీలనకు బృందాలు ఏర్పాటయ్యాయి.
పేరుకే అగ్నిమాపక పరికరాలు
రాష్ట్రంలోని పలు థియేటర్లలో పేరుకే అగ్నిమాపక పరికరాలున్నా చాలావరకు పనిచేయడం లేదని తేలింది. హైదరాబాద్లోని మల్టీప్లెక్స్లలో సదుపాయాలు బాగానే ఉన్నట్లు తేలినా.. మిగిలిన థియేటర్లలో మాత్రం లోపాల్ని గుర్తించారు.
► పలు థియేటర్లలో చాలా రోజుల కింద ఏర్పాటు చేసిన పరికరాలు నిర్వహణ సరిగా లేని కారణంగా చెడిపోయినట్లు గుర్తించారు. ఆకస్మికంగా అగ్నిప్రమాదం జరిగితే మంటలనార్పేందుకు అవి పనిచేయవని వెల్లడైంది.
► దాదాపు 50 థియేటర్లలో అగ్నిమాపక వ్యవస్థనే సరిగా లేదని తేటతెల్లమైంది.
► 17 టాకీసుల్లో ఏమాత్రం నిబంధనలను పాటించడం లేదని వెల్లడైంది.
► 60 వరకు సినిమాహాళ్లలో సదుపాయాలు కొంతమేర బాగున్నట్లు తేలింది.
స్పందించకుంటే ప్రాసిక్యూట్ చేస్తాం: పాపయ్య, ప్రాంతీయ అగ్నిమాపక అధికారి
రాష్ట్రంలోని పలు థియేటర్లలో అగ్నిమాపక వ్యవస్థలు సక్రమంగా లేనట్లు ప్రాథమిక పరిశీలనలో వెల్లడైంది. ఈనెల 24 లోపు అగ్నిమాపక బృందాల ఆధ్వర్యంలో సమగ్ర పరిశీలన జరగనుంది. తనిఖీల అనంతరం గుర్తించిన లోపాల సవరణకు నెలరోజుల గడువిస్తాం. ఆలోపు పరిష్కరించుకోకపోతే షోకాజ్ నోటీస్ జారీ చేస్తాం. అయినా స్పందించకపోతే కేసుపెట్టి ప్రాసిక్యూట్ చేస్తాం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
విశాఖ ఉక్కు కర్మాగారానికి చెందిన భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఏపీ హైకోర్టు ఆదేశించింది. -
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై ప్రజల నుంచి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఫిర్యాదులు, నివేదనలు కోరింది. -
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
సీఎం జగన్కు బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుందని వైఎస్ సునీత అన్నారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైదరాబాద్ - బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా ఉప్పల్ వేదికగా గురువారం రాత్రి 7.30 గంటలకు సన్రైజర్స్ హైదరాబాద్, బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. -
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
సీఎం జగన్ (YS Jagan)కు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ బహిరంగ లేఖ రాశారు. వివేకా హత్య (Viveka Murder Case)కు కారకులైన వారికి మళ్లీ ఎంపీగా అవకాశం ఇవ్వడంతో పాటు రక్షణ కల్పిస్తున్నారంటూ ఆమె నిలదీశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...