Hyderabad: ప్యాసింజర్ కష్టాలు.. 2017 సంవత్సరం నుంచి 161 రైళ్ల రద్దు
కరోనాకు ముందు అంటే 2017లో దక్షిణమధ్య రైల్వేలో 745 రైళ్లు నడిచేవి. ఇందులో 354 పాసింజర్ రైళ్లు కాగా.. 270 ఎక్స్ప్రెస్ రైళ్లు, 121 ఎంఎంటీఎస్ సర్వీసులు. ప్రస్తుతం కొత్త మార్గాలు వచ్చాయి.
ఈనాడు, హైదరాబాద్: కరోనాకు ముందు అంటే 2017లో దక్షిణమధ్య రైల్వేలో 745 రైళ్లు నడిచేవి. ఇందులో 354 పాసింజర్ రైళ్లు కాగా.. 270 ఎక్స్ప్రెస్ రైళ్లు, 121 ఎంఎంటీఎస్ సర్వీసులు. ప్రస్తుతం కొత్త మార్గాలు వచ్చాయి. విద్యుదీకరణ జరిగింది. రైళ్ల వేగం పెరిగింది. ఇలా అన్ని రంగాల్లో ప్రగతి సాధించిన దక్షిణమధ్య రైల్వే.. ప్రయాణికులను తీసుకెళ్లడంలో మాత్రం వెనుకబడిపోయింది. కరోనా తర్వాత లెక్కలన్నీ తప్పాయని సరిపెట్టుకున్నా.. ప్రస్తుతం అంతటా సాధారణ స్థితి నెలకొంది. దీనికి అనుగుణంగా రైళ్ల సంఖ్య పెరగాల్సింది పోయి.. తగ్గిపోయాయి. ఎక్స్ప్రెస్ రైళ్ల మాట అటుంచితే.. పాసింజర్ రైళ్లు చాలావరకు తగ్గిపోయాయి.
రైతులకు దక్కని భరోసా.. మేడ్చల్ నుంచి సికింద్రాబాద్కు సరైన సమయపాలనతో డెమూ, మెమూ రైళ్లు నడిచేవి. నగరం నుంచి వికారాబాద్, మహబూబ్నగర్, కర్నూలు, గుంటూరు, వరంగల్కు విరివిగా పాసింజర్ రైళ్లు నడిచేవి. ఇప్పుడవేవీ కనిపించడం లేదు. దీంతో చిన్న, సన్నకారు రైతులకు రైలు భరోసా లేకుండా పోయింది. ముఖ్యంగా నగరం నుంచి మేడ్చల్, ఉందానగర్ వెళ్లే పాసింజర్లన్నీ కనుమరుగయ్యాయి. 10 ఎంఎంటీఎస్లు నడుపుతున్నా.. అవి సమయపాలన పాటించక ఇబ్బందులు పడుతున్నారు. ద.మ. రైల్వే పరిధిలో 2000 సంవత్సరం వరకూ 47 డెమూ రైళ్లు మేడ్చల్-సికింద్రాబాద్-ఉందానగర్ మధ్య నడిచేవి. 2015కు వచ్చేసరికి 25కు కుదించారు. ఇలా 2017 వరకూ వీటిని 16కు తగ్గించారు.
అనువుగాని వేళ.. మేడ్చల్-సికింద్రాబాద్ మధ్య 10 ఎంఎంటీఎస్ సర్వీసులు నడుపుతున్నా అవేవీ ఉద్యోగులకు అనువైన సమయాలు కాకపోవడం గమనార్హం. ఉదయం 8 నుంచి 10 గంటల వరకూ.. సాయంత్రం 4 నుంచి రాత్రి 9 గంటల వరకూ సమయపాలన పాటించి నడిపితే ఊరట ఉండేది. నగరంలో తిరుగుతున్న ఎంఎంటీఎస్ రైళ్లను తరచూ రద్దు చేస్తున్నారు. ఉదయం, సాయంత్రం ప్రతి అరగంటకో ఎంఎంటీఎస్ నడపాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
Viral Video: స్పైడర్ మ్యాన్, స్పైడర్ ఉమెన్ దుస్తుల్లో దిల్లీ రోడ్లపై చక్కర్లు కొట్టిన జంటను పోలీసులు అరెస్టు చేశారు. ఎందుకంటే? -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ సంచలన ఆరోపణలు చేశారు. -
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
రాష్ట్రంలో 3 రోజుల పాటు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక
-
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
-
అలెన్ హెర్బల్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్