Hyderabad: ప్యాసింజర్ కష్టాలు.. 2017 సంవత్సరం నుంచి 161 రైళ్ల రద్దు
కరోనాకు ముందు అంటే 2017లో దక్షిణమధ్య రైల్వేలో 745 రైళ్లు నడిచేవి. ఇందులో 354 పాసింజర్ రైళ్లు కాగా.. 270 ఎక్స్ప్రెస్ రైళ్లు, 121 ఎంఎంటీఎస్ సర్వీసులు. ప్రస్తుతం కొత్త మార్గాలు వచ్చాయి.
ఈనాడు, హైదరాబాద్: కరోనాకు ముందు అంటే 2017లో దక్షిణమధ్య రైల్వేలో 745 రైళ్లు నడిచేవి. ఇందులో 354 పాసింజర్ రైళ్లు కాగా.. 270 ఎక్స్ప్రెస్ రైళ్లు, 121 ఎంఎంటీఎస్ సర్వీసులు. ప్రస్తుతం కొత్త మార్గాలు వచ్చాయి. విద్యుదీకరణ జరిగింది. రైళ్ల వేగం పెరిగింది. ఇలా అన్ని రంగాల్లో ప్రగతి సాధించిన దక్షిణమధ్య రైల్వే.. ప్రయాణికులను తీసుకెళ్లడంలో మాత్రం వెనుకబడిపోయింది. కరోనా తర్వాత లెక్కలన్నీ తప్పాయని సరిపెట్టుకున్నా.. ప్రస్తుతం అంతటా సాధారణ స్థితి నెలకొంది. దీనికి అనుగుణంగా రైళ్ల సంఖ్య పెరగాల్సింది పోయి.. తగ్గిపోయాయి. ఎక్స్ప్రెస్ రైళ్ల మాట అటుంచితే.. పాసింజర్ రైళ్లు చాలావరకు తగ్గిపోయాయి.
రైతులకు దక్కని భరోసా.. మేడ్చల్ నుంచి సికింద్రాబాద్కు సరైన సమయపాలనతో డెమూ, మెమూ రైళ్లు నడిచేవి. నగరం నుంచి వికారాబాద్, మహబూబ్నగర్, కర్నూలు, గుంటూరు, వరంగల్కు విరివిగా పాసింజర్ రైళ్లు నడిచేవి. ఇప్పుడవేవీ కనిపించడం లేదు. దీంతో చిన్న, సన్నకారు రైతులకు రైలు భరోసా లేకుండా పోయింది. ముఖ్యంగా నగరం నుంచి మేడ్చల్, ఉందానగర్ వెళ్లే పాసింజర్లన్నీ కనుమరుగయ్యాయి. 10 ఎంఎంటీఎస్లు నడుపుతున్నా.. అవి సమయపాలన పాటించక ఇబ్బందులు పడుతున్నారు. ద.మ. రైల్వే పరిధిలో 2000 సంవత్సరం వరకూ 47 డెమూ రైళ్లు మేడ్చల్-సికింద్రాబాద్-ఉందానగర్ మధ్య నడిచేవి. 2015కు వచ్చేసరికి 25కు కుదించారు. ఇలా 2017 వరకూ వీటిని 16కు తగ్గించారు.
అనువుగాని వేళ.. మేడ్చల్-సికింద్రాబాద్ మధ్య 10 ఎంఎంటీఎస్ సర్వీసులు నడుపుతున్నా అవేవీ ఉద్యోగులకు అనువైన సమయాలు కాకపోవడం గమనార్హం. ఉదయం 8 నుంచి 10 గంటల వరకూ.. సాయంత్రం 4 నుంచి రాత్రి 9 గంటల వరకూ సమయపాలన పాటించి నడిపితే ఊరట ఉండేది. నగరంలో తిరుగుతున్న ఎంఎంటీఎస్ రైళ్లను తరచూ రద్దు చేస్తున్నారు. ఉదయం, సాయంత్రం ప్రతి అరగంటకో ఎంఎంటీఎస్ నడపాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
ఈనాడు.నెట్లోని పది ముఖ్యమైన వార్తలు.. -
TSRTC: పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం
తెలంగాణలో మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. శనివారం మధ్యాహ్నం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మహాలక్ష్మి పథకం అమల్లోకి రానుంది. -
APPSC: గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల.. పోస్టులు ఎన్నంటే?
ఆంధ్రప్రదేశ్లో గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదలైంది. -
Supreme Court: చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ
స్కిల్ డెవలప్మెంట్ కేసులో తెదేపా అధినేత చంద్రబాబు బెయిల్ రద్దు కోరుతూ దాఖలైన పిటిషన్పై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. -
సీఎంవో నుంచి నాకు ఎలాంటి సమాచారం లేదు: దేవులపల్లి ప్రభాకర్రావు
తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో) నుంచి తనను ఎవరూ సంప్రదించలేదని దేవులపల్లి ప్రభాకర్రావు తెలిపారు. -
Revanth Reddy: తెలంగాణ విద్యుత్ రంగంపై సీఎం రేవంత్రెడ్డి సమీక్ష
విద్యుత్ రంగంపై తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి సమీక్ష నిర్వహించారు. సచివాలయంలో నిర్వహించిన ఈ సమీక్షలో మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, పొన్నం ప్రభాకర్, సీఎస్ శాంతికుమారి, విద్యుత్శాఖకు చెందిన ఉన్నతాధికారులతో పాటు ట్రాన్స్కో, జెన్కో అధికారులు పాల్గొన్నారు. -
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
KCR: కేసీఆర్ ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్ విడుదల
భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్ (KCR) ఆరోగ్య పరిస్థితిపై యశోద ఆస్పత్రి వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. -
Revanth Reddy: ‘ప్రజాదర్బార్’ ప్రారంభం.. అర్జీలు స్వీకరించిన సీఎం రేవంత్
తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి (Revanth Reddy) ప్రజాదర్బార్ను ప్రారంభించారు. శుక్రవారం ఉదయం హైదరాబాద్లోని జ్యోతిబాఫూలే ప్రజాభవన్ వద్దకు వచ్చిన ప్రజల నుంచి అర్జీలను ఆయన స్వీకరించారు. -
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
KCR: మాజీ సీఎం కేసీఆర్కు గాయం.. యశోద ఆస్పత్రిలో చికిత్స
భారాస అధినేత, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ఆస్పత్రిలో చేరారు. కాలుజారి పడటంతో ఆయనకు గాయమైంది. -
ఉత్తరాంధ్ర దోపిడీ.. వైకాపా నేతలకు కనిపించలేదా!!
-
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (08/12/2023)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.


తాజా వార్తలు (Latest News)
-
Meenakshi Chaudhary: ‘గుంటూరు కారం’.. ఆరోజు ఎంతో కంగారుపడ్డా: మీనాక్షి చౌదరి
-
Team India: యువ టాలెంట్కు కొదవేం లేదు.. జట్టు కూర్పే భారత్కు సవాల్: మాజీ క్రికెటర్
-
డిజిటల్ రుణాలపై ఆర్బీ‘ఐ’.. లోన్ అగ్రిగేటర్లకు త్వరలో రూల్స్
-
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
TSRTC: పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం
-
Canada visa: కెనడా కీలక నిర్ణయం.. స్టూడెంట్ వీసా డిపాజిట్ రెట్టింపు!