రుషికొండలో ఏం జరిగింది?!
ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఇంటిలో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నట్లు సోమవారం రాత్రి తీవ్ర కలకలం రేగింది.
ఎంపీ ఎంవీవీ నివాసంలో ఐటీ దాడులనే సమాచారంతో కలకలం!
మధురవాడ, సాగర్నగర్, న్యూస్టుడే: ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఇంటిలో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నట్లు సోమవారం రాత్రి తీవ్ర కలకలం రేగింది. ముందు లాసన్స్బే కాలనీలో అంటూ సమాచారం రావడం, అక్కడ కాదు సీతమ్మధార, రుషికొండ ఐటీహిల్స్ వద్దనున్న నివాసంలో అని తెలియడంతో విలేకరులు అటుగా వెళ్లారు. అయితే ఎలాంటి దాడులు జరిగినట్లు స్పష్టంగా వెల్లడి కాలేదు. రుషికొండలోని నివాసం నుంచి ఏవో శబ్ధాలు రావడంతో ఇక్కడేదో జరుగుతుందని తొలుత కొందరు అనుమానించారు. అదే సమయంలో ఎంవీవీ కుమారుడు ఇంటికి రావడం, ప్రవేశ ద్వారం వద్ద విలేకరులను చూసి వారితో సుమారు అరగంట సేపు ముచ్చటించారు. ఇక్కడ ఐటీ దాడులు జరగడం లేదని, లోపల ఎవరూ లేరని చెప్పి ఇంట్లోకి వెళ్లిపోయారు. ఇదిలా ఉండగా సుమారు 7 గంటల సమయంలో ఒక ఇన్నోవా కారులో నలుగురు సభ్యులు ఇంట్లోకి వెళ్లినట్లు స్థానికులు తెలిపారు. దీనిపై అక్కడి కాపలాదారులను ప్రశ్నించగా లోపల యజమాని బంధువులు ఉన్నారన్నారు. ఎంవీవీ కుమారుడు ఇంట్లో ఎవరూ లేరని చెప్పడం, కాపలా సిబ్బంది బంధువులు ఉన్నారని వేర్వేరు సమాధానాలు రావడంతో దాడులు జరుగుతున్నాయని పలువురు అనుమానించారు. ఐటీ దాడులనే సమాచారం మేరకు ఇంటిలిజెన్స్ విభాగ అధికారులు వచ్చి వివరాలు సేకరించారు. రాత్రి 12 గంటలు దాటినా ఎంవీవీ ఇంట్లో దీపాలు వెలుగుతూనే ఉన్నాయి. ఎన్నికల నేపథ్యంలో ఎవరైనా తప్పుడు సమాచారం అందించి ఇలా చేశారా....నిజంగానే దాడులు జరిగాయా అనేది వెల్లడి కాలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
పింఛన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వానికి ఈసీ ఆదేశాలు
పింఛన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వానికి ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల కోడ్ అమలు దృష్ట్యా లబ్ధిదారులకు ఇబ్బంది లేకుండా చూడాలని కోరింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఎన్నికల వేడి.. రైళ్లు ప్రత్యేకమండి
వేసవి సెలవులు వచ్చాయంటే ప్రత్యేక రైళ్లు వేయడం పరిపాటే. కానీ ఈ సారి వాటికి తోడు ఎన్నికలు కూడా వచ్చాయి. -
డ్వాక్రా మహిళలే కీలకం!
జిల్లా వ్యాప్తంగా గ్రామం, వార్డు అనే తేడా లేకుండా అన్నిచోట్లా ‘డ్వాక్రా స్వయం సహాయక సంఘాలు’న్నాయి. వీటిలో వేలాది మంది కొనసాగుతున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు. -
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
Viral Video: స్పైడర్ మ్యాన్, స్పైడర్ ఉమెన్ దుస్తుల్లో దిల్లీ రోడ్లపై చక్కర్లు కొట్టిన జంటను పోలీసులు అరెస్టు చేశారు. ఎందుకంటే?
తాజా వార్తలు (Latest News)
-
జైల్లో కేజ్రీవాల్ ఆరోగ్యంగానే..: ఎయిమ్స్ మెడికల్ బోర్డు..!
-
దాదాపు 900 రన్స్ చేశా.. చోటు దక్కకపోతే చాలా బాధపడతా: గిల్
-
ఆలిన్ హెర్బల్ పరిశ్రమలో మళ్లీ వ్యాపించిన మంటలు
-
రోడ్డుపై పల్టీలు కొట్టి, చెట్టుపై ఇరుక్కుపోయి: అమెరికా కారు ప్రమాదంలో 3 భారతీయులు దుర్మరణం
-
ఈ 20 ఏళ్లలో నా జుట్టు కూడా మారింది కానీ..: సుందర్ పిచాయ్
-
హాలీవుడ్కు వెళ్లాక భయపడ్డా.. ఆ భావన మనసును కుంగదీసింది: ప్రియాంక చోప్రా