Andhra News: ఏపీలో ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు అనుమతి.. విధివిధానాలు ఖరారు
ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. బదిలీలకు సంబంధించిన విధివిధానాలను తెలియజేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 7వ తేదీ నుంచి 17వ తేదీ వరకు బదిలీల ప్రక్రియ చేపట్టేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఒకే చోట ఐదేళ్లు...
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. బదిలీలకు సంబంధించిన విధివిధానాలను ఖరారు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 7వ తేదీ నుంచి 17వ తేదీ వరకు బదిలీల ప్రక్రియ చేపట్టేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఒకే చోట ఐదేళ్లు సర్వీసు పూర్తి చేసిన వారు బదిలీలకు అర్హులుగా ప్రభుత్వం పేర్కొంది.
రాష్ట్రంలో సాధారణ బదిలీలపై ఉన్న నిషేధాన్ని సడలిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అందుకు సంబంధించిన ఉత్తర్వులపై రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంతకం చేశారు. దీంతో ఉద్యోగుల సాధారణ బదిలీలపై అడ్డంకులు తొలిగిపోయినట్లు అయింది. జూన్ 17లోపు బదిలీల ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు బదిలీలకు సంబంధించిన విధివాధానాలను ఖరారు చేస్తూ తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
మార్గదర్శకాలు ఇవే..
* 40శాతం కంటే అధిక వైకల్యం ఉన్న ఉద్యోగులకు బదిలీల్లో ప్రాధాన్యం.
* మానసిక వైకల్యం గల పిల్లలున్న ఉద్యోగులకు ప్రాధాన్యం.
* కుటుంబీకులు దీర్ఘకాల వ్యాధులతో బాధపడితే బదిలీల్లో ప్రాధాన్యం.
* కారుణ్య నియామకాల కింద నియమితులైన వితంతువులకు ప్రాధాన్యం.
* వేర్వేరు ప్రాంతాల్లో పనిచేసే దంపతులకు బదిలీల్లో ప్రాధాన్యం.
* జూన్ 18 నుంచి బదిలీలపై నిషేధం అమల్లోకి వస్తుందని ప్రభుత్వం ఆదేశాలు జారీ.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
దిల్లీ మద్యం కేసు.. కవితకు మళ్లీ చుక్కెదురు
దిల్లీ మద్యం కేసులో భారాస ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మళ్లీ చుక్కెదురైంది. బెయిల్ ఇచ్చేందుకు రౌస్ అవెన్యూ కోర్టు నిరాకరించింది. -
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్.. నేను ప్రత్యక్ష బాధితుడిని: విశ్రాంత ఐఏఎస్ అధికారి పీవీ రమేశ్
వైకాపా ప్రభుత్వం తీసుకొచ్చిన ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’పై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఓటేశాక.. వృద్ధులను వదిలేశారు..
ఎన్నికల ముందు ప్రతిపక్షనేత హోదాలో పాదయాత్ర చేసిన జగన్ ఎన్నో హామీలు గుప్పించారు. అన్ని వర్గాలను మాటలతో మెప్పించి.. అనంతరం నిండా ముంచారు. -
జిల్లాలో తేలికపాటి వర్షాలు
జిల్లాలోని రెండు ప్రాంతాల్లో తేలిక పాటి వర్షాలు కురిశాయి. శనివారం సాయంత్రం నుంచి ఆదివారం ఉదయం వరకు నమోదైన వివరాల ప్రకారం.. మొత్తం 5.2 మిల్లీ మీటర్ల వర్షం పడగా, సగటు వర్షపాతం 0.26 మి.మీ.గా ఉంది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (06/05/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
పలు పాఠశాలలకు బెదిరింపులు..విదేశీ ఐపీ అడ్రెస్ నుంచి మెయిల్స్..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
సమంత ఫొటోపై చర్చ.. ఆగ్రహం వ్యక్తం చేస్తోన్న అభిమానులు
-
దిల్లీ మద్యం కేసు.. కవితకు మళ్లీ చుక్కెదురు
-
కుర్రాళ్లు ఇంకా నేర్చుకోవాలి.. ఒత్తిడిని తట్టుకోవాలి: కేఎల్ రాహుల్
-
అక్కడికి వెళ్తే.. ఇంటికి తిరిగి వెళ్లినట్టుగా ఉంటుంది: సునీతా విలియమ్స్