Tirumala: తిరుమలలో భారీ వర్షం.. భక్తులకు ఉపశమనం

తిరుమలలో శనివారం సాయంత్రం అకస్మాత్తుగా భారీ వర్షం కురిసింది. దీంతో తిరమలలో వాతావరణం చల్లబడి.. పరిసరాలు ఆహ్లాదకరంగా మారాయి

Published : 01 Apr 2023 19:17 IST

తిరుమల: తిరుమలలో శనివారం సాయంత్రం అకస్మాత్తుగా భారీ వర్షం కురిసింది. వేసవి కారణంగా మధ్యాహ్నం వరకు ఎండవేడిమితో భక్తులు ఇబ్బందులు పడ్డారు. సాయంత్రం కారుమేఘాలు కమ్ముకొని ఒక్కసారిగా భారీ వర్షం కురవడంతో కాస్త ఉపశమనం పొందారు. వర్షంతో తిరువీధులు, ఆలయం ఎదుట నీరు ప్రవహించింది. స్వామివారి దర్శనం అనంతరం గదులకు చేరుకునే భక్తులు వర్షంలో తడిచి ముద్దయ్యారు. వర్షం రాకతో తిరమలలో వాతావరణం చల్లబడి.. పరిసరాలు ఆహ్లాదకరంగా మారాయి.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని