బిస్కెట్‌ కప్‌లో టీ‌.. భలే గిరాకీ

కేరళ రాష్ట్రం త్రిస్సూర్‌లోని ఓ బేకరీకి జనాలు క్యూ కడుతున్నారు. అక్కడ టీ తాగేందుకు బారులుతీరుతున్నారు. చాయ్‌ కన్నా కప్పునే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. టీ తాగగానే కప్పును ఇష్టంగా తినేస్తున్నారు....

Published : 14 Dec 2020 11:37 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కేరళ రాష్ట్రం త్రిస్సూర్‌లోని ఓ బేకరీకి జనాలు క్యూ కడుతున్నారు. అక్కడ టీ తాగేందుకు బారులు తీరుతున్నారు. ఛాయ్‌ కన్నా కప్పునే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. టీ తాగగానే కప్పును ఇష్టంగా తినేస్తున్నారు. ఏఆర్‌ మీనన్‌ రోడ్డులోని ఓ బేకరీ యజమాని వినూత్నంగా ఆలోచించారు. బిస్కెట్లతో ప్రత్యేకంగా తయారు చేయించిన కప్పుల్లో టీని విక్రయిస్తున్నారు. ఈ అరుదైన టీ కప్పులకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఛాయ్‌ ఎంత వేడిగా ఉన్నా ఈ కప్‌ 20 నిమిషాల వరకు మెత్తబడకుండా ఉంటుంది. ఈ ప్రత్యేకమైన టీ ధర కేవలం 20 రూపాయలే.

వినూత్నంగా ఆలోచించి తయారు చేసిన బిస్కెట్‌ కప్‌ టీకి కొద్ది రోజుల్లోనే మంచి ఆదరణ లభించిందని నిర్వాహకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి వినియోగించి పడేసే కప్పులకన్నా ఈ బిస్కెట్‌ కప్‌ వినియోగం ఎంతో ఉపయోగకరమంటున్నారు. ఈ బిస్కెట్‌ కప్పులు హైదరాబాద్‌లో తయారవడం విశేషం. రానున్న రోజుల్లో వెనీలా, చాక్లెట్‌ రుచుల్లో కప్పులు తయారుచేసేందుకు సంబంధిత తయారీ సంస్థ యోచిస్తోంది.

ఇవీ చదవండి...

రైల్వే ఇకపై మరింత పర్యావరణ హితం

అక్కడ టీ ధర రూ.1000!


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని