‘కన్యాదానం’ రిపీట్.. కోరుకున్న వాడికి భార్యనిచ్చి వివాహం చేసిన భర్త!
కట్టుకున్న భార్య తనతో సంతోషంగా ఉండటం లేదని గుర్తించిన ఓ భర్త.. ఆమె సంతోషాన్నే కోరుకున్నాడు. తన సతీమణికి రెండో పెళ్లి జరిపించాడు......
కాన్పుర్: కట్టుకున్న భార్య తనతో సంతోషంగా ఉండటం లేదని గుర్తించిన ఓ భర్త.. ఆమె ఆనందాన్నే కోరుకున్నాడు. తన సతీమణికి రెండో పెళ్లి జరిపించాడు. ‘నువ్వు ఎవరితో సంతోషంగా ఉంటావో.. వారితో కలిసి ఉంటేనే నాకూ ఆనందం’ అంటూ ప్రేమిస్తున్న యువకుడికే తన భార్యను ఇచ్చి వారిద్దరినీ ఒకటి చేశాడు. భార్య పెళ్లికి పెద్దగా మారాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లో చోటుచేసుకుంది.
కాన్పుర్కు చెందిన కోమల్, పంకజ్కు ఆరు నెలల క్రితం వివాహం జరిగింది. అయితే పెళ్లి అయినప్పటి నుంచి భర్తతో కోమల్ అయిష్టంగానే ఉంటోంది. దీంతో అసలు సమస్యేంటని భార్యను ఆరా తీశాడు పంకజ్. ‘నీ సంతోషం కోసం ఏదైనా చేస్తా’నని భార్యకు మాటిచ్చాడు. దీంతో ఆమె తన ప్రేమ విషయం విషయం బయటపెట్టింది. పింటు అనే వ్యక్తితో ప్రేమలో ఉన్నట్లు తెలిపింది. కుటుంబసభ్యులు తనకు బలవంతంగా ఈ వివాహం జరిపించారని వివరించింది. పింటుతో ఉంటేనే సుఖంగా ఉంటానని చెప్పింది.
ఇదంతా విన్న పంకజ్ ఆమెను కోపగించుకోలేదు. ప్రశాంతంగా ఆలోచించి సరేనన్నాడు. ‘నువ్వు సంతోషంగా ఉంటానంటే అదే నాకు ఆనందం’ అంటూ భార్య వివాహానికి ఏర్పాట్లు చేశాడు. ముందుగా ఇరు కుటుంబాలను పిలిచి మాట్లాడాడు. వారిని నచ్చజెప్పాడు. సంప్రదాయబద్ధంగా భార్యకు విడాకులు ఇచ్చాడు. ఆ తర్వాత పింటు, కోమల్కు వివాహం జరిపించారు. ఈ వివాహం స్థానికంగా చర్చనీయాంశమైంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!