Hyderabad: జలమండలి మరో ఘనత.. మూడోసారి ఐఎస్ఓ గుర్తింపు
భాగ్యనగర వాసులకు తాగునీరు సరఫరా చేస్తూ సేవలందిస్తున్న జలమండలి మరో ఘనతను సొంతం చేసుకుంది. తాగునీటి సరఫరాలో పాటిస్తున్న నాణ్యతా ప్రమాణాలకుగాను మూడోసారి ధ్రువపత్రం లభించింది.
హైదరాబాద్: భాగ్యనగర వాసులకు తాగునీరు సరఫరా చేస్తూ సేవలందిస్తున్న జలమండలి మరో ఘనతను సొంతం చేసుకుంది. తాగునీటి సరఫరాలో పాటిస్తున్న నాణ్యతా ప్రమాణాలకు ఐఎస్ఓ-9001:2015 ధ్రువపత్రం మరోసారి లభించింది. ఈ ధ్రువీకరణను మరో 3 ఏళ్లు పొడిగిస్తున్నట్లు జియోటెక్ గ్లోబల్ సర్టిఫికెట్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులు తెలిపారు. దీనికి సంబంధించిన ధ్రువీకరణ పత్రాన్ని జలమండలి అధికారులకు పంపించారు. ఖైరతాబాద్లోని ప్రధాన కార్యాలయంలో ఈ ధ్రువీకరణ పత్రాన్ని టెక్నికల్ డైరెక్టర్ పి.రవికుమార్, ట్రాన్స్మిషన్ సీజీఎం దశరథ్ రెడ్డి.. జలమండలి ఎండీ దానకిశోర్కు అందించారు.
ఐఎస్ఓ ధ్రువీకరణ పొడిగింపు పట్ల ఎండీ దానకిశోర్ హర్షం వ్యక్తం చేశారు. ప్రజలకు మెరుగైన సేవలందిస్తున్నందుకు జలమండలి ఉద్యోగులు, సిబ్బందిని ఆయన అభినందించారు. జలమండలికి ఐఎస్ఓ ధ్రువపత్రం 2017 జులైలో మొదటిసారి వచ్చింది. అనంతరం రెండో సారి 2023 జులై వరకు మరోసారి పొడిగించారు. తాజాగా దాన్ని మూడోసారి మరో మూడేళ్ల పాటు పునరుద్ధరించారు. 2026 జులై వరకు ఇది వర్తించనుంది. నదుల నుంచి నీటిని సేకరించింది మొదలు వినియోగదారులకు సరఫరా చేసే వరకు.. నిల్వ చేయడం, శుద్ధి ప్రక్రియ, క్లోరినేషన్, పంపింగ్, ట్రాన్స్ మిషన్, డిస్ట్రిబ్యూషన్ మొదలైన పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తున్నందుకు ఈ ధ్రువపత్రాన్ని అందజేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
11 ఏళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత ఎమ్మార్ కేసులో తీర్పు
11 ఏళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత ఎమ్మార్ కేసులో డిశ్చార్జి పిటిషన్లపై సీబీఐ కోర్టు తీర్పు వెల్లడించింది. -
వివేకా హత్య తర్వాత అవినాష్.. జగన్కు ఫోన్ చేసి ఏం మాట్లాడారు?: సునీత
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య తర్వాత ఆధారాలను చెరిపేసిన ఎంపీ అవినాష్రెడ్డి.. జగన్కు ఫోన్ చేసి ఏం మాట్లాడారని వైఎస్ సునీత ప్రశ్నించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
బ్యాంకాక్ ఏషియా అందాల పోటీల్లో విశాఖ నివాసి మూడు టైటిల్స్ కైవసం
బ్యాంకాక్లో జరిగిన ఏషియా అందాల పోటీల్లో విశాఖ నివాసి డాక్టర్ వై.మమతా చౌదరి మూడు టైటిల్స్ కైవసం చేసుకున్నారు. -
రైళ్లలో చోరీలకు పాల్పడే ముఠా అరెస్టు
రైళ్లలో బంగారు ఆభరణాల చోరీకి పాల్పడుతున్న ముగ్గురు ముఠా సభ్యులను రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (30/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
సత్తా చాటిన ‘పొలిమేర 2’, ‘ఉస్తాద్’.. ఉత్తమ నటుడిగా నవీన్ చంద్ర
-
నిజమే.. ఆర్థిక సవాళ్లు ఎదుర్కొంటున్నాం : చైనా
-
‘ఆయుధాలు అప్పగించేదే లేదు..!’ ఆర్మీని అడ్డుకున్న మహిళలు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
విడాకులు తీసుకున్న కుమార్తెను ఘనంగా ఇంటికి ఆహ్వానించిన తండ్రి
-
ఓటీటీలో సిద్ధార్థ్ రాయ్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?