VIveka Murder case: భాస్కర్‌రెడ్డి, ఉదయ్‌కుమార్‌రెడ్డి బెయిల్‌ పిటిషన్లపై విచారణ పూర్తి.. తీర్పు రిజర్వు

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకేసులో నిందితుడు శివశంకర్‌రెడ్డి బెయిల్‌ పిటిషన్‌పై సీబీఐ కోర్టులో వాదనలు ముగిశాయి.

Published : 24 Aug 2023 19:22 IST

హైదరాబాద్‌: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకేసు నిందితుడు శివశంకర్‌రెడ్డి బెయిల్‌ పిటిషన్‌పై సీబీఐ కోర్టులో వాదనలు ముగిశాయి. తీర్పును ఈనెల 29కి సీబీఐ కోర్టు వాయిదా వేసింది. వివేకా హత్యకేసులో మరో నిందితుడు సునీల్‌ యాదవ్‌ బెయిల్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. తదుపరి విచారణ సెప్టెంబరు ఒకటో తేదీకి హైకోర్టు వాయిదా వేసింది. ఇదే కేసులో నిందితులు భాస్కర్‌రెడ్డి, ఉదయ్‌కుమార్‌రెడ్డి బెయిల్‌ పిటిషన్లపై తెలంగాణ హైకోర్టులో వాదనలు పూర్తయ్యాయి. బెయిల్‌ పిటిషన్లపై తీర్పును హైకోర్టు రిజర్వు చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని