Viral video: ఐఫోన్తో కేక్ కటింగ్.. వీడియో చూడండి!
కర్ణాటకలోని కనకగిరి భాజపా ఎమ్మెల్యే బసవరాజ్ దాడేస్గుర్ కుమారుడు సురేష్ తన పుట్టిన రోజు సందర్భంగా 8 కేకులను తన ఐఫోన్తో ఒకేసారి కట్ చేశాడు
ఇంటర్నెట్ డెస్క్: పుట్టినరోజున అందరూ కేక్ను సాధారణంగా చాకుతో కోస్తారని తెలుసు. కానీ, ఐఫోన్తో కట్ చేయడం ఎప్పుడైనా చూశారా? ఇటువంటి వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట్లో వైరల్గా మారింది. కర్ణాటకలోని కనకగిరి (కొప్పల్) భాజపా ఎమ్మెల్యే బసవరాజ్ దాడేస్గుర్ కుమారుడు సురేష్ తన పుట్టిన రోజు సందర్భంగా మిత్రులతో కలిసి.. బీఎండబ్ల్యూ కారులో బళ్లారి జిల్లాలోని హోసపేటకు వెళ్లాడు. అక్కడ ఏర్పాటు చేసిన 8 కేకులను తన ఐఫోన్తో ఒకేసారి కట్ చేశాడు. ఈ క్రమంలో అతని మిత్రులు ఫోన్లో వీడియో తీశారు. దాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
ఈ వీడియోపై కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. ‘నియోజకవర్గంలో చాలా మంది తిండి లేకుండా అల్లాడుతున్నారు. కానీ, ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు మాత్రం ఆడంబరంగా జీవిస్తున్నారు. ఇలా చేయడం పేద, అణగారిన వర్గాలను అవమానించడమే’ అని విమర్శలు గుప్పించారు. మరోవైపు సామాజిక మాధ్యమాల్లో తన కుమారుడిపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తుండటంతో సదరు ఎమ్మెల్యే స్పందించారు. తన కుమారుడిని సమర్థిస్తూ.. ‘ఇందులో తప్పేముంది? కొవిడ్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో నా కుమారుడు ఐఫోన్తో కేక్ కట్ చేశాడు’ అని వెనకేసుకు రావడం గమనార్హం. కాగా.. ఎమ్మెల్యే ప్రవర్తనను ఉటంకిస్తూ స్థానికంగా వార్తలు ప్రసారమయ్యాయి. ఎన్నికలకు ముందు నాటికీ, ఇప్పటికీ ఆయనలో చాలా మార్పు వచ్చిందని పేర్కొన్నాయి. ఎన్నికల సమయంలో నియోజకవర్గ ప్రజల నుంచి నిధులను సేకరించి.. గెలిచాక ఆ డబ్బుతోనే లగ్జరీ కార్లను కొనుగోలు చేశారని ఆరోపించాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) జ్యుడీషియల్ కస్టడీని రౌజ్ అవెన్యూ న్యాయస్థానం పొడిగించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
నాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
మీరు పెద్ద రాజకీయ యుద్ధాన్ని ఎదుర్కోనున్నారు.. జనసేనకు మద్దతు ప్రకటించిన నాని
జనసేన పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు తెలుపుతూ నాని పోస్ట్ పెట్టారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
దావత్ కావాలా నాయనా!.. వ్యవసాయ క్షేత్రాల్లో కార్యకర్తల ఖుషీ
ఎన్నికల పండుగొచ్చింది.. దావత్ల మీద దావత్లు ఏర్పాటవుతున్నాయి. కార్యకర్తలను మచ్చిక చేసుకోవడానికి, ప్రచారంలో జోరు ఉండటానికి నాయకులు విందు కార్యక్రమాలను ఎంచుకుంటున్నారు. -
ఆదర్శ కేంద్రం.. ఓటుకు కదులుదాం
లోక్సభ ఎన్నికల్లో శతశాతం ఓటింగ్ లక్ష్యంగా ఎన్నికల సంఘం ప్రత్యక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఓటరు చైతన్య కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. దివ్యాంగులు, 85 ఏళ్లకు పైబడిన వారికి ఇంటి నుంచే ఓటు హక్కు వినియోగించే అవకాశం కల్పించారు. -
పోస్టల్ బ్యాలెట్ ఇంకా రెండు రోజులే!
ఆదిలాబాద్ లోక్సభ నియోజకవర్గంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు 16,972 మంది పోస్టల్ బ్యాలెట్ నమోదు చేసుకోగా.. ఇప్పటి వరకు 5,200 మంది మాత్రమే వినియోగించుకున్నారు. -
రూ.2 చెల్లించు.. ఛాలెంజ్ ఓటేయ్
ఛాలెంజ్ ఓటు.. దీని గురించి ఎన్నికల సమయంలో వింటుంటాం. ఎన్నికల నిర్వహణ నిబంధనలు 1961 చట్టంలోని సెక్షన్ 49ఏలో వివరాలు ఉంటాయి. పలు సందర్భాలలో ఒకరి ఓటును మరొకరు వేస్తారు. -
భాజపా అభ్యర్థితో కాదు ప్రధానితోనే పోటీ
మనకు పోటీ భాజపా అభ్యర్థితో కాదని, ప్రధాని నరేంద్ర మోదీతోనే పోటీ అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ పేర్కొన్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (07/05/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
సోమవారం ముడతల దుస్తులు ధరించండి..! సీఎస్ఐఆర్ వినూత్న ప్రచారం
-
మూడో నెలా పేటీఎం లావాదేవీలు డౌన్.. టాప్లో ఫోన్పే, గూగుల్పే
-
బెయిలిస్తే.. సీఎం విధులు నిర్వర్తించొద్దు: కేజ్రీవాల్కు సుప్రీం సూచన
-
ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
-
చైనా ఆసుపత్రిలో దారుణం.. కత్తి దాడిలో పలువురి మృతి
-
మలయాళంలో రూ.150కోట్లు కొల్లగొట్టిన మూవీ.. ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే?