Hyderabad: వరద ప్రభావిత ప్రాంతాల్లో కిషన్‌రెడ్డి పర్యటన

నగరంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్రమంత్రి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి పర్యటించారు.

Updated : 28 Jul 2023 17:03 IST

హైదరాబాద్‌: నగరంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్రమంత్రి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి పర్యటించారు. యూసుఫ్‌గూడ డివిజన్‌లోని వెంకటగిరి, కృష్ణానగర్‌ ప్రాంతాల్లో పొంగిపొర్లుతున్న నాలాలను ఆయన పరిశీలించారు. కాలనీ వాసులతో మాట్లాడి వారు పడుతున్న ఇబ్బందులను తెలుసుకున్నారు. అనంతరం ఉన్నతాధికారులతో కేంద్రమంత్రి మాట్లాడుతూ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. మరో రెండు రోజులుపాటు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచనల నేపథ్యంలో అధికారులు అందుబాటులో ఉండాలన్నారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని కిషన్‌రెడ్డి సూచించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని