Komatireddy Venkat reddy: డిసెంబర్ 28న మరికొన్ని గ్యారంటీలు: మంత్రి కోమటిరెడ్డి
తెలంగాణలోని 14 రాష్ట్ర రహదారులను (State High Ways) జాతీయ రహదారులుగా మార్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి (Komatireddy Venkat reddy) తెలిపారు.
హైదరాబాద్: తెలంగాణలోని 14 రాష్ట్ర రహదారులను (State High Ways) జాతీయ రహదారులుగా మార్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరామని.. అందుకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari) సానుకూలంగా స్పందించారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి (Komati Reddy Venkat reddy) తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించారని.. అందుకోసం ప్రభుత్వం తరఫున కోమటిరెడ్డి ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం నుంచి వీలైనన్ని ఎక్కువ నిధులు తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని చెప్పారు. హైదరాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి మాట్లాడారు.
‘‘గత ఐదేళ్లుగా రాష్ట్రంలో రాష్ట్ర రహదారుల స్థితిని నేను చూస్తూ వచ్చాను. కొన్ని చోట్ల రహదారులపై గుంతలు ఏర్పడితే మట్టితో నింపేశారు. గుంతలు ఏర్పడితే సిమెంట్, లేదా బీటీ ప్యాచ్లు వేసి గుంతలను పూడ్చాల్సి ఉంటుంది. నేను మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ముందుగా అధికారులకు ఆదేశాలు ఇచ్చాను. రహదారులపై ఎక్కడ గుంతులున్నా.. వాటిని వెంటనే మరమ్మతు చేయాలని చెప్పా. రాష్ట్ర రహదారుల విషయంలో ఏపీతో పోల్చితే తెంగాణకు కేంద్రం నుంచి తక్కువ నిధులు వచ్చాయి. ఇప్పటినుంచి కేంద్ర ప్రభుత్వంతో తరచూ సంప్రదింపులు చేస్తూ రాష్ట్రానికి ఎక్కువ నిధులు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తాం.
కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీల్లో ఇప్పటికే రెండింటిని మొదలుపెట్టాం. మిగిలినవి కూడా అమలు చేసేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నాం. డిసెంబర్ 28న.. కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక దినోత్సవం రోజున మరికొన్ని గ్యారంటీలను మొదలు పెడతాం. ఇలా 100 రోజుల్లోగా అన్ని గ్యారంటీలను అమల్లోకి తీసుకొచ్చి.. తెలంగాణలో ప్రజా పాలన కొనసాగిస్తాం’’ అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
భానుడి వేడి..దొరకని నాడి
లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో ఇంకా పట్టణ ఓటరు నాడి అంతుచిక్కకుండా ఉంది. -
సాంకేతిక జోరు.. అరచేతిలో హోరు
ర్యాలీలు, బహిరంగ సభలు, ఇంటింట ప్రచారం.. ఇదంతా ఎన్నికల ప్రచారంలో ఒక ఎత్తు. ప్రస్తుతం అభ్యర్థులు తమ ప్రచారం ఎక్కువ మందికి చేరేందుకు సామాజిక మాధ్యమాలను వేదికగా చేసుకుంటున్నారు. -
జగనన్న.. భూభక్ష చట్టం
ఇసుక అక్రమంగా తవ్వారు.. మట్టినీ దోచుకున్నారు.. ప్రకృతి వనరులను ఇష్టారాజ్యంగా ధ్వంసం చేశారు. వీటన్నింటినీ ఖాళీ చేశారు. ఇప్పటికే కనిపించిన ఖాళీ జాగాలు, ప్రభుత్వ భూములను కబ్జా చేసిన వైకాపా నేతల కన్ను ప్రజల స్థలాలపై పడింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (05/05/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
చెన్నైకి మరో షాక్.. గాయం కారణంగా స్వదేశానికి పతిరన
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
మారిన ట్రెండ్.. ఎన్నికల వేళా ఐపీఓల సందడి!
-
రోజా కామెంట్స్పై స్పందించిన గెటప్ శ్రీను.. ఏమన్నారంటే?
-
వందల మంది ‘రేవణ్ణ’ బాధితులకు.. ప్రభుత్వం ఆర్థిక సహాయం!
-
బైక్ పార్కింగ్ విషయంలో గొడవ.. తమ్ముడిని చంపిన అన్న