Hyderabad: తెలంగాణ ఆర్టీసీ ఛైర్మన్‌గా ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి

రాష్ట్రంలో మూడు కార్పొరేషన్లకు ఛైర్మన్లతోపాటు మిషన్‌ భగీరథకు వైస్‌ ఛైర్మన్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Updated : 05 Oct 2023 22:30 IST

హైదరాబాద్‌: మూడు కార్పొరేషన్లకు ఛైర్మన్లను నియమిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్టీసీ ఛైర్మన్‌గా ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. రైతు బంధు సమితి ఛైర్మన్‌గా తాటికొండ రాజయ్య, ఎంబీసీ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా నందికంటి శ్రీధర్‌ను నియమించింది. వీరితోపాటు మిషన్‌ భగీరథ వైస్‌ ఛైర్మన్‌గా ఉప్పల వెంకటేశ్‌లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు