NTR Jayanthi: నిమ్మకూరులో బాలకృష్ణ.. ఎన్టీఆర్‌ విగ్రహానికి నివాళులు

కృష్ణా జిల్లా నిమ్మకూరులో ఎన్టీఆర్‌ విగ్రహానికి ప్రముఖ సినీనటుడు నందమూరి బాలకృష్ణ నివాళులు అర్పించారు.

Updated : 28 May 2022 09:17 IST

నిమ్మకూరు: కృష్ణా జిల్లా నిమ్మకూరులో ఎన్టీఆర్‌ విగ్రహానికి ప్రముఖ సినీనటుడు నందమూరి బాలకృష్ణ నివాళులు అర్పించారు. ఎన్టీఆర్‌ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా నిమ్మకూరు వచ్చిన ఆయన.. వేంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.

ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. తెలుగువారి గుండెల్లో ఎన్టీఆర్‌ చిరస్థాయిలో నిలిచిపోయారు. తెలుగువారి ఆత్మగౌరవం నిలబెట్టేలా నేనున్నానని ముందుకొచ్చారు. రెండు రూపాయాలకు కిలో బియ్యం, పేదలకు ఇళ్లు ఇచ్చారు. నిమ్మకూరును పర్యాటకంగా అభివృద్ధి చేస్తాం. నిమ్మకూరు చెరువు వద్ద ఎన్టీఆర్‌ విగ్రహం ఏర్పాటు చేస్తాం. 35 అడుగుల విగ్రహం ఏర్పాటుకు అంతా తీర్మానించాం.

యువకులు రాజకీయాల్లోకి రావాలి.. ఉత్సాహంతో పని చేయాలి. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన ఘనత చంద్రబాబుది. ఇప్పుడు రాష్ట్ర పరిస్థితి ఎలా ఉందో అంతా చూస్తున్నారు. రాష్ట్ర పరిస్థితిపై మహానాడులో పూర్తిగా మాట్లాడతా’’ అని బాలకృష్ణ అన్నారు. మరోవైపు బాలకృష్ణ రాకతో నిమ్మకూరు గ్రామంలో సందడి వాతావరణం నెలకొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని