Botsa satyanarayana: హైదరాబాద్‌లో ఏపీ మంత్రి బొత్సకు ఓపెన్‌హార్ట్‌ సర్జరీ

ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణకు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో గుండె శస్త్ర చికిత్స విజయవంతంగా పూర్తి చేశారు.

Updated : 11 Nov 2023 22:29 IST

హైదరాబాద్‌: ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణకు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో గుండె శస్త్ర చికిత్స విజయవంతంగా పూర్తి చేశారు. శృంగవరపు కోటలో జరిగిన వైకాపా సామాజిక సాధికార బస్సు యాత్రలో పాల్గొన్న మంత్రి అస్వస్థతకు గురయ్యారు. గత వారం రోజులుగా గుండె సంబంధిత సమస్యతో ఇబ్బంది పడుతున్న ఆయన విశాఖలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం కుటుంబసభ్యులు హైదరాబాద్‌ తరలించారు. శనివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం వరకు ప్రత్యేక వైద్యబృందం పర్యవేక్షణలో ఓపెన్‌హార్ట్‌ సర్జరీ విజయవంతంగా పూర్తి చేశారు. దాదాపు నెల రోజులపాటు హైదరాబాద్‌లోని ఆసుపత్రిలోనే విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని