Telangana News: అవయవ దానంతో.. ఏడుగురికి ఆయువు పోసింది!

జీవన్మృతురాలైన ఓ మహిళ అవయవ దానం.. మరో ఏడుగురి ప్రాణాలు నిలిపింది.

Published : 17 Feb 2022 17:52 IST

నల్గొండ: జీవన్మృతురాలైన ఓ మహిళ అవయవ దానం.. మరో ఏడుగురి ప్రాణాలు నిలిపింది. నల్గొండ జిల్లా బాలంకకు చెందిన సైదమ్మ.. ఈ నెల 8న నిద్రలోనే అపస్మారక స్థితిలోకి వెళ్లింది. వెంటనే కుటుంబసభ్యులు ఆమెను చికిత్స కోసం హైదరాబాద్‌లోని మలక్‌పేటలో యశోద ఆసుపత్రికి తీసుకువచ్చారు. వారం రోజుల పాటు వైద్యం అందించిన డాక్టర్లు.. బ్రెయిన్ డెడ్‌గా నిర్ధరించారు. ఈ విషయం తెలుసుకున్న జీవన్‌దాన్ వైద్య బృందం.. ఆమె కుటుంబ సభ్యులను కలిసి అవయవ దానం చేసేందుకు ఒప్పించారు. ఆమె రెండు మూత్రపిండాలు, కాలేయం, ఊపిరి తిత్తులు, కంటి కార్నియాలను సేకరించి ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులకు అమర్చారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని