Pfizer: 5-11 ఏళ్లలోపు చిన్నారులకు ఫైజర్ టీకా సురక్షితం
ఐదేళ్ల నుంచి 11 ఏళ్లలోపు చిన్నారుల విషయంలో తాము రూపొందించిన కొవిడ్ వ్యాక్సిన్ సమర్థంగా పనిచేస్తున్నట్లు క్లినికల్ ట్రయల్స్లో వెల్లడైందని ఫైజర్, బయోఎన్టెక్ సంస్థలు సోమవారం ఓ సంయుక్త ప్రకటనలో తెలిపాయి. వారికి ఈ టీకాలు సురక్షితమని వెల్లడించాయి...
ఫైజర్, బయోఎన్టెక్ సంయుక్త ప్రకటనలో వెల్లడి
న్యూయార్క్: ఐదేళ్ల నుంచి 11 ఏళ్లలోపు చిన్నారుల విషయంలో తాము రూపొందించిన కొవిడ్ వ్యాక్సిన్ సమర్థంగా పనిచేస్తున్నట్లు క్లినికల్ ట్రయల్స్లో వెల్లడైందని ఫైజర్, బయోఎన్టెక్ సంస్థలు సోమవారం ఓ సంయుక్త ప్రకటనలో తెలిపాయి. వారికి ఈ టీకాలు సురక్షితమని వెల్లడించాయి. డెల్టా వేరియంట్ విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో చిన్నారులకూ మహమ్మారి నుంచి రక్షణ అందించేందుకు ఎదురుచూస్తున్నామని ఫైజర్ ఛైర్మన్, సీఈవో ఆల్బర్ట్ బౌర్లా తెలిపారు. ‘జులై నుంచి అమెరికావ్యాప్తంగా చిన్నారుల్లో కొవిడ్ కేసులు దాదాపు 240 శాతం పెరిగాయి. ఈ ప్రమాదకర పరిస్థితి.. టీకా ఆవశ్యకతను తెలుపుతోంద’న్నారు.
2,268 మందిపై క్లినికల్ ట్రయల్స్
క్లినికల్ ట్రయల్స్లో భాగంగా 5- 11 ఏళ్ల మధ్య వయస్సుగల 2,268 మంది చిన్నారులకు రెండు డోసుల టీకా ఇచ్చారు. 12 ఏళ్లు దాటినవారికి ఇస్తున్న మోతాదుతో పోల్చితే కొంత తక్కువ ఇచ్చారు. ఈ క్రమంలో వారిలో టీకా ప్రభావవంతంగా పని చేస్తున్నట్లు తేలిందని చెప్పారు. పెద్ద మొత్తంలో యాంటీబాడీలనూ ఉత్పత్తి చేసిందని తెలిపారు. ఈ ట్రయల్స్ వివరాలను త్వరలో అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్డీఏ), యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ, ఇతర దేశాల ఔషధ నియంత్రణ సంస్థలకు సమర్పిస్తామని, అమెరికాలో అత్యవసర వినియోగానికి దరఖాస్తు చేస్తామని బౌర్లా తెలిపారు. ప్రస్తుతం 2-5 ఏళ్లు, ఆరు నెలల నుంచి రెండేళ్ల వయస్సు మధ్య చిన్నారులపై ట్రయల్స్ జరుగుతున్నాయని, ఏడాది చివరినాటికి ఫలితాలు రావొచ్చని ఫైజర్, బయోఎన్టెక్ వెల్లడించాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM