Amaravati: సమగ్ర శిక్షా అభియాన్ జేఏసీతో రాష్ట్ర ప్రభుత్వం చర్చలు విఫలం
సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగుల జేఏసీతో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ జరిపిన చర్చలు విఫలమయ్యాయి.
అమరావతి: సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగుల జేఏసీతో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ జరిపిన చర్చలు విఫలమయ్యాయి. ‘‘ఉద్యోగులు కోరుతున్న రీతిలో సానుకూలంగా చర్చలు జరగలేదు. సమగ్ర శిక్షా అభియాన్ సిబ్బందిని రెగ్యులర్ చేసే అవకాశం లేదని స్పష్టం చేశారు. ఇప్పటివరకు వేతనాలు పెరగని వారికి మాత్రమే పెంచుతామన్నారు. దానిపై కూడా నిర్దిష్టమైన హామీ రాలేదు. ఆదివారం నిరసన శిబిరం వద్ద చర్చల సారాంశాన్ని తెలియజేస్తాం. తదుపరి కార్యాచరణ ప్రకటిస్తాం’’ అని జేఏసీ ప్రతినిధులు తెలిపారు.
చర్చల అనంతరం మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. జేఏసీ ప్రతినిధులతో చర్చించాం.. సమ్మెలో కొద్ది మంది మాత్రమే ఉన్నారు. ఎన్నికల ముందు అడిగితే అన్నీ అయిపోతాయనే ఆలోచనలో ఉన్నారు. సమ్మె చేసే వారి వెనుక కమ్యూనిస్టు పార్టీ నేతలు ఉంటున్నారు’’ అని వ్యాఖ్యానించారు. ఇచ్చిన హామీలను గాలికొదిలేసి సీఎం జగన్ (CM Jagan) మోసం చేశారంటూ సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగులు రోడ్డెక్కిన విషయం తెలిసిందే. సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని, ఉద్యోగ భద్రత, గ్రాట్యుటీ తదితర డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ సమ్మె కొనసాగిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
పింఛన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వానికి ఈసీ ఆదేశాలు
పింఛన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వానికి ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల కోడ్ అమలు దృష్ట్యా లబ్ధిదారులకు ఇబ్బంది లేకుండా చూడాలని కోరింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఎన్నికల వేడి.. రైళ్లు ప్రత్యేకమండి
వేసవి సెలవులు వచ్చాయంటే ప్రత్యేక రైళ్లు వేయడం పరిపాటే. కానీ ఈ సారి వాటికి తోడు ఎన్నికలు కూడా వచ్చాయి. -
డ్వాక్రా మహిళలే కీలకం!
జిల్లా వ్యాప్తంగా గ్రామం, వార్డు అనే తేడా లేకుండా అన్నిచోట్లా ‘డ్వాక్రా స్వయం సహాయక సంఘాలు’న్నాయి. వీటిలో వేలాది మంది కొనసాగుతున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు. -
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
Viral Video: స్పైడర్ మ్యాన్, స్పైడర్ ఉమెన్ దుస్తుల్లో దిల్లీ రోడ్లపై చక్కర్లు కొట్టిన జంటను పోలీసులు అరెస్టు చేశారు. ఎందుకంటే?
తాజా వార్తలు (Latest News)
-
లోన్ యాప్ వేధింపులకు బీటెక్ విద్యార్థి బలి
-
కిర్రాకు పుట్టిస్తున్న అషు.. కేక పెటిస్తున్న ఖుషీ..
-
‘నా ప్రత్యర్థి మోదీ.. సీఎం కాదు’: హిమంతకు ఖర్గే కౌంటర్
-
ఇండస్ట్రీలో ఆ హీరోయిన్స్ తక్కువ.. ఆ ఖాళీని భర్తీ చేయాలనుకుంటున్నా!
-
‘కల్కి 2898 ఏడీ’ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఇదే
-
‘అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా’: బైడెన్