రైళ్లలో రద్దీ పెరగడం అవాస్తవం: ద.మ.రైల్వే
రైళ్లలో రద్దీ పెరిగినట్లు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న దృశ్యాలు వాస్తవం కాదని.. ప్రయాణికుల రద్దీ సాధరణంగానే ఉందని దక్షిణ మధ్య రైల్యే(ద.మ.రైల్వే) జనరల్ మేనేజర్ గజానన్ మాల్యా స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన వర్చువల్గా మీడియాతో మాట్లాడారు...
హైదరాబాద్: రైళ్లలో రద్దీ పెరిగినట్లు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న దృశ్యాలు వాస్తవం కాదని.. ప్రయాణికుల రద్దీ సాధారణంగానే ఉందని దక్షిణ మధ్య రైల్యే జనరల్ మేనేజర్ గజానన్ మాల్యా స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన వర్చువల్గా మీడియాతో మాట్లాడారు. ద.మ.రైల్వే పరిధిలో 300 కి.మీ. మేర కొత్త రైల్వే లైన్ పూర్తయిందని.. 750 కి.మీ. మేర విద్యుదీకరణ పనులు పూర్తి చేసినట్లు చెప్పారు. ప్రమాదాల నివారణకు 321 కి.మీ. పరిధిలోని 34 స్టేషన్లల్లో ట్రైన్ కొలిజన్ అవైడింగ్ సిస్టమ్ (టీసీఏఎస్) వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వెల్లడించారు. చెన్నై-దిల్లీ మార్గంలో 2,828 కి.మీ. మేర రైళ్ల వేగాన్ని గంటకు 130 కిలోమీటర్లకు పెంచామన్నారు.
ద.మ.రైల్వే పరిధిలో పార్శిల్స్ ద్వారా అత్యధికంగా రూ.108 కోట్ల ఆదాయం సమకూరినట్లు గజానన్ తెలిపారు. దేశ రాజధాని దిల్లీకి 2020-21 ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా 7.3 కోట్ల లీటర్ల పాలు, 120 కిసాన్ రైళ్ల ద్వారా 50 శాతం రాయితీతో 40వేల టన్నుల వ్యవసాయ ఉత్పత్తులను రవాణా చేసినట్లు చెప్పారు. 2019-20 ఆర్థిక సంవత్సరంలో 183 రైళ్లు నడవగా.. కొవిడ్ నేపథ్యంలో 2020-21లో కొంతకాలం పూర్తిగా స్తంభించిపోయాయని.. అనంతరం కరోనా ప్రభావం తగ్గిన వెంటనే దశల వారీగా 180 రైళ్లను పునరుద్ధరించినట్లు వెల్లడించారు. 2.40 కోట్ల మంది ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేరవేశామన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మీరు పెద్ద రాజకీయ యుద్ధాన్ని ఎదుర్కోనున్నారు.. జనసేనకు మద్దతు ప్రకటించిన నాని
జనసేన పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు తెలుపుతూ నాని పోస్ట్ పెట్టారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
దావత్ కావాలా నాయనా!.. వ్యవసాయ క్షేత్రాల్లో కార్యకర్తల ఖుషీ
ఎన్నికల పండుగొచ్చింది.. దావత్ల మీద దావత్లు ఏర్పాటవుతున్నాయి. కార్యకర్తలను మచ్చిక చేసుకోవడానికి, ప్రచారంలో జోరు ఉండటానికి నాయకులు విందు కార్యక్రమాలను ఎంచుకుంటున్నారు. -
ఆదర్శ కేంద్రం.. ఓటుకు కదులుదాం
లోక్సభ ఎన్నికల్లో శతశాతం ఓటింగ్ లక్ష్యంగా ఎన్నికల సంఘం ప్రత్యక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఓటరు చైతన్య కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. దివ్యాంగులు, 85 ఏళ్లకు పైబడిన వారికి ఇంటి నుంచే ఓటు హక్కు వినియోగించే అవకాశం కల్పించారు. -
పోస్టల్ బ్యాలెట్ ఇంకా రెండు రోజులే!
ఆదిలాబాద్ లోక్సభ నియోజకవర్గంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు 16,972 మంది పోస్టల్ బ్యాలెట్ నమోదు చేసుకోగా.. ఇప్పటి వరకు 5,200 మంది మాత్రమే వినియోగించుకున్నారు. -
రూ.2 చెల్లించు.. ఛాలెంజ్ ఓటేయ్
ఛాలెంజ్ ఓటు.. దీని గురించి ఎన్నికల సమయంలో వింటుంటాం. ఎన్నికల నిర్వహణ నిబంధనలు 1961 చట్టంలోని సెక్షన్ 49ఏలో వివరాలు ఉంటాయి. పలు సందర్భాలలో ఒకరి ఓటును మరొకరు వేస్తారు. -
భాజపా అభ్యర్థితో కాదు ప్రధానితోనే పోటీ
మనకు పోటీ భాజపా అభ్యర్థితో కాదని, ప్రధాని నరేంద్ర మోదీతోనే పోటీ అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ పేర్కొన్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (07/05/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
దటీజ్ ధోనీ.. లోయర్ ఆర్డర్లో ఎందుకొస్తున్నాడో తెలుసా..?
-
మీరు పెద్ద రాజకీయ యుద్ధాన్ని ఎదుర్కోనున్నారు.. జనసేనకు మద్దతు ప్రకటించిన నాని
-
నా జీవితాన్ని మార్చింది.. ‘ఆర్య’పై అల్లు అర్జున్ పోస్ట్
-
నెల క్రితం ప్రమోషన్.. ఇప్పుడు లేఆఫ్.. టెస్లాలో భారత టెకీ ఆవేదన!
-
పవన్ను గెలిపించండి.. సేవకుడిగా అండగా ఉంటాడు: చిరంజీవి
-
‘దయచేసి మా దేశానికి రండి’.. భారతీయులను వేడుకుంటున్న మాల్దీవులు