ఐదేళ్లలో 50 వేల స్టార్టప్లు
దేశంలో స్టార్టప్ల ఒరవడి కొనసాగుతోంది. ఐదేళ్లలో దేశవ్యాప్తంగా 50 వేల స్టార్టప్లను స్థాపించడమే ఇందుకు నిదర్శనం. డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్(డీపీఐఐటీ) ఈ మేరకు గణాంకాలను విడుదల చేసింది.
అగ్రస్థానంలో దిల్లీ, కర్ణాటక
45 శాతం స్టార్టప్ల నాయకత్వ బృందాలలో మహిళా పారిశ్రామికవేత్తలు
ఇంటర్నెట్ డెస్క్: దేశంలో స్టార్టప్ల ఒరవడి కొనసాగుతోంది. ఐదేళ్లలో దేశవ్యాప్తంగా 50 వేల స్టార్టప్లను స్థాపించడమే ఇందుకు నిదర్శనం. డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్(డీపీఐఐటీ) ఈ మేరకు గణాంకాలను విడుదల చేసింది. ఎక్కువ సంఖ్యలో స్టార్టప్ల స్థాపనతో దిల్లీ, కర్ణాటకలు అగ్రస్థానంలో ఉండగా.. తర్వాతి స్థానాల్లో మహారాష్ట్ర, ఉత్తర్ప్రదేశ్, గుజరాత్లు నిలిచినట్లు ఆ గణాంకాల ద్వారా తెలుస్తోంది. అధికారిక సమాచారం ప్రకారం 45 శాతం స్టార్టప్ల నాయకత్వ బృందాలలో మహిళా పారిశ్రామికవేత్తలు ఉండటం గమనార్హం. ఫుడ్ ప్రాసెసింగ్, ప్రొడక్ట్ డెవలప్మెంట్, అప్లికేషన్ డెవలప్మెంట్, ఐటీ కన్సల్టింగ్ రంగాల్లో ఎక్కువ స్టార్టప్లు నమోదయ్యాయి. గురువారం నాటికి డీపీఐఐటీ వెల్లడించిన గణాంకాల ప్రకారం.. 2020 ఏప్రిల్ 1 నుంచి 19,896 స్టార్టప్లు గుర్తింపు పొందాయి. 2016లో స్టార్టప్ ఇండియా కార్యక్రమం ప్రారంభం అయినప్పటి నుంచి దేశవ్యాప్తంగా 623 జిల్లాలకు ఈ స్టార్టప్లు విస్తరించాయి.
కేంద్రపాలిత ప్రాంతాలు సహా ప్రతి రాష్ట్రంలో కనీసం ఒక స్టార్టప్ ఉంది. స్టార్టప్ల ప్రారంభానికి బీజం పడిన తొలి ఏడాది కాలంలో 743 అంకురాలను స్థాపించగా.. 2020-2021 మధ్య కాలంలో 16 వేల అంకురాలను స్థాపించినట్లు గుర్తించారు. ప్రారంభంలో 10 వేల స్టార్టప్లను స్థాపించడానికి 808 రోజుల సమయం పడితే.. ప్రస్తుతం 180 రోజుల్లోనే 10 వేల మార్కును చేరుకుంటున్నట్లు అధికారిక వర్గాలు చెబుతున్నాయి. ఔత్పాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్పహించడంలో భాగంగా స్థాపించిన స్టార్టప్లు ఇప్పుడు ఉద్యోగ కల్పనలోనూ కీలకంగా మారాయని డీపీఐఐటీ తెలిపింది. 48,093 స్టార్టప్లు ఇప్పటివరకు 5,49,842 ఉద్యోగాలను సృష్టించినట్లు పేర్కొంది. అంటే ఒక్కో స్టార్టప్ సగటున 11 ఉద్యోగాలను సృష్టించినట్టు వివరించింది. కేవలం 2020-2021 మధ్య కాలంలో స్థాపించిన అంకురాల ద్వారానే 1.7 లక్షల కొత్త ఉద్యోగాలు పుట్టుకొచ్చినట్టు తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
రాష్ట్రంలో 3 రోజుల పాటు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
-
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్
-
రివ్యూ: రత్నం.. విశాల్ నటించిన యాక్షన్ డ్రామా మెప్పించిందా?
-
డీజీసీఏ కొత్త రూల్.. విమాన టికెట్ల ధరలు తగ్గుతాయా?