రాఖీ పండుగ.. కరోనా వారియర్స్తో
రాఖీ పండుగను పురస్కరించుకొని సైకతశిల్పి సుదర్శన్ పట్నాయక్ కరోనా వారియర్స్ను ప్రతిబింబించేలా ఇసుకతో పూరి తీరంలో సైకత శిల్పాన్ని రూపొందించారు.
భువనేశ్వర్: రాఖీ పండుగను పురస్కరించుకొని సైకతశిల్పి సుదర్శన్ పట్నాయక్ కరోనా వారియర్స్ను ప్రతిబింబించేలా ఇసుకతో పూరి తీరంలో సైకత శిల్పాన్ని రూపొందించారు. కొవిడ్ మహమ్మారిని ఎదుర్కొనేందుకు పగలు రాత్రి తేడా లేకుండా పనిచేస్తున్న కరోనా వారియర్స్ను రాఖీ పండుగ సందర్భంగా గుర్తు చేసుకోవాలని పట్నాయక్ అన్నారు. రాఖీ పండుగ కరోనా వారియర్స్తో అనే నినాదాన్ని సైకత శిల్పంపై ఉంచారు.
కరోనా నియంత్రణకు దేశవ్యాప్తంగా వైద్యులు, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు కృషి చేస్తున్నారు. కొందరు తమ కుటుంబాలకు దూరంగా ఉంటూ సేవలు అందిస్తున్నారు. గతంలో వైద్య సిబ్బంది సేవల్ని ప్రశంసిస్తూ కేంద్ర ప్రభుత్వం పూలవర్షం కురిపించింది. ఈ నేపథ్యంలో సుదర్శన్ పట్నాయక్ గీసిన చిత్రం చూపరులను ఆకట్టుకుంటోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆదర్శ కేంద్రం.. ఓటుకు కదులుదాం
లోక్సభ ఎన్నికల్లో శతశాతం ఓటింగ్ లక్ష్యంగా ఎన్నికల సంఘం ప్రత్యక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఓటరు చైతన్య కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. దివ్యాంగులు, 85 ఏళ్లకు పైబడిన వారికి ఇంటి నుంచే ఓటు హక్కు వినియోగించే అవకాశం కల్పించారు. -
దావత్ కావాలా నాయనా!
ఎన్నికల పండుగొచ్చింది.. దావత్ల మీద దావత్లు ఏర్పాటవుతున్నాయి. కార్యకర్తలను మచ్చిక చేసుకోవడానికి, ప్రచారంలో జోరు ఉండటానికి నాయకులు విందు కార్యక్రమాలను ఎంచుకుంటున్నారు. -
రూ.2 చెల్లించు.. ఛాలెంజ్ ఓటేయ్
ఛాలెంజ్ ఓటు.. దీని గురించి ఎన్నికల సమయంలో వింటుంటాం. ఎన్నికల నిర్వహణ నిబంధనలు 1961 చట్టంలోని సెక్షన్ 49ఏలో వివరాలు ఉంటాయి. పలు సందర్భాలలో ఒకరి ఓటును మరొకరు వేస్తారు. -
భాజపా అభ్యర్థితో కాదు ప్రధానితోనే పోటీ
మనకు పోటీ భాజపా అభ్యర్థితో కాదని, ప్రధాని నరేంద్ర మోదీతోనే పోటీ అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ పేర్కొన్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (07/05/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.