Andhra News: ఏమయ్యా రూ.5వేలు ఇస్తానని వెయ్యి ఇస్తావా?.. తహశీల్దార్ వీడియో వైరల్
‘ఏమయ్యా రూ.5000 ఇస్తానని చెప్పి వెయ్యి రూపాయలు ఇస్తావా? ఇదేనా? అక్కడ ఇచ్చి పని చేసుకు పో..’’ చిత్తూరు జిల్లా పెనుమూరు మండల తహశీల్దార్ రమణి ఓ రైతుతో అన్న మాటలివి. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అయ్యింది.
పెనుమూరు: ‘ఏమయ్యా రూ.5000 ఇస్తానని చెప్పి వెయ్యి రూపాయలు ఇస్తావా? ఇదేనా? అక్కడ ఇచ్చి పని చేసుకు పో..’’ చిత్తూరు జిల్లా పెనుమూరు మండల తహశీల్దార్ రమణి ఓ రైతుతో అన్న మాటలివి. వివరాల్లోకి వెళితే పెనుమూరు మండలంలోని కలవకుంట పంచాయతీ పూనేపల్లికి చెందిన రైతు సయ్యద్ తనకున్న వ్యవసాయ భూమిని వాణిజ్య భూమిగా మార్పు చేసుకునేందుకు తహశీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నాడు. ఈ క్రమంలో తహశీల్దార్ రమణిని రైతు సయ్యద్ సంప్రదించగా.. రూ.5వేలు ఇస్తేనే ధ్రువీకరణ పత్రం ఇస్తామని తహశీల్దార్ తేల్చి చెప్పారు. అందుకు సయ్యద్ కూడా అంగీకరించాడు.
అయితే, రైతు సయ్యద్కు అంత మొత్తం డబ్బులు సమకూరక పోవడంతో మరోసారి తహశీల్దార్ను కలిశాడు. రూ.5వేలు సమకూరలేదని వెయ్యి రూపాయలే సర్దుబాటయ్యాయని, రూ.వెయ్యి ఇస్తానని చెప్పాడు. అందుకు ఆమె అసహనంతో..‘ ఏందయ్యా మీరు చెప్పేది ఒకటి చేసేది ఒకటి’ అని నిట్టూర్చారు. రూ.5వేలు ఇస్తానని వెయ్యి ఇస్తావా? పక్కన ఇచ్చి పని చేసుకో.. అని అసహనంతో ఆదేశించారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ఉన్నతాధికారులు స్పందించారు. తహశీల్దార్పై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించినట్టు సమాచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
రాష్ట్రంలో 3 రోజుల పాటు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
-
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్
-
రివ్యూ: రత్నం.. విశాల్ నటించిన యాక్షన్ డ్రామా మెప్పించిందా?
-
డీజీసీఏ కొత్త రూల్.. విమాన టికెట్ల ధరలు తగ్గుతాయా?