Australia: గొర్రెల మందతో మేనత్తకు వినూత్న నివాళి 

హృదయం చిహ్నం ద్వారా ఒకరిపై మరొకరు తమ ప్రేమను వ్యక్తం పరుస్తూ ఉంటారు. ఆస్ట్రేలియాకు చెందిన ఓ రైతు అలాంటి ప్రయత్నమే చేశాడు. కరోనా ఆంక్షల కారణంగా తనకెంతో ఇష్టమైన తన మేనత్త ..

Updated : 27 Aug 2021 11:10 IST

మెల్‌బోర్న్‌: హృదయం చిహ్నం ద్వారా ఒకరిపై మరొకరు తమ ప్రేమను వ్యక్తం పరుస్తూ ఉంటారు. ఆస్ట్రేలియాకు చెందిన ఓ రైతు అలాంటి ప్రయత్నమే చేశాడు. కరోనా ఆంక్షల కారణంగా తనకెంతో ఇష్టమైన తన మేనత్త అంత్యక్రియలకు హాజరుకాలేకపోయిన బెన్‌ జాక్సన్‌.. ఆమెకు వినూత్న రీతిలో నివాళులర్పించాడు. గొర్రెల మందను హృదయం ఆకారంలో నిలిపి మేనత్త పట్ల తనకున్న ప్రేమను తెలిపాడు. గొర్రెలు హృదయం ఆకారంలో ఒకే చోటకు చేరడం అందర్నీ ఆశ్చరపరుస్తోంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని