CM Jagan: పులివెందులలో సీఎం జగన్‌ క్రిస్మస్‌ ప్రార్థనలు

క్రిస్మస్‌ సందర్భంగా ఏపీ సీఎం జగన్‌ స్వస్థలమైన కడప జిల్లా పులివెందులలోని సీఎస్‌ఐ చర్చికి వెళ్లారు.

Updated : 25 Dec 2021 13:11 IST

పులివెందుల: క్రిస్మస్‌ సందర్భంగా ఏపీ సీఎం జగన్‌ స్వస్థలమైన కడప జిల్లా పులివెందులలోని సీఎస్‌ఐ చర్చికి వెళ్లారు. కుటుంబ సభ్యులతో కలిసి క్రిస్మస్‌ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రార్థనల్లో సీఎం జగన్‌, ఆయన తల్లి విజయమ్మ, భార్య భారతి తదితర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. జగన్‌ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలకు క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని