Corona Vaccine: టీకా సమాచారమున్న ల్యాప్టాప్లు మాయం!
గ్రేటర్ వ్యాప్తంగా కొవిడ్ టీకా కేంద్రాలు ఒక్కొక్కటిగా మూతపడుతున్నాయి. ప్రత్యేక టీకా కార్యక్రమంలో భాగంగా అధికారులు నగరవ్యాప్తంగా వందకుపైగా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఏజెన్సీ ద్వారా సమకూర్చుకున్న కంప్యూటర్ ఆపరేటర్లు
మూణ్నెళ్లుగా వేతనాలివ్వకపోవడంతో తీసుకెళ్లిన ఆపరేటర్లు
ఈనాడు, హైదరాబాద్, మెహిదీపట్నం, న్యూస్టుడే: గ్రేటర్ వ్యాప్తంగా కొవిడ్ టీకా కేంద్రాలు ఒక్కొక్కటిగా మూతపడుతున్నాయి. ప్రత్యేక టీకా కార్యక్రమంలో భాగంగా అధికారులు నగరవ్యాప్తంగా వందకుపైగా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఏజెన్సీ ద్వారా సమకూర్చుకున్న కంప్యూటర్ ఆపరేటర్లు ఆయా కేంద్రాలను నడిపించారు. టీకా కేంద్రాలకు వచ్చిన పౌరుల వివరాలను వీరు ల్యాప్టాప్లోని సాఫ్ట్వేర్లో నమోదు చేసి వైద్య ఆరోగ్యశాఖకు చేరవేసేవారు. అందుకు గుత్తేదారు వాళ్లకు రోజువారీ డబ్బు చెల్లించాల్సి ఉంది. మూణ్నెళ్లుగా తమకు వేతనం ఇవ్వట్లేదని సిబ్బంది వాపోయారు. అందుకే విధులను బహిష్కరిస్తున్నామని మెహిదీపట్నంలోని ఓ టీకా కేంద్రం సిబ్బంది ఒకరు ‘ఈనాడు’తో తెలిపారు. ఏజెన్సీ నుంచి సరైన స్పందన రాకపోవడంతోనే ల్యాప్టాప్లు తీసుకెళ్లామని వెల్లడించారు. దీంతో నగరంలోని సుమారు 50 కేంద్రాలు మూతపడ్డాయి. కొన్ని చోట్ల పౌరులు ఇబ్బంది పడకుండా పారిశుద్ధ్య పర్యవేక్షకులను రంగంలోకి దించి కేంద్రాలు నడిపిస్తున్నామని జీహెచ్ఎంసీ అధికారి తెలిపారు. ప్రస్తుతం టీకాల సరఫరా తగ్గిందని, అందువల్ల అరకొర కేంద్రాలతోనే నెట్టుకొస్తున్నామన్నారు. ల్యాప్టాప్లలోని సమాచారం ప్రభుత్వ వెబ్సైట్లో ఉంటుందని, వాటిని తీసుకెళ్లడం వల్ల టీకా కార్యక్రమానికి ఎలాంటి సమస్య లేదన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
విశాఖ ఉక్కు కర్మాగారానికి చెందిన భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఏపీ హైకోర్టు ఆదేశించింది. -
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై ప్రజల నుంచి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఫిర్యాదులు, నివేదనలు కోరింది. -
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
సీఎం జగన్కు బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుందని వైఎస్ సునీత అన్నారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైదరాబాద్ - బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా ఉప్పల్ వేదికగా గురువారం రాత్రి 7.30 గంటలకు సన్రైజర్స్ హైదరాబాద్, బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. -
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
సీఎం జగన్ (YS Jagan)కు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ బహిరంగ లేఖ రాశారు. వివేకా హత్య (Viveka Murder Case)కు కారకులైన వారికి మళ్లీ ఎంపీగా అవకాశం ఇవ్వడంతో పాటు రక్షణ కల్పిస్తున్నారంటూ ఆమె నిలదీశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
30 వైడ్ బాడీ విమానాలకు ఇండిగో ఆర్డర్.. ఎయిరిండియాకు గట్టి పోటీ!
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM