AP News: ఆ సొమ్ము రికవరీ అయ్యేవరకూ వారికి రేషన్, పింఛన్ బంద్!
సాలూరు మండలం శివరాంపురం గ్రామంలోని కొంతమందికి రేషన్, పింఛన్ నిలిపివేయాలని అధికారులను స్థానిక తహసీల్దార్ ఆదేశించారు.
సాలూరు తహసీల్దార్ ఆదేశాలు..
సాలూరు గ్రామీణం: విజయనగరం జిల్లా సాలూరు మండలం శివరాంపురం గ్రామంలోని కొంతమందికి రేషన్, పింఛన్ నిలిపివేయాలని అధికారులను స్థానిక తహసీల్దార్ ఆదేశించారు. గత ఏడాది చివరిలో అధికారుల తప్పిదంతో గ్రామంలోని 247 మంది ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు జమయ్యాయి. అవి తిరిగి వసూలు చేసేందుకు అధికారులు ఈ కఠిన నిర్ణయాన్ని తీసుకున్నారు.
వివరాల్లోకి వెళితే.. 2020 డిసెంబర్లో మండలంలోని కొదమ పంచాయతీలో లబ్ధిదారులకు పడాల్సిన రైతు భరోసా సొమ్ము రూ.13,500 చొప్పున శివరాంపురం గ్రామంలోని కొంతమంది రైతుల ఖాతాల్లో జమ అయింది. దీన్ని గుర్తించిన రెవెన్యూ అధికారులు అప్పుడే దిద్దుబాటు చర్యలు తీసుకున్నారు. ఆ గ్రామానికి వెళ్లి పొరపాటున ఖాతాల్లో సొమ్ము జమ అయిందని.. వెనక్కి తిరిగి ఇవ్వాలని అభ్యర్థించారు. అయితే ఈ 11నెలల్లో మొత్తం 247 మందికి గాను 59 మంది మాత్రమే సొమ్ము వెనక్కి తిరిగిచ్చారు. ఇంకా 188 మంది చెల్లించాల్సి ఉంది. వారి నుంచి సొమ్ము రికవరీ చేసేందుకు ప్రభుత్వం అందిస్తున్న నవరత్నాలు నిలిపివేయాలంటూ తహసీల్దార్ తాజాగా ఆదేశాలు జారీ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!