Ratan Tata: బిజీబిజీగా ఉండే ముంబయిలో..ఇదొక అపురూప దృశ్యం!
వర్షాకాలం చిరుజల్లులు ఆహ్లాదంగానే ఉన్నా.. భారీ వర్షాలు మాత్రం ఇబ్బంది పెడుతుంటాయి. వాటిని దాటుకొని మనం ఎలాగోలా ఇంటికెళ్లిపోతాం.
తమ ఉద్యోగి చూపిన చొరవకు టాటా మెచ్చుకోలు
ముంబయి: వర్షాకాలం చిరుజల్లులు ఆహ్లాదంగానే ఉన్నా.. భారీ వర్షాలు మాత్రం ఇబ్బంది పెడుతుంటాయి. వాటిని దాటుకొని మనం ఎలాగో ఇంటికెళ్లిపోతాం. కానీ, వీధుల్లో ఉండే మూగ జీవాలు మాత్రం వర్షంలో తడిసి ముద్దయిపోతాయి. ఖాళీ భవనాల్లోనో, వాహనాల కిందో.. వాటికి అనువైన దగ్గర చేరతాయి. కొన్నింటికి ఆ అవకాశం కూడా ఉండదు. వాటి గురించి ఆలోచిస్తే.. ఎంతోకొంత మనమూ చేయొచ్చని నిరూపించే చిత్రం ఒకదాన్ని ప్రముఖ వ్యాపారవేత్త రతన్టాటా ఇన్స్టాగ్రాంలో షేర్ చేశారు. తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్కు చెందిన ఉద్యోగి చూపిన చొరవను మెచ్చుకున్నారు.
‘ఈ వర్షాకాలం మన సౌకర్యాల్లో కొంత..వీధి జంతువుల కోసం. భారీ వర్షం పడుతున్న సమయంలో ఈ తాజ్ ఉద్యోగి దయాగుణం చూపారు. తన గొడుకు కింద శునకానికి కొంత చోటిచ్చారు. నిత్యం బిజీగా ఉండే ముంబయి వీధుల్లో ఈ అపురూప దృశ్యం కెమెరా కంటికి చిక్కింది. ఈ మాత్రం చొరవ వీధి జీవాలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది’ అంటూ రతన్ టాటా ఇన్స్టాగ్రాంలో రాసుకొచ్చారు. ఆ వెంటనే ఆ చిత్రం నెట్టింట్లో వైరల్గా మారింది. టాటాతో పాటు నెటిజన్లనూ మెప్పించింది.
వ్యాపార దిగ్గజం రతన్ టాటాకు శునకాలంటే అమిత ప్రేమ. టాటా గ్రూప్ కేంద్ర కార్యాలయం బాంబే హౌస్లో శునకాల కోసం ప్రత్యేకంగా ఒక కెన్నెల్ ఉంది. ఆ ప్రాంతంలోని వీధి కుక్కల బాగోగుల కోసం దాన్ని ఏర్పాటు చేశారు. కాగా, తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్..టాటా గ్రూప్లో భాగమే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీఎం రేవంత్ రెడ్డికి దిల్లీ పోలీసుల సమన్లు
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా వీడియో మార్ఫింగ్ కేసులో సీఎం రేవంత్ రెడ్డికి దిల్లీ పోలీసులు సమన్లు జారీ చేశారు. -
దేవుడు న్యాయం పక్షానే ఉంటాడు: బ్రదర్ అనిల్
దేవుడు ఎవరికీ అన్యాయం చేయడని, న్యాయం పక్షానే ఉంటాడని బ్రదర్ అనిల్ అన్నారు. ఒకరిపై ఒకరు అభాండాలు వేసుకోవడం సరికాదన్నారు. -
శంషాబాద్ ఎయిర్పోర్టు పరిసరాల్లో చిరుత కోసం కొనసాగుతున్న గాలింపు
శంషాబాద్ ఎయిర్పోర్టు పరిసరాల్లో చిరుత ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతోంది. ట్రాప్ కెమెరాలతో పాటు బోన్లను అటవీశాఖ అధికారులు ఏర్పాటు చేశారు. -
దక్షిణ మధ్య రైల్వే పరిధిలో మరిన్ని వేసవి ప్రత్యేక రైళ్లు..
వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే (SCR) మరిన్ని ప్రత్యేక రైళ్లు నడిపేందుకు సిద్ధమైంది. ఏప్రిల్ 27 నుంచి మే నెలాఖరు వరకు ఈ రైళ్లు అందుబాటులో ఉండనున్నాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఇసుక అక్రమ తవ్వకాలు.. ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్రంలో జరుగుతున్న ఇసుక అక్రమ తవ్వకాలపై సర్వోన్నత న్యాయస్థానం మండిపడింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/04/24)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల్లో వాడే ‘సిరా’ చుక్క ఎందుకు చెరిగిపోదు.. ఆసక్తికర విషయాలు
-
వ్యక్తుల ప్రయోజనాల కోసం సుప్రీంకోర్టుకు రాష్ర్ట ప్రభుత్వమా ?
-
సీఎం రేవంత్ రెడ్డికి దిల్లీ పోలీసుల సమన్లు
-
భారీ లాభాల్లో సూచీలు.. సెన్సెక్స్ 900+, నిఫ్టీ 220+
-
దేవుడు న్యాయం పక్షానే ఉంటాడు: బ్రదర్ అనిల్
-
వీధి వ్యాపారిని కలిసిన మోదీ.. ఈ మోహిని గౌడ గురించి తెలుసా?