Stock market: భారీ లాభాల్లో సూచీలు.. సెన్సెక్స్ 900+, నిఫ్టీ 220+
Stock market: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 941 పాయింట్లు, నిఫ్టీ 223 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి.
Stock market | ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. గత వారమంతా దాదాపు లాభాల్లో కొనసాగిన సూచీలకు చివరి ట్రేడింగ్ సెషన్లో నష్టాలు ఎదురయ్యాయి. ఒక్కరోజు విరామం తర్వాత సూచీలు మళ్లీ భారీగా పుంజుకున్నాయి. ప్రపంచ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు, బ్యాంకింగ్ షేర్లలో కొనుగోళ్ల మద్దతుతో దూసుకెళ్లాయి. ఈక్రమంలో సెన్సెక్స్ 900కు పైగా పాయింట్లు లాభపడగా.. నిఫ్టీ 22,600 పాయింట్ల మార్కు ఎగువన ముగిసింది.
సెన్సెక్స్ ఉదయం 73,982.75 లాభాల్లో ప్రారంభమై ఆద్యంతం అదే ఒరవడి కొనసాగింది. ఇంట్రాడేలో 74,721.15 వద్ద గరిష్ఠాన్ని తాకిన సూచీ.. చివరికి 941.12 పాయింట్లు లాభపడి 74,671.28 వద్ద ముగిసింది. నిఫ్టీ 223.45 పాయింట్ల లాభంతో 22,643.40 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 83.48గా ఉంది. సెన్సెక్స్లో హెచ్సీఎల్ టెక్నాలజీ, ఐటీసీ, విప్రో, బజాజ్ ఫిన్సర్వ్ మినహా అన్ని షేర్లూ లాభపడ్డాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 88.90గా ఉంది.
సూచీల జోరుకు కారణమిదే..
- సూచీలు రాణించడంలో ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ ప్రధాన పాత్ర పోషించాయి. మెరుగైన త్రైమాసిక ఫలితాలు ప్రకటించిన నేపథ్యంలో ఐసీఐసీఐ షేర్లు రాణించగా.. ఫలితాల నేపథ్యంలో ఎస్బీఐ షేర్లలో కొనుగోళ్ల మద్దతు లభించింది.
- అంతర్జాతీయ మార్కెట్లు రాణించడమూ దేశీయ స్టాక్మార్కెట్ సూచీల లాభాల పరుగుకు మరో కారణం. ఆసియా మార్కెట్లు దాదాపు లాభాల్లో ముగియగా.. యూరోపియన్ మార్కెట్లు సైతం సోమవారం లాభాల్లో ప్రారంభమయ్యాయి. బుధవారం వెల్లడయ్యే అమెరికా ఫెడరల్ రిజర్వ్ నిర్ణయాలపై మదుపరుల్లో ఆసక్తి నెలకొంది.
- పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు తగ్గడం కూడా మార్కెట్లపై సెంటిమెంట్కు కారణమైంది. ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య ఘర్షణలు తగ్గడం వల్ల అటు క్రూడాయిల్ ధరలు సైతం కొంతమేర క్షీణించాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాజెక్ట్ అస్త్ర.. జీమెయిల్లో జెమినీ.. లెక్కల్లో సాయం.. గూగుల్ కొత్త అప్డేట్స్!
Google I/O: ఏఐ మోడల్ జెమినీని అప్గ్రేడ్ చేయటంతో పాటు వీడియోతో లెన్స్ సెర్చ్, సర్కిల్తో లెక్కల్లో సాయం, జీమెయిల్లో జెమినీ ఫీచర్స్ వంటి కొత్త అప్డేట్లను గూగుల్ తమ వార్షిక సదస్సులో ప్రకటించింది. -
ఎఫ్డీ రేట్లు పెంచిన ఎస్బీఐ.. లేటెస్ట్ వడ్డీ రేట్లు ఇవే..
SBI hikes FD rates: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లను సవరించింది. కొత్త వడ్డీ రేట్లు మే 15 నుంచి అమల్లోకి వచ్చాయి. -
గో డిజిట్ ఐపీఓ ప్రారంభం.. పూర్తి వివరాలివే..
Go Digit IPO: రూ.2,615 కోట్ల సమీకరణ లక్ష్యంతో గో డిజిట్ ఐపీఓకి వచ్చింది. మదుపర్లు రూ.14,960తో కనీసం 55 షేర్లకు బిడ్లు దాఖలు చేయాల్సి ఉంటుంది. -
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,250 ఎగువన నిఫ్టీ
Stock Market Opening bell: ఉదయం 9:22 గంటల సమయంలో సెన్సెక్స్ 97 పాయింట్లు పుంజుకొని 73,202 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 45 పాయింట్లు ఎగబాకి 22,262 దగ్గర కొనసాగుతోంది. -
ఆంధ్రప్రదేశ్లో బంగారం ఉత్పత్తి ఈ ఏడాదిలోనే
ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలోని జొన్నగిరి బంగారం గనిలో ఈ సంవత్సరాంతానికి బంగారం ఉత్పత్తి మొదలు కానున్నట్లు తెలుస్తోంది. -
2023-24లో పీఎస్బీల లాభం రూ.1,41,203 కోట్లు
దేశంలోని 12 ప్రభుత్వ రంగ బ్యాంకులన్నీ (పీఎస్బీ) కలిపి గత ఆర్థిక సంవత్సరం (2023-24)లో రూ.1,41,203 కోట్ల నికరలాభాన్ని ఆర్జించాయి. -
వాహన, లోహ షేర్లకు కొనుగోళ్లు
వరుసగా మూడో రోజూ సూచీల లాభాలు కొనసాగాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు రాణించడం, సానుకూల ద్రవ్యోల్బణ గణాంకాలు ఇందుకు మద్దతుగా నిలిచాయి. -
భారతీ ఎయిర్టెల్ లాభంలో 31% క్షీణత
భారతీ ఎయిర్టెల్ జనవరి- మార్చి త్రైమాసికంలో రూ.2,072 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ప్రకటించింది. 2022-23 ఇదే కాల లాభం రూ.3,005.60 కోట్లతో పోలిస్తే, ఇది 31% తక్కువ. -
13 నెలల గరిష్ఠానికి టోకు ద్రవ్యోల్బణం
ఈ ఏడాది ఏప్రిల్లో టోకు ద్రవ్యోల్బణం 13 నెలల గరిష్ఠమైన 1.26 శాతానికి చేరింది. ఆహార వస్తువులు.. ముఖ్యంగా కూరగాయల ధరలు పెరగడమే ఇందుకు కారణం. -
వార్షిక ఖర్చులో 6-7% సాంకేతికపైనే
దేశంలోని అతిపెద్ద ప్రైవేటు బ్యాంక్ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఏటా తన వార్షిక నిర్వహణ ఖర్చులో 6-7% సాంకేతికత సంబంధిత అంశాలపైనే ఖర్చు చేస్తోంది. -
భారత్లో లీప్ మోటార్ ఈవీల తయారీ
చైనాకు చెందిన తన భాగస్వామ్య సంస్థ లీప్మోటర్ విద్యుత్ వాహనాలను భారత్లో తయారు చేసి, విక్రయించేందుకు భారత్లోని తన తయారీ కేంద్రాన్ని అంతర్జాతీయ దిగ్గజ సంస్థ స్టెల్లాంటిస్ ఉపయోగించుకోనుంది. -
ఎఫ్అండ్ఓ పై పర్యవేక్షణ పెరగాలి
అధిక నష్టభయం ఉండే ఫ్యూచర్లు, ఆప్షన్ల (ఎఫ్ అండ్ ఓ) విభాగంపై పర్యవేక్షణ లేమి వల,్ల వాటిల్లో ట్రేడ్ చేసే చిన్న మదుపర్ల కుటుంబాలకు ఆర్థిక సమస్యలు వచ్చే ప్రమాదముందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. -
టీవీఎస్ ఐక్యూబ్లో కొత్త వేరియంట్లు
టీవీఎస్ మోటార్ తన విద్యుత్తు స్కూటర్ టీవీఎస్ ఐక్యూబ్లో కొత్త వేరియంట్లను విడుదల చేసింది. వీటి ప్రారంభ ధర రూ.94,999 (ఎక్స్ షోరూం). -
హైదరాబాద్లో ఆఫీసు స్థలాన్ని అద్దెకు తీసుకున్న టేబుల్ స్పేస్
కార్యాలయ స్థలానికి కార్పొరేట్ సంస్థల నుంచి గిరాకీ పెరుగుతున్న నేపథ్యంలో, దేశంలోని 4 ప్రధాన నగరాల్లో 13.5 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని లీజుకు తీసుకున్నట్లు టేబుల్ స్పేస్ వెల్లడించింది. -
సంక్షిప్త వార్తలు
ప్రాంతీయ మార్గాల్లో సేవలను విస్తరించే లక్ష్యంతో కనీసం 100 చిన్న విమానాలు కొనుగోలు చేయాలని ఇండిగో భావిస్తోంది. ఇందుకోసం 3 విమాన తయారీ సంస్థలు ఏటీఆర్, ఎంబ్రాయిర్, ఎయిర్బస్లతో చర్చలు జరుపుతున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
తాజా వార్తలు (Latest News)
-
400 సీట్లు గెలిస్తే.. భారత్లో పీవోకే విలీనం ఖాయం: హిమంత బిశ్వశర్మ
-
తుపాకీతో కాల్చుకొని.. సచిన్ సెక్యూరిటీగార్డు ఆత్మహత్య..!
-
ప్రాజెక్ట్ అస్త్ర.. జీమెయిల్లో జెమినీ.. లెక్కల్లో సాయం.. గూగుల్ కొత్త అప్డేట్స్!
-
చెట్టును ఢీకొన్న కారు.. మంటలు చెలరేగి వృద్ధ దంపతులు మృతి
-
‘ఒక్కటి’ దక్కాలంటే.. రాజస్థాన్ ‘రెండు’ గెలవాల్సిందే!
-
నేను బెంగళూరుపై ఆడుంటే.. ఈ పాటికే ప్లేఆఫ్స్కు చేరేవాళ్లమేమో!: పంత్