Theft: మంత్రుల పర్యటనలో జేబు దొంగల చేతివాటం.. రూ.లక్ష వరకు కొట్టేశారు!

యాదాద్రి భువనగిరి జిల్లాలో శనివారం జరిగిన రాష్ట్ర మంత్రుల పర్యటనలో జేబు దొంగలు చేతివాటం ప్రదర్శించారు.

Updated : 29 Aug 2021 14:03 IST

భువనగిరి: యాదాద్రి భువనగిరి జిల్లాలో శనివారం జరిగిన రాష్ట్ర మంత్రుల పర్యటనలో జేబు దొంగలు చేతివాటం ప్రదర్శించారు. మంత్రుల వెంట ఉన్న నేతల మధ్యలో దూరి సుమారు రూ.లక్ష వరకు కాజేశారు. మోత్కూరులో జరిగిన మార్కెట్‌ కమిటీ పాలకవర్గ ప్రమాణస్వీకార కార్యక్రమానికి మంత్రులు నిరంజన్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి హాజరయ్యారు.

మంత్రులు పట్టణానికి చేరుకోగానే వాహనం చుట్టూ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరారు. వీరిలో దూరిన దొంగలు.. మోత్కూరు జడ్పీటీసీ భర్త గోరుపల్లి సంతోష్‌రెడ్డి జేబు నుంచి డబ్బు కాజేశారు. కార్యక్రమం అనంతరం తన జేబులో ఉన్న రూ.40వేలు పోయినట్లు గుర్తించిన సంతోష్‌రెడ్డి.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. మోత్కూరు, శౌలిగారారంలో జేబు దొంగలు చేతివాటం ప్రదర్శించినట్లు స్థానిక నేతలు గుర్తించారు. రెండు కార్యక్రమాల్లో సుమారు రూ.లక్ష వరకు కాజేసినట్లు చెబుతున్నారు. మోత్కూరులో మంత్రుల పర్యటనను చిత్రీకరిస్తున్న ఈటీవీ కెమెరాకు జేబు దొంగతనాల దృశ్యాలు చిక్కాయి.  


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని