Viveka Murder Case: కొందరు నన్ను భయపెడుతున్నారు: వివేకా పీఏ కృష్ణారెడ్డి

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో కొందరు తనను భయపెడుతున్నారంటూ ఆయన పీఏ కృష్ణారెడ్డి కోర్టును ఆశ్రయించారు.

Updated : 28 Dec 2021 17:45 IST

కడప: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో కొందరు తనను భయపెడుతున్నారంటూ ఆయన పీఏ కృష్ణారెడ్డి కోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు పులివెందుల కోర్టులో ఆయన తరఫు న్యాయవాది లోకేశ్వర్‌రెడ్డి పిటిషన్‌ దాఖలు చేశారు. సీబీఐ అధికారులు కొందరి పేర్లు చెప్పాలని ఒత్తిడి చేస్తున్నట్లు పిటిషన్‌లో కృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఈ విషయంలో న్యాయం చేయాలని గతంలోనే పోలీసులకు, కడప జిల్లా ఎస్పీకి విన్నవించానన్నారు. న్యాయం జరగకపోవడంతోనే పులివెందుల కోర్టును ఆశ్రయించినట్లు పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని