Ycp leader Warning: పనులు ఆపేస్తారా.. దాడి చేయమంటారా?: గుత్తేదారుకు వైకాపా నేత వార్నింగ్‌

అనంతపురం జిల్లా రాయదుర్గంలో వైకాపా నేత వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

Published : 06 Sep 2021 01:15 IST

రాయదుర్గం: అనంతపురం జిల్లా రాయదుర్గంలో వైకాపా నేత వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.  రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి సన్నిహితుడు, వైకాపా నేత జయరామరెడ్డి గుత్తేదారుపై బెదిరింపులకు దిగారు. రాయదుర్గం-కనేకల్‌ రహదారి పనులు నిలిపివేయాలని హెచ్చరించారు.

ఎమ్మెల్యే రామచంద్రారెడ్డిని కలవకుండా పనులెలా చేస్తారని గుత్తేదారుపై మాటలతో దాడికి దిగారు. పనులు ఆపకపోతే భౌతిక దాడులు తప్పవని హెచ్చరించారు. రాయదుర్గం నియోజకవర్గంలోని కనేకల్‌ మండలం నల్లంపల్లి గ్రామం నుంచి 14 కిలోమీటర్ల మేర రహదారి నిర్మాణ పనులకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. నిర్మాణ పనులకు రూ.17 కోట్లు మంజూరయ్యాయి. డీఎంసీ సంస్థ కాంట్రాక్టును సొంతం చేసుకుని పనులు చేపట్టింది. అయితే, స్థానిక ఎమ్మెల్యేను అడగకుండా పనులు చేపట్టడమేంటని వైకాపా నేత జయరామిరెడ్డి గుత్తేదారుపై బెదిరింపులకు దిగారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని