AP High court: విశాఖకు కార్యాలయాల తరలింపు.. ప్రభుత్వ లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ తిరస్కరణ

విశాఖకు కార్యాలయాల తరలింపునకు సంబంధించి ప్రభుత్వం దాఖలు చేసిన లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ను రాష్ట్ర హైకోర్టు తిరస్కరించింది.

Updated : 28 Dec 2023 12:09 IST

అమరావతి: విశాఖకు కార్యాలయాల తరలింపునకు సంబంధించి ప్రభుత్వం దాఖలు చేసిన లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ను రాష్ట్ర హైకోర్టు తిరస్కరించింది. ఈ అంశంపై మంగళవారం విచారణ జరుపుతామని తెలిపింది. సీఎం క్యాంపు కార్యాలయం ముసుగులో ప్రభుత్వ కార్యాలయాలను అమరావతి నుంచి విశాఖకు తరలిస్తున్నారని రాజధాని రైతులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలను త్రిసభ్య ధర్మాసనం ముందుకు పంపుతూ ఇటీవల హైకోర్టు సింగిల్‌ జడ్జి ఆదేశాలిచ్చారు. త్రిసభ్య ధర్మాసనం తగిన ఉత్తర్వులు ఇచ్చేంత వరకు కార్యాలయాల తరలింపునకు చర్యలు తీసుకోబోమని ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. అయితే, కార్యాలయాల తరలింపు అంశంపై అత్యవసరంగా విచారణ చేపట్టాలని ప్రభుత్వం గురువారం లంచ్‌మోషన్‌ పిటిషన్‌ వేసింది. దీనిని తిరస్కరించిన న్యాయస్థానం.. మంగళవారం విచారణ జరుపుతామని తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు