Tokyo Olympics: పసిడి పతకం తెస్తే ₹3 కోట్లు!
టోక్యో ఒలింపిక్స్లో పతకాల పంట పండించే క్రీడాకారులకు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ బంపర్ ఆఫర్ ప్రకటించారు. బంగారు పతకం సాధించిన విజేతలకు రూ.3 కోట్లు నగదు బహుమతి
చెన్నై: టోక్యో ఒలింపిక్స్లో పతకాల పంట పండించే క్రీడాకారులకు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ బంపర్ ఆఫర్ ప్రకటించారు. బంగారు పతకం సాధించిన విజేతలకు రూ.3 కోట్లు నగదు బహుమతి ఇవ్వనున్నట్లు శనివారం వెల్లడించారు. రజతం సాధించిన క్రీడాకారులకు రూ.2 కోట్లు, కాంస్య పతకం సాధించినవారికి రూ.కోటి ఇస్తామని పేర్కొన్నారు. ఇప్పటివరకు తమిళనాడు నుంచి ఒలింపిక్ పతకాలు సాధించినవారి జాబితాలో చెన్నైకి చెందిన గగన్ నారంగ్ మాత్రమే ఉన్నారు. ఆయన 2012 లండన్ ఒలింపిక్స్లో.. షూటింగ్ విభాగంలో భారత్కు ప్రాతినిధ్యం వహించారు. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో గగన్ కాంస్య పతకాన్ని సాధించారు.
ఇంతకుముందు హరియాణా ముఖ్యమంత్రి మనోహర్లాల్ ఖట్టర్ కూడా ఒలింపిక్ క్రీడాకారులకు ఇదే తరహాలో నగదు బహుమతులు ప్రకటించారు. అంతర్జాతీయ వేదికలపై విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు ప్రభుత్వ ఉద్యోగాలు సైతం ఇచ్చేందుకు నిర్ణయించారు. తద్వారా కొత్త ఆటగాళ్లకు ప్రోత్సాహం లభిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. భారత్ అత్యుత్తమ ప్రదర్శన చేసిన వేదికల్లో 2012 లండన్ ఒలింపిక్స్ ప్రధానమైంది. అందులో భారత అథ్లెట్లు ఆరు పతకాలు సాధించి సత్తా చాటారు. ఇప్పటివరకు 14 క్రీడా విభాగాల్లో 102 మంది భారతీయ అథ్లెట్లు టోక్యో ఒలింపిక్స్కు అర్హత సాధించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!