Hyderabad: గణేశ్ నిమజ్జనం.. హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు ఇలా!
హైదరాబాద్లో గణేశ్ నిమజ్జనోత్సవానికి సర్వం సిద్ధమైంది. ఏకదంతుడి శోభాయాత్రలకు విఘ్నాలు తలెత్తకుండా ట్రాఫిక్ పోలీసు యంత్రాంగం చర్యలు చేపట్టింది.
హైదరాబాద్: నగరంలో గణేశ్ నిమజ్జనోత్సవానికి సర్వం సిద్ధమైంది. ఏకదంతుడి శోభాయాత్రలకు విఘ్నాలు తలెత్తకుండా ట్రాఫిక్ పోలీసు యంత్రాంగం చర్యలు చేపట్టింది. శోభాయాత్రలు సాగే దారుల్లో సాధారణ వాహనాల రాకపోకలకపై ఆంక్షలు విధించారు. గురువారం ఉదయం 6 గంటల నుంచి శుక్రవారం ఉదయం 10 గంటల వరకూ ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసులు తెలిపారు.
- బాలాపూర్ నుంచి నుంచి ఎన్టీఆర్ మార్గ్ వరకు సాగే ప్రధాన శోభాయాత్రతో పాటు.. ఊరేగింపు జరిగే రహదారుల్లో సాధారణ ప్రజల వాహనాల రాకపోకలకు అనుమతి ఉండదు.
- ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి వచ్చే లారీలకు శనివారం రాత్రి వరకు నగరంలోకి అనుమతి ఉండదు.
- ప్రైవేటు బస్సు ఆపరేటర్లు ఓఆర్ఆర్తో పాటు ఇతర మార్గాల ద్వారా వెళ్లాలని ట్రాఫిక్ అధికారులు స్పష్టం చేశారు.
- హైదరాబాద్ పాతబస్తీలో కేశవగిరి, మహబూబ్ నగర్ చౌరస్తా, ఇంజిన్ బౌలి, నాగుల్ చింత, హిమ్మత్పురా, హరిబౌలి, అస్రా హాస్పిటల్, మొఘల్ పురా, మదీనా చౌరస్తా, ఎంజే బ్రిడ్జి, దారుల్ షిఫా చౌరస్తా, సిటీ కాలేజి వద్ద వాహనాల మళ్లింపు ఉంటుంది.
- చంచల్ గూడ జైలు చౌరస్తా, మూసారంబాగ్, చాదర్ ఘాట్ బ్రిడ్జి, సాలార్జంగ్ బ్రిడ్జి, అఫ్జల్ గంజ్, పుత్లీబౌలి చౌరస్తా, ట్రూప్ బజార్, జామ్ బాగ్ క్రాస్ రోడ్స్, కోఠి ఆంధ్రాబ్యాంకు వద్ద వాహనాలను దారి మళ్లిస్తారు.
- మధ్యమండలంలో చాపెల్ రోడ్డు ప్రవేశం, జీపీవో వద్ద గద్వాల్ సెంటర్, షాలిమార్ థియేటర్, గన్ ఫౌండ్రి, స్కైలైన్ రోడ్డు ప్రవేశం, దోమల్ గూడలోని భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ కూడలి, బూర్గుల రామకృష్ణా రావు భవన్, ఇక్బాల్ మినార్, రవీంద్ర భారతి, ద్వారకా హోటల్, ఖైరతాబాద్ చౌరస్తా, చిల్డ్రన్స్ పార్క్, వైస్రాయ్ జంక్షన్, కవాడిగూడ కూడలి, ముషీరాబాద్ చౌరస్తా, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, లోయర్ ట్యాంక్ బండ్ కట్ట మైసమ్మ దేవాలయం, ఇందిరాపార్క్ జంక్షన్ వద్ద వాహనాల మళ్లింపు ఉంటుందని పోలీసులు తెలిపారు.
- పశ్చిమ మండలం పరిధిలో టోప్ ఖానా మసీదు, అలస్కా హోటల్ కూడలి, ఉస్మాన్ గంజ్, శంకర్ బాగ్, సీనా హోటల్, ఎగ్జిబిషన్ మైదానం సమీపంలోని అజంతా గేట్, ఆబ్కారీ లేన్, తాజ్ ఐలాండ్, ఏఆర్ పెట్రోల్ పంపు వద్ద వాహనాలు మళ్లిస్తారు.
- ఉత్తర మండలం పరిధిలో కర్బలా మైదానం, బుద్ధ భవన్, సెయిలింగ్ క్లబ్, నల్లగుట్ట కూడలి వైపు నుంచి నెక్లెస్ రోడ్డు, అప్పర్ ట్యాంక్ బండ్పైకి ట్రాఫిక్ను అనుమతించరు. సికింద్రాబాద్లో సీటీవో, వైఎంసీఏ, ప్యారడైజ్ చౌరస్తా, ప్యాట్నీ చౌరస్తా, బాటా, ఘాన్స్ మండీ వద్ద వాహనాలను మళ్లించనున్నారు.
నిమజ్జనం చేశాక ఇలా వెళ్లాలి..
ఎన్టీఆర్ మార్గ్లో వినాయకుడిని నిమజ్జనం చేసిన తర్వాత నిర్వాహకులు ఖాళీ వాహనాలను నెక్లెస్ రోటరీ, ఖైరతాబాద్ ఫ్లైఓవర్, కేసీపీ మీదుగా తీసుకెళ్లాలని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. అప్పర్ ట్యాంక్ బండ్పై నిమజ్జనం చేసిన వారు వాహనాలను చిల్డ్రన్స్ పార్క్, డీబీఆర్ మిల్స్, కవాడిగూడ, ముషీరాబాద్ మీదుగా వెళ్లాలి. బైబిల్ హౌజ్ రైల్ ఓవర్ బ్రిడ్డి మీదుగా లారీలను అనుమతించబడవు.
సందర్శకుల పార్కింగ్ ఇలా..
ట్యాంక్బండ్లో నిమజ్జనోత్సవం తిలకించేందుకు వెళ్లే ప్రజల వాహనాలు నిలిపేందుకు ప్రత్యేక కేంద్రాలు సిద్ధం చేశారు. సాగర్ చుట్టూ ఉండే ప్రత్యేక పార్కింగ్ కేంద్రాల్లోనే తమ వాహనాలను నిలపాలని పోలీసులు సూచించారు. ఖైరతాబాద్ చౌరస్తాలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్, ఖైరతాబాద్ ఎంఎంటీఎస్ స్టేషన్, ఆనంద్ నగర్ కాలనీ నుంచి రంగారెడ్డి జిల్లా జెడ్పీ కార్యాలయం దారి, బుద్ధ భవన్ వెనక వైపు, గోసేవా సదన్, లోయర్ ట్యాంక్ బండ్, కట్ట మైసమ్మ దేవాలయం, ఎన్టీఆర్ స్టేడియం, నిజాం కాలేజీ, పబ్లిక్ గార్డెన్స్లో పార్కింగ్ కేంద్రాలు ఉంటాయని తెలిపారు.
ఆర్టీసీ బస్సులకు సైతం ట్రాఫిక్ ఆంక్షలు
ఆర్టీసీ బస్సులకు సైతం ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసులు తెలిపారు. నిమజ్జనం రద్దీని బట్టి బస్సుల రాకపోకలపై నియంత్రణ ఉంటుందన్నారు. హుస్సేన్ సాగర్కు కొద్ది దూరంలోనే సిటీ బస్సులను నిలిపివేస్తామన్నారు. అక్కడి నుంచి ప్రజలు నడుచుకుంటూ వెళ్లాల్సి ఉంటుందని తెలిపారు. మెహిదీపట్నం బస్సులను మాసాబ్ ట్యాంక్, కూకట్ పల్లి బస్సులు ఖైరతాబాద్ చౌరస్తా, సికింద్రాబాద్ బస్సులు సీటీవో, ప్లాజా, ఎస్ బీహెచ్, క్లాక్ టవర్, చిలకలగూడ చౌరస్తా, ఉప్పల్ బస్సులు రామంతాపూర్ టీవీ స్టూడియో, దిల్ సుఖ్ నగర్ బస్సులు గడ్డి అన్నారం, చాదర్ ఘాట్, రాజేంద్రనగర్ బస్సులు దానమ్మ హట్స్, మిదాని బస్సులు ఐఎస్ సదన్, అంతర్ నగర బస్సులు నారాయణ గూడ వైఎంసీఏ వద్ద నిలిపివేయనున్నట్లు తెలిపారు.
జిల్లాల బస్సుల మళ్లింపు ఇలా..
జిల్లాల నుంచి ఎంజీబీఎస్కు వెళ్లే ఆర్టీసీ బస్సులను సైతం వివిధ ప్రాంతాలకు మళ్లించనున్నారు. రాజీవ్ రహదారి, ఎన్హెచ్ 7 వైపు నుంచి వచ్చే వాహనాలు జేబీఎస్, వైఎంసీఏ, సంగీత్ చౌరస్తా, తార్నాక, జామై ఉస్మానియా ఫ్లైఓవర్, నింబోలి అడ్డా, చాదర్ ఘాట్ మీదుగా వెళ్లాలని సూచించారు. బెంగళూరు రహదారిపై వచ్చే వాహనాలు ఆరాంఘర్ చౌరస్తా, చంద్రాయణగుట్ట చౌరస్తా, ఐఎస్ సదన్, నల్గొండ క్రాస్ రోడ్స్, చాదర్ ఘాట్ మీదుగా మళ్లించనున్నారు. ముంబయి జాతీయ రహదారి వైపు నుంచి వచ్చే వాహనాలను.. గోద్రెజ్ కూడలి, నర్సాపూర్ చౌరస్తా, బోయిన్ పల్లి, జేబీఎస్, వైఎంసీఏ, సంగీత్, తార్నాక, జామై ఉస్మానియా ఫ్లైఓవర్, అడిక్ మెట్, నింబోలి అడ్డా మీదుగా వెళ్తాయని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
యంగ్గా కనిపించడం కోసం అలాంటి పనులు చేయను: ఆమిర్ ఖాన్
-
బీఎస్ఎన్ఎల్లో బ్రాడ్బ్యాండ్ ఇన్స్టలేషన్ ఛార్జీలు ఉండవ్
-
ఆర్సీబీకి ఇదేం శాపమో..? ఆ జట్టులోకొస్తే వైఫల్యం.. వేరే జట్లలో అదరహో!
-
రష్యా క్షిపణి దాడిలో ‘హ్యారీపోటర్ కోట’ ధ్వంసం..!
-
శ్రామికులే అభివృద్ధిలో అసలైన భాగస్వాములు: సీఎం రేవంత్రెడ్డి
-
ఎస్వీ రంగారావును ఎంపిక చేశారు.. చివరకు బాలయ్యే నటించారు!