Hyderabad: జీహెచ్‌ఎంసీలో 26 మంది డిప్యూటీ కమిషనర్లు బదిలీ

గ్రేటర్‌ హైదరాబాద్‌ మహానగర పాలక సంస్థలో భారీగా డిప్యూటీ కమిషనర్లు బదిలీ అయ్యారు.

Published : 18 Jul 2023 17:05 IST

హైదరాబాద్‌: గ్రేటర్‌ హైదరాబాద్‌ మహానగర పాలక సంస్థలో భారీగా డిప్యూటీ కమిషనర్లు బదిలీ అయ్యారు. మొత్తం 26 మంది డిప్యూటీ కమిషనర్లను బదిలీ చేస్తూ జీహెచ్‌ కమిషనర్‌ రోనాల్డ్‌ రోస్‌ ఉత్తర్వులు జారీ చేశారు. సాధారణ ఎన్నికల నేపథ్యంలో ఇటీవల కమిషనర్‌, జోనల్‌ కమిషనర్లను ప్రభుత్వం బదిలీ చేసింది. కింది స్థాయిలో పనిచేస్తున్న డీసీలను కూడా బదిలీ చేసింది.  గ్రేటర్‌ హైదరాబాద్‌లో మొత్తం 30 మంది డిప్యూటీ కమిషనర్లు ఉండగా.. వారిలో 26 మందిని బదిలీ చేశారు. గతంలో నలుగురు డిప్యూటీ కమిషనర్లను బదిలీ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని