అనుమానం వచ్చిందంటే.. ఖాతా రద్దే
అడ్డగోలుగా చెలరేగిపోతున్న సైబర్ నేరగాళ్లకు ముకుతాడు వేయడంపై భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) దృష్టి పెట్టింది. అనుమానాస్పద ఖాతాలను వెంటనే స్తంభింపజేయాలంటూ అన్ని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది.
సైబర్ నేరాల నియంత్రణకు ఆర్బీఐ చర్యలు
మూణ్నెల్లలోనే 2.5 లక్షల బ్యాంకు ఎకౌంట్ల మూసివేత
ఇతరులు వినియోగించుకునేందుకు అనుమతి ఇస్తే చిక్కులు తప్పవంటున్న దర్యాప్తు సంస్థలు
ఈనాడు - హైదరాబాద్
అడ్డగోలుగా చెలరేగిపోతున్న సైబర్ నేరగాళ్లకు ముకుతాడు వేయడంపై భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) దృష్టి పెట్టింది. అనుమానాస్పద ఖాతాలను వెంటనే స్తంభింపజేయాలంటూ అన్ని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. దాంతో దేశవ్యాప్తంగా ఉన్న అన్ని బ్యాంకుల్లో ఈ తరహా ఖాతాల రద్దు ప్రక్రియ వేగంగా జరుగుతోంది. మూడు నెలల కాలంలోనే దాదాపు 2.5 లక్షల ఖాతాలు రద్దయ్యాయి.
ఎక్కడో ఉండి..ఇక్కడి ఖాతాలకు..
దేశవ్యాప్తంగా సైబర్ నేరాలు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతున్నాయి. నేరగాళ్లు కొత్తకొత్త పద్ధతుల్లో ప్రజలను బురిడీ కొట్టించి రూ.కోట్లు కాజేస్తున్నారు. ఒక్క తెలంగాణలోనే సైబర్ నేరాల వల్ల గత ఆర్థిక సంవత్సరంలో బాధితులు రూ.2 వేల కోట్లు పోగొట్టుకున్నారు. దేశవ్యాప్తంగా లెక్కలేస్తే ఈ మొత్తం రూ.15-20 వేల కోట్లకు పైగానే ఉంటుందని అంచనా. ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల నుంచి మోసాలకు పాల్పడుతున్న నేరగాళ్లు కొల్లగొట్టిన సొమ్మును మళ్లించుకునేందుకు అమాయకుల బ్యాంకు ఖాతాలను వినియోగించుకుంటున్నారు. నిరుద్యోగులు, చిరు వ్యాపారులు, రైతు కూలీలకు కమీషన్ ఆశ చూపి..వారి ఖాతాల వివరాలు తీసుకుంటున్నారు. వారితో ఖాతాలు తెరిపించేందుకు స్థానికంగా ఏజెంట్లనూ నియమించుకుంటున్నారు. కొల్లగొట్టిన డబ్బును తొలుత వీరి ఖాతాల్లోకి, అక్కడ నుంచి మరికొన్ని ఖాతాల్లోకి మళ్లించి..తర్వాత ఈ సొమ్మును క్రిప్టోగా మార్చి విదేశాలకు తరలిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్కు చెందిన ఒక వ్యక్తి నుంచి కొల్లగొట్టిన రూ.94 లక్షలను తొలుత కేరళలోని ఒక ఖాతాకు, అక్కణ్నుంచి కశ్మీర్ సహా దేశవ్యాప్తంగా ఉన్న అనేక ఖాతాల్లోకి మళ్లించినట్టు దర్యాప్తు అధికారులు గుర్తించారు.
కట్టడికి కఠిన చర్యలు
దేశవ్యాప్తంగా సైబర్ నేరాలు వ్యవస్థీకృతమయ్యాయి. కొందరు విదేశాల నుంచీ కార్యకలాపాలు సాగిస్తుండటంతో వారిని పట్టుకోవడం, నేరాలు జరగకుండా అడ్డుకోవడం దర్యాప్తు సంస్థలకు సాధ్యం కావడం లేదు. ఈ నేపథ్యంలో నేరగాళ్లకు ఆయువు పట్టులాంటి బ్యాంకు ఖాతాల ఆటకట్టించాలని దర్యాప్తు సంస్థలు నిర్ణయించారు. దర్యాప్తు సంస్థలు ఇచ్చిన సూచనల ఆధారంగా ఆర్బీఐ అనుమానాస్పద ఖాతాల రద్దుకు బ్యాంకులకు మార్గదర్శకాలు జారీ చేసింది. ఆ ప్రకారం..పెద్దగా లావాదేవీలు జరగని ఖాతాల్లోకి ఒకేసారి పెద్దమొత్తంలో డబ్బు జమకావడం, ఆ వెంటనే ఆ డబ్బు వేరే ఖాతాలోకి మళ్లడం వంటివి జరిగినప్పుడు దాన్ని అనుమానాస్పద ఖాతాగా పరిగణిస్తారు. సదరు ఖాతాదారుడిని పిలిచి విచారిస్తారు. అంత సొమ్ము ఖాతాల్లోకి ఎలా వచ్చింది? ఎవరు పంపారు? అక్కణ్నుంచి మరో ఖాతాలోకి ఎలా వెళ్లిందనే వివరాలు ఆరా తీస్తారు. సరైన సమాధానం లభించకపోతే.. అనుమానాస్పద ఖాతాగానే పరిగణించి రద్దు చేస్తారు. క్రిమినల్ కేసులూ నమోదుచేస్తారు. ఇలా ఈ ఏడాది మొదటి మూడు నెలల్లో దేశవ్యాప్తంగా ఇలా 2.5 లక్షల బ్యాంకు ఖాతాలు రద్దయ్యాయి. ‘ఈ ప్రయోగం సత్ఫలితాన్నిస్తోంది. తెలిసి చేసినా..తెలియక చేసినా.. తమ ఖాతాను వేరే వాళ్లు వాడుకోవడానికి అనుమతిస్తే చిక్కులు తప్పవనే విషయం సామాన్య ఖాతాదారులకు కూడా తెలిసివస్తుంది. దీనివల్ల సైబర్ నేరగాళ్ల ముందరి కాళ్లకు బంధాలు వేసినట్లవుతుందని’ అధికారులు చెబుతున్నారు. దీంతోపాటు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు అనుమానాస్పద సిమ్కార్డులు రద్దు చేయిస్తున్నారు. నేరాలకు ఉపయోగించినట్లు అనుమానిస్తున్న 33,029 సిమ్కార్డులు, ఐఎంఈఐ నంబర్ ఆధారంగా 3,769 మొబైల్ ఫోన్లను స్తంభింపజేశారు.
ఆశపడితే నేరస్థులవుతారు
సైబర్ నేరగాళ్లు తాము చేసే నేరాల ద్వారా కొల్లగొట్టే నగదు లావాదేవీల కోసం ఇతరుల బ్యాంకు ఖాతాలను వినియోగించడం ఇటీవల ఎక్కువైంది. నేరానికి ఉపయోగిస్తారని తెలిసినా కొందరు సులభంగా డబ్బు సంపాదించవచ్చనే ఆలోచనతో వివరాలు ఇస్తున్నారు. అలా వచ్చే వారూ నేరస్థులే అవుతారు. నేరాలు చేసే వారికి సిమ్కార్డులు ఇచ్చినా నేరస్థులుగానే పరిగణిస్తాం.
కొత్తపల్లి నరసింహ, డీసీపీ, సైబరాబాద్ సైబర్క్రైమ్స్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టీజీ 09 9999.. రూ.25.50 లక్షలు
రాష్ట్రంలోనే తొలిసారిగా ఒక వాహన ఫ్యాన్సీ నంబరుకు ఏకంగా రూ.25.50 లక్షల రాబడి వచ్చింది. ఖైరతాబాద్లోని రవాణా కార్యాలయంలో సోమవారం కొత్త సిరీస్ ప్రారంభమైన సందర్భంగా ఆన్లైన్ వేలం నిర్వహించారు. -
మాటలు రాని పిల్లల కోసం ‘అమ్మ’ యాప్
ఎంజీఎం ఆసుపత్రి, న్యూస్టుడే: మాటలు సరిగా రాని పిల్లల కోసం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ) వరంగల్ విద్యార్థులు ‘అమ్మ’ పేరిట యాప్ ఆవిష్కరించారు. -
8న చేప ప్రసాదం పంపిణీ
మృగశిర కార్తె సందర్భంగా బత్తిని సోదరులు జూన్ 8న ఉదయం 11 గంటలకు హైదరాబాద్లోని ఎగ్జిబిషన్ మైదానంలో చేప ప్రసాదం పంపిణీ చేయనున్నారు. సోమవారం సోమాజిగూడలోని ప్రెస్క్లబ్లో బత్తిని అమర్నాథ్గౌడ్ మాట్లాడుతూ.. 24 గంటల పాటు పంపిణీ ఉంటుందని తెలిపారు. -
తడిసిన ప్రతి గింజనూ కొంటాం
వర్షానికి తడిసిన, మొలకెత్తిన ప్రతి వడ్ల గింజనూ కనీస మద్దతు ధరకు ఒక్క రూపాయి కూడా తగ్గకుండా కొనుగోలు చేయాలని రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది. వానాకాలం పంట నుంచి సన్నరకం ధాన్యానికి క్వింటాలుకు రూ.500 బోనస్ ఇవ్వాలని తీర్మానించింది. -
మళ్లీ ఊపందుకున్న ఫోన్ ట్యాపింగ్ కేసు
ఎన్నికల నేపథ్యంలో స్తబ్దుగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు మళ్లీ ఊపందుకుంది. ఇప్పటి వరకు ఈ కేసులో నలుగురు పోలీసు అధికారులు ప్రణీత్రావు, రాధాకిషన్రావు, భుజంగరావు, తిరుపతన్నలు అరెస్టు కాగా.. ప్రధాన నిందితులుగా ఉన్న ఎస్ఐబీ మాజీ ఓఎస్డీ ప్రభాకర్రావు, శ్రవణ్రావు అమెరికాలోని వేర్వేరు ప్రాంతాల్లో ఉన్నట్లు గుర్తించారు. -
బోనస్తో రూ.2 వేల కోట్ల భారం
వచ్చే పంట సీజన్ నుంచి సన్న వడ్లను రూ.500 బోనస్ ఇచ్చి కొంటే.. ఒక్కో సీజన్కు రూ.2 వేల కోట్ల వరకూ ప్రభుత్వంపై భారం పడనుందని రాష్ట్ర మంత్రిమండలి అంచనా వేసింది. -
తాత్కాలిక మరమ్మతులు ప్రారంభం
మేడిగడ్డతోపాటు అన్నారం, సుందిళ్ల బ్యారేజీల తాత్కాలిక మరమ్మతులు ప్రారంభమయ్యాయి. ఒప్పందం ప్రకారం నడుచుకోని నిర్మాణ సంస్థపైన, బాధ్యులైన ఇంజినీర్లపైన కఠినంగా వ్యవహరిస్తామని సీఎం రేవంత్రెడ్డి హెచ్చరించిన నేపథ్యంలో కదలిక వచ్చింది. -
ఈసెట్లో 95.86% ఉత్తీర్ణత
పాలిటెక్నిక్ డిప్లొమా, బీఎస్సీ గణితం పూర్తయిన విద్యార్థులు లేటరల్ ఎంట్రీ ద్వారా బీటెక్, బీఫార్మసీ రెండో ఏడాదిలో ప్రవేశానికి నిర్వహించిన తెలంగాణ ఈసెట్లో 95.86 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. మొత్తం 11 బ్రాంచీల్లో ప్రవేశాలకు 23,330 మంది ఈసెట్ రాశారు. -
జూన్ 5 నుంచి 11 మధ్య రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు
నైరుతి రుతుపవనాలు వచ్చే నెల 5 నుంచి 11వ తేదీల మధ్య రాష్ట్రాన్ని తాకనున్నాయి. ఈ ఏడాది నైరుతి గమనం సానుకూలంగా ఉండటంతోపాటు ఈ నెలాఖరునే కేరళను తాకనున్నాయి. -
భారీగా పెరిగిన విత్తన పసుపు ధర
రాష్ట్రంలో నిజామాబాద్, మహబూబాబాద్, నిర్మల్, జగిత్యాల జిల్లాల్లో అత్యధికంగా పసుపు సాగవుతుంది. అధిక ఖర్చుతో కూడుకున్న ఈ పంటకు కొన్నేళ్లుగా ఆశించిన ధర రాలేదు. -
విత్తనాలకు రైతుల కుస్తీ
విత్తనాల కోసం రైతులు కుస్తీ పట్టాల్సిన దుస్థితి ఆదిలాబాద్ జిల్లాలో నెలకొంది. వానాకాలం సీజన్ ప్రారంభం కావడంతో డిమాండ్ ఉన్న పత్తి విత్తన రకాల కోసం రైతులు ప్రైవేటు దుకాణాల ఎదుట బారులు తీరి నిల్చున్నారు. -
ఇతర రాష్ట్రాల బార్ సభ్యులనూ అనుమతించాలన్న పిటిషన్లో నోటీసులు
తెలంగాణ పరిధిలో సివిల్ జడ్జి పోస్టులకు ఇతర రాష్ట్రాల బార్ సభ్యులు కూడా దరఖాస్తు చేసుకునేందుకు అనుమతించాలంటూ దాఖలైన కేసులో సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. దిల్లీ బార్ కౌన్సిల్ సభ్యుడైన వి.రాకేష్రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ హృషికేశ్రాయ్, జస్టిస్ ప్రశాంత్కుమార్ మిశ్రల ధర్మాసనం ఇటీవల విచారించింది. -
ఖైదీల రక్షణ బాధ్యత అధికారులదే
కోర్టు తీర్పులతో జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీల రక్షణ బాధ్యత అధికారులదేనని హైకోర్టు స్పష్టం చేసింది. హక్కుల ఉల్లంఘన జరిగినందున పరిహారం ప్రకటించే విచక్షణాధికారం కోర్టుకు ఉందని పేర్కొంది. -
వర్సిటీలు.. అవినీతికి చిరునామాలు
సమాజానికి దిక్సూచిగా మారాల్సిన విశ్వవిద్యాలయాలు అక్రమాలు, అవినీతికి నిలయాలుగా మారాయి. ఆదర్శంగా ఉండాల్సిన ఉపకులపతు(వీసీ)లు కొందరు అక్రమార్జనే ధ్యేయంగా పాలన కొనసాగించారన్న ఆరోపణలు బలంగా ఉన్నాయి. -
కవిత కస్టడీ జూన్ 3 వరకు పొడిగింపు
దిల్లీ మద్యం కేసులో అరెస్టై, ప్రస్తుతం తిహాడ్ జైలులో ఉన్న భారాస ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీని ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి కావేరి బవేజా జూన్ 3 వరకు పొడిగించారు. -
రెవెన్యూ శాఖలో డీటీల పదోన్నతులకు కమిటీ
రెవెన్యూ శాఖలో సీనియర్ అసిస్టెంట్లకు డీటీలుగా పదోన్నతులు కల్పించేందుకు వీలుగా డిపార్ట్మెంటల్ పదోన్నతుల కమిటీని (డీపీసీ) ఏర్పాటు చేస్తూ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్ సోమవారం ఉత్తర్వులిచ్చారు. -
అంతా మెతక వైఖరే
వందల మంది వైకాపా వర్గీయులు రాళ్లు, మారణాయుధాలతో దాడులకు తెగబడితే హత్యాయత్నం సెక్షన్లే పెట్టలేదు. అధికారపార్టీ నాయకులే పోలింగ్ కేంద్రాల్లోకి చొరబడి ఈవీఎంలు ధ్వంసం చేస్తే ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్లు వర్తింపజేయలేదు. -
కాలిఫోర్నియా కోర్టు జడ్జిగా తెలుగు మహిళ జయ బాడిగ
కాలిఫోర్నియాలోని శాక్రమెంటో సుపీరియర్ కోర్టు జడ్జిగా తెలుగు మహిళ జయ బాడిగ నియమితులయ్యారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఈ పదవికి ఎంపికైన తొలి మహిళగా ఈమె గుర్తింపు పొందారు. -
క్రష్ కేంద్రాలపై శిశు సంక్షేమ అధికారుల అధ్యయనం
రాష్ట్రంలో సంఘటిత, అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్న మహిళలు, చిన్నారుల సంరక్షణ కోసం ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ఆరేళ్లలోపు చిన్నారులకు.. సంరక్షణతో పాటు పూర్వప్రాథమిక విద్యను అందించడం, పౌష్టికాహారం, మానసిక వికాసం కోసం అంగన్వాడీ కేంద్రాలను క్రష్ కేంద్రాలుగా మార్చేందుకు ప్రణాళికలు చేస్తోంది. -
జూన్ మొదటి వారానికి గురుకుల ఐదోతరగతి ప్రవేశాలు పూర్తి
రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, సాధారణ సంక్షేమ గురుకుల పాఠశాలల్లో ప్రవేశాలకు తొలిమెట్టు అయిన ఐదో తరగతి ప్రవేశాల ప్రక్రియ జూన్ తొలివారానికి పూర్తిచేయాలని గురుకుల సొసైటీలు నిర్ణయించాయి. -
యాదాద్రీశుడి జయంత్యుత్సవాలకు శ్రీకారం
యాదాద్రిలో నృసింహస్వామి వార్షిక జయంతి మహోత్సవాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఉదయం స్వస్తివాచనం, సాయంత్రం అంకురార్పణ పర్వాలతో ఉత్సవాలకు పూజారులు, యాజ్ఞికులు శ్రీకారం చుట్టారు.
తాజా వార్తలు (Latest News)
-
సాయుధ మూకల అరాచకం.. కాల్పుల్లో 40 మంది మృతి..!
-
వ్యాను ప్రమాదం.. కుటుంబంలో 10 మందిని కోల్పోయి.. ఒంటరిగా మిగిలి!
-
ఆ వాయిస్ నాదే.. చాట్జీపీటీకి హాలీవుడ్ నటి లీగల్ నోటీసు
-
రామేశ్వరం కేఫ్ పేలుడు కేసు.. ఏపీ, తెలంగాణ సహా నాలుగు రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు
-
ఈవీఎంను ధ్వంసం చేసిన వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి.. దృశ్యాలు వెలుగులోకి
-
64ఎంపీ కెమెరాతో వివో కొత్త ఫోన్.. ఫీచర్లు ఇవే..