వడదెబ్బ చికిత్సలకు.. హీట్స్ట్రోక్ క్లినిక్లు
ఎండలు మండిపోతున్నాయి. నిత్యం 40-42 డిగ్రీలు నమోదవుతున్నాయి. రాత్రి వేళల్లో కూడా ఉష్ణోగ్రతలు తగ్గడం లేదు. సోమవారం ఒక్కరోజే రాష్ట్ర వ్యాప్తంగా వడదెబ్బకు 11 మంది మృత్యువాత పడ్డారు.
గాంధీ, ఉస్మానియాల్లో అత్యవసర సేవలు
బేగంపేటలోని మెడికవర్ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన హీట్స్ట్రోక్ ఉచిత క్లినిక్
ఈనాడు, హైదరాబాద్: ఎండలు మండిపోతున్నాయి. నిత్యం 40-42 డిగ్రీలు నమోదవుతున్నాయి. రాత్రి వేళల్లో కూడా ఉష్ణోగ్రతలు తగ్గడం లేదు. సోమవారం ఒక్కరోజే రాష్ట్ర వ్యాప్తంగా వడదెబ్బకు 11 మంది మృత్యువాత పడ్డారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే వైద్య, ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. గాంధీ, ఉస్మానియా ఆసుపత్రులకు ఇలాంటి కేసులు వస్తే...వెంటనే ఏఎంసీలో ప్రత్యేక చికిత్సలు అందించాలని ఆదేశించింది. చికిత్సలకు సంబంధించి ఆయా ఆసుపత్రుల్లో అన్ని ఏర్పాట్లు చేశారు. వడదెబ్బతో వచ్చిన రోగులకు ఏఎంసీకు తరలించి అత్యవసర చికిత్సలు అందిస్తామని ఉస్మానియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్ తెలిపారు. అంతేకాక కొన్ని కార్పొరేట్ ఆసుపత్రులు వడదెబ్బ బారినపడిన వారికి చికిత్సలు అందించేందుకు ప్రత్యేకంగా హీట్స్ట్రోక్ ఉచిత క్లినిక్లు అందుబాటులోకి తెస్తున్నాయి. వృద్ధులు, పిల్లలు, గర్భిణీల్లో ఇది ఎక్కువ ప్రభావం చూపుతుంది.
లక్షణాలు ఇలా....: సాధారణంగా కొన్ని లక్షణాలను బట్టి వడదెబ్బగా గుర్తించాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. శరీర ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్ లేదా అంతకంటే ఎక్కువ పెరిగినప్పుడు వడదెబ్బ బారిన పడే ముప్పు ఉంటుంది. శరీరంలోని నీరంతా చమట రూపంలో బయటకు పోతుంది. ముఖ్యంగా అలసట, తలనొప్పి, తల తిరగడం, వేగంగా గుండె కొట్టుకోవడం, వికారం, పాలిపోయిన చర్మం వంటి లక్షణాలు కన్పిస్తాయి. వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించక పోతే ప్రాణాలు పోయే ప్రమాదం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. తొలుత రోగిని నీడ ప్రాంతానికి తరలించాలి. చల్లని నీటితో స్పాంజ్, ఐస్ ప్యాక్లతో నుదురు, మెడపై ఉంచి చల్లని టవల్తో శరీరాన్ని తుడవాలి. అపస్మారక స్థితిలోకి చేరుకుంటే ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించాలి.
నిర్లక్ష్యం చూపితే... ప్రమాదమే
వడదెబ్బ విషయంలో నిర్లక్ష్యం చూపితే ప్రాణాలకే ప్రమాదం. ఎక్కువ ఆయిల్తో కూడిన ఆహారానికి దూరంగా ఉండాలి. టీ, కాఫీలు తగ్గించాలి. ఆల్కహాల్కు దూరంగా ఉండాలి. ఈ కాలంలో దొరికే కర్బుజా, పుచ్చకాయలు, ఈత కాయలు, తాటి ముంజులు వంటి సీజన్ పండ్లను తీసుకోవాలి. డీహైడ్రేషన్కు గురికాకుండా కాపాడతాయి. కొబ్బరి నీళ్లు మేలు చేస్తాయి. మజ్జిగ అన్నంతో కలిపి మామిడి పండ్లను తీసుకోవడం వల్ల విటమిన్ ఏ, డి శరీరానికి అధిక శాతం అందుతాయి. రోజుకు కనీసం 3-4 లీటర్లు నీళ్లు తీసుకోవాలి. వడదెబ్బ లక్షణాలు కన్పిస్తే...వెంటనే చికిత్స అందించడం అవసరం.
డా.రాజేష్ ఉక్కాల, జనరల్ ఫిజిషియన్, మెడికవర్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రూ.3.22 కోట్లు కాజేసిన అమెజాన్ ఉద్యోగి అరెస్ట్
[ 21-05-2024]
అమెజాన్ సంస్థలో ఉన్నతోద్యోగిగా పనిచేస్తూ.. రాజీనామా చేసిన ఉద్యోగులకు అందాల్సిన సొమ్మును కాజేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. -
ఏసీపీ నివాసంలో 12 గంటలుగా సోదాలు.. బయట పడుతున్న నోట్ల కట్టలు
[ 21-05-2024]
ఆదాయానికి మించి ఆస్తులు కూటబెట్టారనే ఆరోపణలపై సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు ఇళ్లలో అనిశా అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. -
ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండా 30వేల ఉద్యోగాలు ఎలా ఇచ్చారు?: కేటీఆర్
[ 21-05-2024]
ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వకుండా సీఎం రేవంత్రెడ్డి 30వేల ఉద్యోగాలు ఎలా ఇచ్చారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ప్రశ్నించారు. -
కొత్త బ్రాండ్ల మద్యం కోసం ఎవరూ దరఖాస్తు చేయలేదు: మంత్రి జూపల్లి
[ 21-05-2024]
తెలంగాణలో కొత్త మద్యం బ్రాండ్లు తీసుకొస్తున్నామనేది దుష్ప్రచారమేనని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. -
తెలంగాణలో 10 వర్సిటీలకు ఇన్ఛార్జి వీసీలను నియమించిన ప్రభుత్వం
[ 21-05-2024]
తెలంగాణలో 10 యూనివర్సిటీలకు రాష్ట్ర ప్రభుత్వం ఇన్ఛార్జి వీసీలను నియమించింది. -
ఫోన్ల రికవరీలో తెలంగాణది రెండోస్థానం: డీజీ మహేశ్ భగవత్
[ 21-05-2024]
సీఈఐఆర్ పోర్టల్ ద్వారా సెల్ఫోన్ల రికవరీలో తెలంగాణ రెండో స్థానంలో నిలిచింది. -
దక్షిణాది ముగిసింది.. ఉత్తరాది రమ్మంది
[ 21-05-2024]
నగరంలో నాలుగు ఎంపీ సీట్లతో పాటు.. సికింద్రాబాద్ కంటోన్మెంట్ శాసనసభ నియోజకవర్గానికి ఎన్నికలు జరిగాయి. -
వీడియోలు చూసి.. చోరీ చేసి
[ 21-05-2024]
ఎలాగైనా డబ్బు సంపాదించాలి. పేదరికం నుంచి బయటపడాలనే ఉద్దేశంతో నలుగురు దేశ సరిహద్దు దాటారు. -
రేవ్ పార్టీ హైదరాబాద్లో వద్దనుకొని.. బెంగళూరును ఎంచుకుని..
[ 21-05-2024]
బెంగళూరు శివారులో రేవ్ పార్టీ ఉదంతం హైదరాబాద్లో ప్రకంపనలు రేపుతోంది. నగర శివార్లలోని ఫాంహౌస్లలో తరచూ డ్రగ్స్ పట్టుబడడంతో పోలీసులు కఠిన చర్యలకు దిగారు. -
భర్తను వేధిస్తున్న భార్యపై కేసు
[ 21-05-2024]
భర్తను ఎంతోకాలంగా వేధిస్తూ.. చివరకు కూరగాయల కత్తితో దాడికి పాల్పడిన మహిళపై అల్వాల్ పోలీసులు కేసు నమోదు చేశారు. -
వరద కదలక.. దారి వదలక
[ 21-05-2024]
వర్షాకాలం ఇంకా మొదలవలేదు. అడపాదడపా కురిసే అకాల వర్షాలకే నగరంలో పలు కాలనీలు నీట మునుగుతున్నాయి. జనజీవనం స్తంభించిపోతోంది. గంటల తరబడి వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. -
విద్యా ప్రమాణాలు.. ఉపాధికి అవకాశాలు
[ 21-05-2024]
విదేశీ విశ్వవిద్యాలయాలు, ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా విద్యార్థులకు నాణ్యమైన విద్య, ఉపాధి అవకాశాలే లక్ష్యంగా ఉస్మానియా విశ్వవిద్యాలయం, సిటీ కళాశాల న్యాక్ (నేషనల్ అసెస్మెంట్, అక్రిడేషన్ కౌన్సిల్)గుర్తింపు కోసం వడివడిగా అడుగులు వేస్తున్నాయి. -
అనుమతి అడిగితే.. డబ్బులడిగారు!
[ 21-05-2024]
కూల్చిన ప్రహరీ, గదిని పునర్నిర్మించుకోవడానికి ఓ వ్యక్తి అనుమతి కోరగా అతడి నుంచి లంచం తీసుకుంటూ పంచాయతీ కార్యదర్శి, కారోబార్లు అనిశా వలకు చిక్కారు. -
తాగునీటికి ఆరాటం.. ప్రాణాలతో చెలగాటం
[ 21-05-2024]
తాగునీటి కోసం ప్రాణాలతో చెలగాటమాడుతున్న పరిస్థితులకు ఈ చిత్రాలు అద్దం పడుతున్నాయి. బాలానగర్ డివిజన్ రాజీవ్గాంధీనగర్లోని నాలాను ఆనుకొని కొన్ని కుటుంబాలు నివసిస్తున్నాయి. -
గుర్రపు పందేలపై బెట్టింగ్లు.. ఆరుగురి అరెస్ట్
[ 21-05-2024]
గుర్రపు పందేలు కాస్తూ.. బైక్లతో ప్రజలకు ఇబ్బందులు కలిగించడమే కాకుండా బస్సు అద్దాలు పగులగొట్టిన ఘటనల్లో రెండు కేసులు నమోదు చేసినట్లు మహేశ్వరం ఏసీపీ లక్ష్మీకాంత్రెడ్డి తెలిపారు. -
బోటు షికారు.. పోటెత్తిన హుషారు
[ 21-05-2024]
అసలే వేసవి సెలవులు.. అందులోనూ వాతావరణం చల్లగా మారి నాలుగైదు రోజులుగా చినుకులు పలకరిస్తున్నాయి. -
కోడ్ ముగిసిన వెంటనే కొత్త ఎస్టీపీలకు టెండర్లు
[ 21-05-2024]
ఔటర్ పరిధిలో కొత్తగా మురుగునీటి శుద్ధి కేంద్రాల(ఎస్టీపీలు) నిర్మాణానికి జలమండలి ప్రణాళిక రంగం సిద్ధం చేసింది. -
వరదతో కలిసి.. మురుగు తిష్ఠవేసి
[ 21-05-2024]
నగరంలో వర్షం మొదలైందంటే చాలు.. మురుగు రోడ్లను ముంచెత్తుతోంది. ఇటీవల వరుసగా కురుస్తున్న వర్షాలకు మ్యాన్హోళ్ల నుంచి వరద పోటెత్తుతోంది. -
జేఎన్జీపీకి రాష్ట్రస్థాయి ర్యాంకులు
[ 21-05-2024]
ఈసెట్ పరీక్షా ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. రామంతాపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు రాష్ట్రస్థాయిలో ర్యాంకులు సాధించినట్లు ప్రిన్సిపల్ వినయ్కుమార్ తెలిపారు. -
సమస్యల వలయంలో.. సరస్వతీ నిలయాలు
[ 21-05-2024]
జిల్లాలో పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పే సరస్వతీ నిలయాలు సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నాయి. -
ఆరోగ్య పరీక్ష.. బాలింతకు రక్ష
[ 21-05-2024]
పుట్టిన శిశువుతో పాటు తల్లిని కొన్ని రోజుల పాటు జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ విషయాన్ని ప్రత్యేకంగా స్త్రీ వ్యాధి నిపుణులు సూచిస్తుంటారు. -
వరద పారే దారేది..?
[ 21-05-2024]
జిల్లాలో వ్యాపార, వాణిజ్య పట్టణంగా పేరున్న తాండూరులోని పలు కాలనీలకు వర్షా కాలంలో వరద ముప్పు తప్పేలా లేదు. -
పిడుగుపాటుకు మరొకరి మృతి
[ 21-05-2024]
జిల్లాలో తాండూరు, కొడంగల్ నియోజక వర్గాల పరిధిలో పిడుగు పడిన వేర్వేరు ఘటనల్లో ఒకరు మృతి చెందగా, ఓ బాలుడు స్పృహ కోల్పోగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. -
కోర్టు కేసున్న భూమి పట్టా ఎలా మార్చారు?
[ 21-05-2024]
కోర్టు కేసు ఉన్న భూమి పట్టాను ఎలా మార్చారని హక్కుదారులైన మహిళలు తహసీల్దార్తో వాగ్వాదానికి దిగిన ఘటన బషీరాబాద్లో సోమవారం చోటుచేసుకుంది. -
పెట్టుబడులకు లాభాలంటూ మోసం
[ 21-05-2024]
ఆయుర్వేదిక్ కంపెనీలో పెట్టుబడులు పెడితే మంచి లాభాలు వస్తాయని జనాలను నమ్మించి ముగ్గురు నిందితులు రూ.8.23 కోట్లు కొట్టేశారు. -
వానమ్మా.. వానమ్మా ఈ కష్టాలు ఏంటమ్మా
[ 21-05-2024]
వర్షాలు వస్తూవస్తూనే నగర ప్రజలకు కష్టాలను తెస్తున్నాయి. కొన్ని రోజులుగా నిత్యం ఎక్కడో ఒకచోట వర్షం కురుస్తూనే ఉంది. రహదారులపై నీరు నిలుస్తుండటంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. -
కళాకారులు ఎప్పుడూ ప్రజల హృదయాల్లో ఉంటారు
[ 21-05-2024]
కళాకారులు ప్రజల హృదయాల్లో ఉంటారని అలాంటి వారే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అని సినీ నటుడు మురళీమోహన్ కీర్తించారు. -
తెలుగు జాతీయతకు ప్రతీక ప్రకాశం పంతులు
[ 21-05-2024]
తెలుగు జాతీయతకు ప్రతీకగా, ఆంధ్రప్రదేశ్ నిర్మాతగా, అలుపెరుగని కార్యదీక్షాపరుడు ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు అని మంత్రి శ్రీధర్బాబు కీర్తించారు. -
ప్రవాసాంధ్రుల ఆస్తుల రక్షణకు మంత్రి హామీ
[ 21-05-2024]
తెలంగాణలోని ప్రవాసాంధ్రుల ఆస్తులకు రక్షణను కల్పిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చినట్లు నగరానికి చెందిన ప్రవాసాంధ్రుడు వడ్డేపల్లి రామకృష్ణ సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. -
సన్నవడ్లకు క్వింటాల్కు ₹500బోనస్.. TG కేబినెట్ కీలక నిర్ణయాలివే..
[ 21-05-2024]
తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మూడు గంటలకు పైగా కొనసాగిన ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
మరో వీడియో పోస్ట్ చేసిన నటి హేమ
-
సొంత పార్టీలో వైరుధ్యాల వల్లే.. కర్ణాటక ప్రభుత్వం కూలిపోతుంది - మాజీ సీఎం
-
బ్రిజ్ భూషణ్కు షాక్.. అభియోగాలు నమోదు
-
సందేశ్ఖాలీకి వెళ్తాను: మమతా బెనర్జీ
-
రూ.3.22 కోట్లు కాజేసిన అమెజాన్ ఉద్యోగి అరెస్ట్
-
ఏసీపీ నివాసంలో 12 గంటలుగా సోదాలు.. బయట పడుతున్న నోట్ల కట్టలు