కొండ కోనల్లోంచి.. ఆసుపత్రికి చేర్చి
కొండ కోనల్లో ఉండే మహిళలకు కడుపులో బిడ్డ పడినప్పటి నుంచి ప్రసవమయ్యే వరకు దినదిన గండమే. ఎప్పుడు ఇబ్బంది వచ్చినా వైద్యం కోసం సాహసం చేయక తప్పని పరిస్థితి. డోలీ కట్టి కిలోమీటర్ల మేర మోసుకెళ్తే కానీ ఆసుపత్రికి చేరుకోలేని దయనీయ స్థితి. ఇటువంటి పరిస్థితుల్లో 2వేల అడుగుల ఎత్తులోనున్న గిరిజన గూడెం నుంచి గర్భిణీని తరలించేందుకు ఓ కుటుంబం చేసిన పోరాటం అనన్య సామాన్యం
పాడేరు: విశాఖ మన్యంలో కొండలు, కోనలకు లెక్కే లేదు. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా వేలాది అడుగుల కొండలపై నుంచి ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని కిందికి దిగి రావాల్సిందే. ఇక అలాంటి చోటు నుంచి గర్భిణులను ఆసుపత్రులకు తీసుకువెళ్లడమంటే ఎంతో కష్టం. అందుకోసం అడవి బిడ్డలు అతి పెద్ద సాహసం చేయక తప్పదు. పాడేరు మండలం దేవాపురం పంచాయతీ కూడా అలాంటిదే. అత్యంత ఎత్తైన కొండల మీద ఉంటుంది. ఆ పరిధిలోని హనుమంతపురంలో నివాసం ఉండే ఓ నిండు గర్భిణికి పురిటి నొప్పులు వచ్చాయి. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా నలుగురు కుటుంబ సభ్యులు కలిసి పోరాటం ప్రారంభించారు. డోలీ కట్టి గర్భిణిని మోసుకుంటూ కొండ మార్గాన సాహసోపేతంగా అడుగులు వేశారు. ఏ మాత్రం అడుగు తడబడినా ప్రాణగండం తప్పదనేలా ఉన్న చిత్తడి కొండలపై అత్యంత జాగ్రత్తగా ముందుకు సాగారు. అలా కొన్ని కిలోమీటర్ల మేర పయనించి దూరాన ఉన్న మాడుగుల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు.
గిరిజన గూడేల నుంచి డోలీ కట్టి గర్భిణులను తరలించడం నిత్యకృత్యమే. కానీ హనుమంతపురం లాంటి చోటి నుంచి వెళ్లడం మాత్రం ఒకరకంగా పర్వతం మీది నుంచి దిగినట్లే. అతిపెద్ద చెట్లు, ఎటు చూసినా గుబురు పొదలు, పెద్దపెద్ద బండరాళ్లతో ప్రమాదకరంగా ఉండే కొండలపై నుంచి కిందికి రావాలంటే కాసేపటికే కాళ్లు పట్టేస్తాయి. అంత కష్టతరమైన ప్రాంతం నుంచి గర్భిణిని మోసుకెళ్లడం అంటే అంతకు మించిన సాహసం మరొకటి ఉండదేమో. అయినా పట్టు సడకలకుండా అకుంఠిత దీక్షతో మాడుగుల చేరుకున్న గిరిపుత్రులు నిజంగా సాహస వీరులే. పాడేరు ఐటీడీఏ పరిధిలో ఏ సమావేశం జరిగినా మంత్రులు, ప్రజాప్రతినిధుల నోట కచ్చితంగా వినపడే మాట డోలీ కష్టాలే. ఏళ్లుగా ఆడబిడ్డలు పడుతున్న ఈ కష్టాలను కడతేరుస్తామని హామీలిచ్చే నేతలు.. తరువాత మరచిపోతూనే ఉన్నారు. కొన్ని దశాబ్దాలుగా గిరిజనం బతుకు పోరాటం సాగిస్తూనే ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీఎం రేవంత్ రెడ్డికి దిల్లీ పోలీసుల సమన్లు
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా వీడియో మార్ఫింగ్ కేసులో సీఎం రేవంత్ రెడ్డికి దిల్లీ పోలీసులు సమన్లు జారీ చేశారు. -
దేవుడు న్యాయం పక్షానే ఉంటాడు: బ్రదర్ అనిల్
దేవుడు ఎవరికీ అన్యాయం చేయడని, న్యాయం పక్షానే ఉంటాడని బ్రదర్ అనిల్ అన్నారు. ఒకరిపై ఒకరు అభాండాలు వేసుకోవడం సరికాదన్నారు. -
శంషాబాద్ ఎయిర్పోర్టు పరిసరాల్లో చిరుత కోసం కొనసాగుతున్న గాలింపు
శంషాబాద్ ఎయిర్పోర్టు పరిసరాల్లో చిరుత ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతోంది. ట్రాప్ కెమెరాలతో పాటు బోన్లను అటవీశాఖ అధికారులు ఏర్పాటు చేశారు. -
దక్షిణ మధ్య రైల్వే పరిధిలో మరిన్ని వేసవి ప్రత్యేక రైళ్లు..
వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే (SCR) మరిన్ని ప్రత్యేక రైళ్లు నడిపేందుకు సిద్ధమైంది. ఏప్రిల్ 27 నుంచి మే నెలాఖరు వరకు ఈ రైళ్లు అందుబాటులో ఉండనున్నాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఇసుక అక్రమ తవ్వకాలు.. ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్రంలో జరుగుతున్న ఇసుక అక్రమ తవ్వకాలపై సర్వోన్నత న్యాయస్థానం మండిపడింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/04/24)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల్లో వాడే ‘సిరా’ చుక్క ఎందుకు చెరిగిపోదు.. ఆసక్తికర విషయాలు
-
వ్యక్తుల ప్రయోజనాల కోసం సుప్రీంకోర్టుకు రాష్ర్ట ప్రభుత్వమా ?
-
సీఎం రేవంత్ రెడ్డికి దిల్లీ పోలీసుల సమన్లు
-
భారీ లాభాల్లో సూచీలు.. సెన్సెక్స్ 900+, నిఫ్టీ 220+
-
దేవుడు న్యాయం పక్షానే ఉంటాడు: బ్రదర్ అనిల్
-
వీధి వ్యాపారిని కలిసిన మోదీ.. ఈ మోహిని గౌడ గురించి తెలుసా?