TTD: నడక దారి భక్తులకు త్వరలో టోకెన్లు... శ్రీవారి మెట్టు మార్గంలో 5 నుంచి అనుమతి
తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన శనివారం జరిగిన పాలకమండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
తిరుమల: తిరుమల వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు అన్ని విభాగాలు సమన్వయంతో కృషి చేస్తున్నాయని తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. తిరుమల అన్నమయ్య భవన్లో శనివారం పాలకమండలి సమావేశం నిర్వహించారు. సమావేశం ముగిసిన తర్వాత పాలకమండలి నిర్ణయాలను వైవీ సుబ్బారెడ్డి మీడియాకు వెల్లడించారు.
తితిదే నిర్ణయాలు...
*టైం స్లాట్ దర్శనాలు, టోకెన్లు కొనసాగించాలని తితిదే నిర్ణయం.
* నడక దారి భక్తులకు త్వరలో టోకెన్ల జారీ ప్రక్రియ.
* తిరుమల బాలాజీనగర్ వద్ద 2.86 ఎకరాల విస్తీర్ణంలో ఎలక్ట్రిక్ బస్ స్టేషన్ ఏర్పాటు.
* శ్రీవారి మెట్టుమార్గంలో మే 5 నుంచి భక్తులకు అనుమతి.
* శ్రీనివాస సేతు రెండోదశ పనులకు రూ.100కోట్లు కేటాయింపు.
* తితిదే ఉద్యోగుల వసతి గృహాల ఆధునికీకరణకు రూ.19.40కోట్లు.
* ఇకపై వస్తురూపంలో విరాళాలు ఇచ్చే దాతలకూ ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని నిర్ణయించినట్లు సుబ్బారెడ్డి వెల్లడించారు.
నవీ ముంబయిలో శ్రీవారి ఆలయ నిర్మాణం...
మహరాష్ట్ర నవీ ముంబయిలో తిరుమల శ్రీవారి ఆలయ నిర్మాణానికి 10ఎకరాల స్థలాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఈ మేరకు శనివారం జరిగిన తితిదే బోర్డు సమావేశం ప్రారంభంలో భూమి పత్రాలను మహారాష్ట్ర మంత్రి ఆదిత్య ఠాక్రే తితిదే ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డికి అందజేశారు. ఆలయ నిర్మాణానికి రేమండ్ సంస్థ ముందుకొచ్చింది. ఆలయ నిర్మాణానికి అయ్యే మొత్తం ఖర్చును తామే భరిస్తామని రేమండ్ గ్రూప్ చైర్మన్, ఎండీ తరఫున ఆ సంస్థ వైస్ ప్రెసిడెంట్ హామీ ఇచ్చినట్లు తితిదే తెలిపింది. భూమిని కేటాయించినందుకు మహారాష్ట్ర ప్రభుత్వానికి, ఆలయ నిర్మాణానికి ముందుకొచ్చిన రేమండ్ గ్రూప్ చైర్మన్ కు తితిదే ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ సంచలన ఆరోపణలు చేశారు. -
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
రాష్ట్రంలో 3 రోజుల పాటు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు
-
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?
-
భారతీయులైతేనే.. అమెరికాలో సీఈవో ఛాన్స్: రాయబారి ఆసక్తికర వ్యాఖ్య
-
సల్మాన్ఖాన్ ఇల్లు మారుతున్నారా?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM